టాలీవుడ్ ప్యాన్ ఇండియా సినిమాల షూటింగ్ ఏ దశలో ఉన్నా విడుదల తేదీలు కనీసం ఏడాది ముందు రిజర్వ్ చేసుకోవాల్సిన పరిస్థితి ప్రస్తుతముంది. ఒకవేళవాయిదా పడే అవకాశమున్నా ముందు జాగ్రత్త చర్యగా డేట్లు లాక్ చేసుకుంటున్న ట్రెండ్ ని మనోళ్లు సీరియస్ గా ఫాలో అవుతున్నారు. నాని ది ప్యారడైజ్ ఇంకా రెగ్యులర్ షూట్ వెళ్లకపోయినా అనౌన్స్ మెంట్ టీజర్ లో వచ్చే సంవత్సరం మార్చి 26 థియేటర్లలో అడుగు పెడుతుందని అధికారికంగా ప్రకటించారు. ఒకవేళ ఎవరైనా పోటీకి వచ్చే ఉద్దేశంతో వాళ్లకు ముందే హింట్ ఇచ్చినట్టు అవుతుందనే కారణం కావొచ్చు. కానీ రామ్ చరణ్ క్లాష్ ఉండొచ్చని లేటెస్ట్ అప్డేట్.
బుచ్చిబాబు దర్శకత్వంలో రూపొందుతున్న ఇంకా టైటిల్ నిర్ణయించని విలేజ్ స్పోర్ట్స్ డ్రామాని 2026 మార్చి 26 విడుదల చేయాలని ప్రాథమికంగా నిర్ణయించుకున్నట్టు యూనిట్ లీక్. నిజానికి ఈ ఏడాది దసరా లేదా దీపావళికి వస్తుందని ఫ్యాన్స్ భావించారు. దానికి తగ్గట్టే చిత్రీకరణ చాలా వేగంగా జరుగుతోంది. జాన్వీ కపూర్, శివరాజ్ కుమార్, జగపతిబాబు, దివ్యేన్దు సహా మెయిన్ ఆర్టిస్టులందరూ పూర్తిగా సహకరిస్తూ పాల్గొంటున్నారు. అలాంటప్పుడు ఆలస్యమనే మాటే ఉండదు. కానీ ఏఆర్ రెహమాన్ ఇంకా రెండు పాటలివ్వాలి. వాటితో పాటు రికార్డు అయినవి తీయాలి. రీ రికార్డింగ్, పోస్ట్ ప్రొడక్షన్ కు ఎక్కువ సమయం కేటాయించాలి.
ఇవన్నీ చూసుకుంటే సెప్టెంబర్ లేదా అక్టోబర్ లో రావడం అసాధ్యం. అందుకే ఈ టెన్షన్ లేకుండా ప్రశాంతంగా వచ్చే సంవత్సరం వద్దామని ప్లాన్ చేస్తున్నారట. వచ్చే వారం మార్చి 27 రామ్ చరణ్ బర్త్ డే. ఆ రోజే ‘పెద్ది’ టైటిల్ తో పాటు రిలీజ్ డేట్ ని ప్రకటించే అవకాశం ఉందని విశ్వసనీయ సమాచారం. అదే నిజమైన పక్షంలో నాని వర్సెస్ రామ్ చరణ్ ఫైట్ తప్పకపోవచ్చు. అయినా ఇంకా చాలా టైం ఉంది కాబట్టి ఇప్పటికిప్పుడే ఈ బాక్సాఫీస్ ఫైట్ గురించి అంచనాకు రాలేం కానీ రెండు ప్రెస్టిజియస్ మూవీ ఒకే రోజు తలపడటం సేఫ్ కాదు. ఆర్ఆర్ఆర్, రంగస్థలం మార్చిలోనే వచ్చాయి కాబట్టి ఆ సెంటిమెంట్ ఏమైనా చూస్తున్నారేమో.
This post was last modified on March 21, 2025 12:14 pm
కరణం బలరామకృష్ణమూర్తి.. రాజకీయ ఉద్ధండుడిగా పేరొందిన ఉమ్మడి ప్రకాశం జిల్లాకు చెందిన నేత. కుమారుడు కరణం వెంకటేష్ను ఎమ్మెల్యేగా చూసుకోవాలన్న…
నియోజకవర్గాల పునర్విభజన అనూహ్య పరిణామాల నేపథ్యంలో అలా వెనక్కెళ్లిపోయింది. దక్షిణాది, ఈశాన్య రాష్ట్రాలకు తీరని అన్యాయం అంటూ కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా…
బ్లాక్ బస్టర్ సినిమాల వెనుక కొన్ని వేల మంది కష్టం దాగి ఉంటుంది. కాకపోతే ప్రేక్షకులకది అనవసరం. థియేటర్ లో…
ప్రతి నెల ఒకటో తారీకు కోసం ఉద్యోగులు ఎదురు చూడడం సహజం. కారణం నెలంతా కష్టపడితే జీవితాలు అకౌంట్ లో…
తెలంగాణలో కొత్త పార్టీ పెట్టేందుకు రెడీ అయిన మాజీ సీఎం, బీఆర్ ఎస్ అధినేత కేసీఆర్.. తనయ కవిత.. నిన్న…
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ముగిసింది. ఎన్నికల సంఘం నిబంధనల మేరకు మంగళవారం సాయంత్రం 5 గంటలకే అన్ని పార్టీలు..…