టాలీవుడ్ ప్యాన్ ఇండియా సినిమాల షూటింగ్ ఏ దశలో ఉన్నా విడుదల తేదీలు కనీసం ఏడాది ముందు రిజర్వ్ చేసుకోవాల్సిన పరిస్థితి ప్రస్తుతముంది. ఒకవేళవాయిదా పడే అవకాశమున్నా ముందు జాగ్రత్త చర్యగా డేట్లు లాక్ చేసుకుంటున్న ట్రెండ్ ని మనోళ్లు సీరియస్ గా ఫాలో అవుతున్నారు. నాని ది ప్యారడైజ్ ఇంకా రెగ్యులర్ షూట్ వెళ్లకపోయినా అనౌన్స్ మెంట్ టీజర్ లో వచ్చే సంవత్సరం మార్చి 26 థియేటర్లలో అడుగు పెడుతుందని అధికారికంగా ప్రకటించారు. ఒకవేళ ఎవరైనా పోటీకి వచ్చే ఉద్దేశంతో వాళ్లకు ముందే హింట్ ఇచ్చినట్టు అవుతుందనే కారణం కావొచ్చు. కానీ రామ్ చరణ్ క్లాష్ ఉండొచ్చని లేటెస్ట్ అప్డేట్.
బుచ్చిబాబు దర్శకత్వంలో రూపొందుతున్న ఇంకా టైటిల్ నిర్ణయించని విలేజ్ స్పోర్ట్స్ డ్రామాని 2026 మార్చి 26 విడుదల చేయాలని ప్రాథమికంగా నిర్ణయించుకున్నట్టు యూనిట్ లీక్. నిజానికి ఈ ఏడాది దసరా లేదా దీపావళికి వస్తుందని ఫ్యాన్స్ భావించారు. దానికి తగ్గట్టే చిత్రీకరణ చాలా వేగంగా జరుగుతోంది. జాన్వీ కపూర్, శివరాజ్ కుమార్, జగపతిబాబు, దివ్యేన్దు సహా మెయిన్ ఆర్టిస్టులందరూ పూర్తిగా సహకరిస్తూ పాల్గొంటున్నారు. అలాంటప్పుడు ఆలస్యమనే మాటే ఉండదు. కానీ ఏఆర్ రెహమాన్ ఇంకా రెండు పాటలివ్వాలి. వాటితో పాటు రికార్డు అయినవి తీయాలి. రీ రికార్డింగ్, పోస్ట్ ప్రొడక్షన్ కు ఎక్కువ సమయం కేటాయించాలి.
ఇవన్నీ చూసుకుంటే సెప్టెంబర్ లేదా అక్టోబర్ లో రావడం అసాధ్యం. అందుకే ఈ టెన్షన్ లేకుండా ప్రశాంతంగా వచ్చే సంవత్సరం వద్దామని ప్లాన్ చేస్తున్నారట. వచ్చే వారం మార్చి 27 రామ్ చరణ్ బర్త్ డే. ఆ రోజే ‘పెద్ది’ టైటిల్ తో పాటు రిలీజ్ డేట్ ని ప్రకటించే అవకాశం ఉందని విశ్వసనీయ సమాచారం. అదే నిజమైన పక్షంలో నాని వర్సెస్ రామ్ చరణ్ ఫైట్ తప్పకపోవచ్చు. అయినా ఇంకా చాలా టైం ఉంది కాబట్టి ఇప్పటికిప్పుడే ఈ బాక్సాఫీస్ ఫైట్ గురించి అంచనాకు రాలేం కానీ రెండు ప్రెస్టిజియస్ మూవీ ఒకే రోజు తలపడటం సేఫ్ కాదు. ఆర్ఆర్ఆర్, రంగస్థలం మార్చిలోనే వచ్చాయి కాబట్టి ఆ సెంటిమెంట్ ఏమైనా చూస్తున్నారేమో.
This post was last modified on March 21, 2025 12:14 pm
ఒకప్పుడు టాలీవుడ్లో తిరుగులేని ఆధిపత్యం చలాయించిన కథానాయికల్లో తమన్నా ఒకరు. టీనేజీలోనే కథానాయిక అవతారం ఎత్తిన ఆమె పదేళ్లకు పైగానే టాప్…
థియేటర్, ఓటిటి మధ్య ఖచ్చితంగా ఎనిమిది వారాల గ్యాప్ ఉండాలనే నిబంధన మీద దక్షిణాది ఇండస్ట్రీ పెద్దలు చాలా సీరియస్…
అధికారంలోకి రావడానికి ముందు వరకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చాలా ఫెరోషియస్గా కనిపించేవారు. అవినీతి కేసుల వ్యవహారం పక్కన పెడితే…
‘బాహుబలి’ సినిమాకు బాలీవుడ్ నుంచి అప్పట్లో ఎంత గొప్ప సహకారం అందిందో తెలిసిందే. కరణ్ జోహార్ లాంటి అగ్ర నిర్మాత ఆ…
మోనాలిసా.. గత ఏడాది సోషల్ మీడియాను ఒక ఊపు ఊపేసిన పేరిది. ఉత్తర్ప్రదేశ్లో జరిగిన మహా కుంభమేళాతో వెలుగులోకి వచ్చిన…
తెలంగాణ ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్, మాజీ మంత్రి పార్టీ కీలక…