టాలీవుడ్ ప్యాన్ ఇండియా సినిమాల షూటింగ్ ఏ దశలో ఉన్నా విడుదల తేదీలు కనీసం ఏడాది ముందు రిజర్వ్ చేసుకోవాల్సిన పరిస్థితి ప్రస్తుతముంది. ఒకవేళవాయిదా పడే అవకాశమున్నా ముందు జాగ్రత్త చర్యగా డేట్లు లాక్ చేసుకుంటున్న ట్రెండ్ ని మనోళ్లు సీరియస్ గా ఫాలో అవుతున్నారు. నాని ది ప్యారడైజ్ ఇంకా రెగ్యులర్ షూట్ వెళ్లకపోయినా అనౌన్స్ మెంట్ టీజర్ లో వచ్చే సంవత్సరం మార్చి 26 థియేటర్లలో అడుగు పెడుతుందని అధికారికంగా ప్రకటించారు. ఒకవేళ ఎవరైనా పోటీకి వచ్చే ఉద్దేశంతో వాళ్లకు ముందే హింట్ ఇచ్చినట్టు అవుతుందనే కారణం కావొచ్చు. కానీ రామ్ చరణ్ క్లాష్ ఉండొచ్చని లేటెస్ట్ అప్డేట్.
బుచ్చిబాబు దర్శకత్వంలో రూపొందుతున్న ఇంకా టైటిల్ నిర్ణయించని విలేజ్ స్పోర్ట్స్ డ్రామాని 2026 మార్చి 26 విడుదల చేయాలని ప్రాథమికంగా నిర్ణయించుకున్నట్టు యూనిట్ లీక్. నిజానికి ఈ ఏడాది దసరా లేదా దీపావళికి వస్తుందని ఫ్యాన్స్ భావించారు. దానికి తగ్గట్టే చిత్రీకరణ చాలా వేగంగా జరుగుతోంది. జాన్వీ కపూర్, శివరాజ్ కుమార్, జగపతిబాబు, దివ్యేన్దు సహా మెయిన్ ఆర్టిస్టులందరూ పూర్తిగా సహకరిస్తూ పాల్గొంటున్నారు. అలాంటప్పుడు ఆలస్యమనే మాటే ఉండదు. కానీ ఏఆర్ రెహమాన్ ఇంకా రెండు పాటలివ్వాలి. వాటితో పాటు రికార్డు అయినవి తీయాలి. రీ రికార్డింగ్, పోస్ట్ ప్రొడక్షన్ కు ఎక్కువ సమయం కేటాయించాలి.
ఇవన్నీ చూసుకుంటే సెప్టెంబర్ లేదా అక్టోబర్ లో రావడం అసాధ్యం. అందుకే ఈ టెన్షన్ లేకుండా ప్రశాంతంగా వచ్చే సంవత్సరం వద్దామని ప్లాన్ చేస్తున్నారట. వచ్చే వారం మార్చి 27 రామ్ చరణ్ బర్త్ డే. ఆ రోజే ‘పెద్ది’ టైటిల్ తో పాటు రిలీజ్ డేట్ ని ప్రకటించే అవకాశం ఉందని విశ్వసనీయ సమాచారం. అదే నిజమైన పక్షంలో నాని వర్సెస్ రామ్ చరణ్ ఫైట్ తప్పకపోవచ్చు. అయినా ఇంకా చాలా టైం ఉంది కాబట్టి ఇప్పటికిప్పుడే ఈ బాక్సాఫీస్ ఫైట్ గురించి అంచనాకు రాలేం కానీ రెండు ప్రెస్టిజియస్ మూవీ ఒకే రోజు తలపడటం సేఫ్ కాదు. ఆర్ఆర్ఆర్, రంగస్థలం మార్చిలోనే వచ్చాయి కాబట్టి ఆ సెంటిమెంట్ ఏమైనా చూస్తున్నారేమో.
This post was last modified on March 21, 2025 12:14 pm
కంటి ముందు కెమెరా, యూట్యూబ్ ఫాలోయర్స్ ఉంటే చాలు కొందరు ఏం మాట్లాడినా చెల్లిపోతుందని అనుకుంటున్నారు. వీళ్ళ వల్ల సోషల్…
బీఆర్ ఎస్ కీలక నాయకుడు, మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్రావు.. తన ఇంటిని తాకట్టు పెట్టారు. బ్యాంకు అధికారుల వద్దుకు…
పార్టీ పటిష్టంగా ఉండాలన్నా, ప్రజలకు పారదర్శకంగా సంక్షేమ పథకాలు అందాలన్నా ఆ పార్టీ ప్రజా ప్రతినిధులే కీలకం. రాజకీయాల్లో ఈ…
దేశంలో అత్యధిక సినీ అభిమానం ఉన్న ప్రేక్షకులుగా తెలుగు ఆడియన్సుకి పేరుంది. తెలుగు రాష్ట్రాలు రెంటినీ కలిపి ఒక యూనిట్…
జగిత్యాల జిల్లాలోని ప్రసిద్ధ కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయ అభివృద్ధికి తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) రూ.30 కోట్ల నిధులను…
అటు ఢిల్లీలో కేంద్ర మంత్రులను కలిసి ఏపీకి నిధులు మంజూరు అయ్యేలా ప్రయత్నాలు చేస్తుంటారు. ఇటు తన శాఖలను సమర్థవంతంగా…