అభిమానులతో సహా అందరిలోనూ ఉన్న సందేహం ఒకటే. ఏపీ ఉపముఖ్యమంత్రిగా ఎడతెగని బిజీగా ఉన్న పవన్ కళ్యాణ్ ఇప్పుడు బ్యాలన్స్ ఉన్నవి కాకుండా కొత్త సినిమాలు చేస్తాడా లేదాని. హరిహర వీరమల్లు, ఓజిలు ఇంకొంచెం పెండింగ్ ఉన్నాయి. ఉస్తాద్ భగత్ సింగ్ ఉంటుందో లేదోననే అనుమానాలు మొదలయ్యాయి. సురేందర్ రెడ్డికి గతంలో ఓకే చేసిన ప్రాజెక్టు క్యాన్సిలనే టాక్ వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో పవన్ స్వయంగా చెబితే తప్ప క్లారిటీ రాని పరిస్థితిలో ఎట్టకేలకు సమాధానం దొరికేసింది. తాజాగా ఒక తమిళ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పవన్ కళ్యాణ్ తన మనోగతాన్ని వివరించారు.
డబ్బు అవసరం ఉన్నంత కాలం సినిమాలు ఆపనని, కాకపోతే పాలన వ్యవహారాలకు సంబంధించి ఎలాంటి రాజీ పడకుండానే రెండు బ్యాలన్స్ చేసేలా ప్లాన్ చేస్తానని వివరించారు. జనసేన నిర్వహణ, ప్రచారం, సహాయాలు, విరాళాలు, దత్తతలు ఇలా ఎన్నో కార్యక్రమాల కోసం పవన్ కు ఆర్థిక మద్దతు ఎప్పటికప్పుడు అవసరమవుతూనే ఉంటుంది. కానీ వినడానికి బాగానే ఉంది కానీ పవన్ అంత సులభంగా కొత్త కమిట్ మెంట్లు ఇచ్చే సీన్ కనిపించడం లేదు. మార్చి 29 రావాల్సిన వీరమల్లు వాయిదా పడింది డిప్యూటీ సిఎం బిజీ షెడ్యూల్స్ వల్లే కదా. మరి కొత్తవి ఒప్పుకుంటే వాటికి న్యాయం చేయాగలగాలి కదా.
ఇక్కడో సానుకూలంశాన్ని గమనించుకోవచ్చు. కూటమి మొదటి ఏడాది కాబట్టి పవన్ అన్ని దగ్గరుండి చూసుకుంటున్నారు. ఒక్కసారి సిస్టం సెట్ అయ్యాక క్రమంగా సినిమాలు చేసుకోవచ్చు. తక్కువ డేట్లలో వేగంగా పూర్తయ్యేలా భీమ్లా నాయక్, వకీల్ సాబ్, బ్రో లాంటివి ఎంచుకుంటే ఉభయకుశలోపరిగా ఉంటుంది. అలా కాకూండా హరిహర వీరమల్లు, ఓజి లాంటి ప్యాన్ ఇండియా గ్రాండియర్స్ అంటేనే చిక్కొస్తుంది. ఎలాగూ త్రివిక్రమ్ సలహాలు సూచనలు ఉంటాయి కాబట్టి రెండు పడవల ప్రయాణం పవన్ కళ్యాణ్ కు కష్టమేమీ కాదు. చాలా గ్యాప్ తర్వాత మే 9 పవర్ స్టార్ దర్శనం కోసం అభిమానులు ఎదురు చూస్తున్నారు.
This post was last modified on March 24, 2025 10:37 am
జెనీలియా డిసౌజా.. ఈ పేరెత్తగానే తెలుగు ప్రేక్షకులకు ఎప్పుడూ నవ్వుతూ కనిపించే అమ్మాయి గుర్తుకు వస్తుంది. ‘బొమ్మరిల్లు’లో హహ హాసిని…
తెలుగు రాష్ట్రాల మధ్య విభజన వ్యాఖ్యలపై మరోసారి చర్చ మొదలైంది. తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా…
ప్రధాని నరేంద్ర మోదీ స్కిన్ టోన్పై సోషల్ మీడియాలో చర్చ జోరందుకుంది. రెండు వేర్వేరు ప్రాంతాల్లో చిత్రీకరించిన వీడియోల్లో ఆయన…
మొన్న శుక్రవారం విడుదలైన తిమ్మరాజుపల్లి టీవీకి ప్రమోషన్లయితే ఘనంగా జరిగాయి. ఈవెంట్లు, ప్రెస్ మీట్లు, ఇంటర్వ్యూలు అన్నీ చేశారు. నిర్మాత…
అనుకున్నంతా అయ్యింది. జూనియర్ ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కలయికలో తెరకెక్కుతున్న ప్యాన్ ఇండియా మూవీ ఈ ఏడాది రావడం లేదు.…
గత ఏడాది ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో అతి పెద్ద సర్ప్రైజ్ అంటే.. ‘మహావతార నరసింహా’నే. పెద్దగా అంచనాలు లేకుండా విడుదలైన…