టీజర్ నుంచి పాటల దాకా ప్రశంసల కన్నా ఎక్కువగా ట్రోలింగ్ కు గురవుతున్న సల్మాన్ ఖాన్ సికందర్ ట్రైలర్ ఇవాళ వచ్చేసింది. ముంబైలో జరిగిన గ్రాండ్ ఈవెంట్ లో రిలీజ్ చేశారు. మే 30 విడుదల దూరం లేకపోవడంతో బయ్యర్ల ఆశలన్నీ దీని మీదే ఉన్నాయి. ఛావా తర్వాత బాక్సాఫీస్ కు జోష్ ఇచ్చే బొమ్మ ఇదే అవుతుందనే నమ్మకంతో ఉన్నారు. అందులోనూ హ్యాట్రిక్ బ్లాక్ బస్టర్లతో ఊపు మీదున్న రష్మిక మందన్న హీరోయిన్ కావడం, ఏఆర్ మురుగదాస్ దర్శకత్వం, సంతోష్ నారాయణన్ సంగీతం అంతో ఇంతో అంచనాలను సజీవంగా ఉంచాయి. తీరా మూడు నిమిషాల వీడియో చూశాక నిరాశపడటం ఖాయం.
ఎందుకంటే సికందర్ పక్కా మన సౌత్ సినిమాల మిక్స్చర్ లా కనిపించింది. ఎక్కడో రాజ్ కోట్ లో ఒక యువకుడు సికందర్ (సల్మాన్ ఖాన్). సమాజమంటే చాలా మక్కువ. ఏదో చేయాలని తాపత్రయపడుతుంటాడు. ప్రియురాలు (రష్మిక మందన్న) వెన్నంటే ఉంటుంది. ఈలోగా ఒక మిషన్ మీద ముంబై రావాల్సి వస్తుంది. అక్కడో బ్రాహ్మణ కుటుంబంతో పరిచయం. వాళ్ళ అమ్మాయి (కాజల్ అగర్వాల్) తో దోస్తీ. కట్ చేస్తే ఓ విషాదం చోటు చేసుకుని సికందర్ చాలా కోల్పోతాడు. దీనికి కారణమైన వాడిని (సత్యరాజ్) మట్టుపెట్టేందుకు బయలుదేరతాడు. ఆ తర్వాత ఏం జరుగుతోంది క్లైమాక్స్ చూడకుండానే చెప్పొచ్చు.
మురుగదాస్ ఎలాంటి రిస్క్ తీసుకోకుండా రెగ్యులర్ టెంప్లేట్ లో వెళ్ళిపోయాడు. సర్కార్, ఠాగూర్ షేడ్స్ పుష్కలంగా ఉన్నాయి. ముఖ్యంగా ఒక కీలక ఎపిసోడ్ లో అయినవాళ్లంతా చనిపోవడం చిరంజీవి – జ్యోతికలను గుర్తుకు తెస్తుంది. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా ఏమంత గొప్పగా లేదు. జవాన్, పఠాన్ లాంటి ట్రైలర్లు చూసినప్పుడు ఏదైతే పాజిటివ్ ఫీల్ కలిగిందో అది సికందర్ ఇవ్వలేదు. మరి అసలు కంటెంట్ ఏమైనా సర్ప్రైజ్ ఇస్తుందేమో చూడాలి. మార్చ్ 30 ఆదివారం రోజు థియేటర్లలు అడుగు పెడుతున్న కండల వీరుడు ఈద్ పండగ జరుపుకున్న ఫ్యాన్స్ కి కానుక ఇస్తాడో షాక్ ఇస్తాడో వేచి చూడాలి.
ఈ మధ్య రిలీజ్ డేట్ ప్రకటించాక ఎంత ప్లాన్డ్ గా పనులు చేసినా చివరి నిమిషం వరకు వాయిదా ఉండదన్న…
మలయాళంలో బ్లాక్ బస్టర్ అవ్వొచ్చేమో కానీ తెలుగులో మాత్రం దృశ్యం 3ని ఫ్లాప్ గానే పరిగణించాలి. తక్కువ బిజినెస్ చేయడం…
మీలాగా మేం ఫామ్ హౌస్లో పడుకోవట్లే - అంటూ తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క.. బీఆర్ఎస్ పార్టీపై ఓ…
స్వతంత్ర దేశంలో చావు కూడా పెళ్లిలాంటిదే అన్నట్టుగా వైసీపీ నాయకులకు ఎక్కడ ఎలా వ్యవహరించాలో తెలియడం లేదన్న విమర్శలు వస్తున్నాయి.…
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) ఇంచార్జీ మీనాక్షి నటరాజన్ కు నిజంగానే షాక్…
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేష్లు.. కూటమి ప్రభుత్వంలో కీలక రోల్ పోషిస్తున్న విషయం తెలిసిందే.…