సంక్రాంతి తర్వాత తెలుగులో సినిమాల సందడి బాగా ఉండే సీజన్ దసరానే. ఈ దసరా మాత్రం సినీ ప్రియులకు తీవ్ర నిరాశనే మిగిల్చింది. ఓవైపు థియేటర్లు మూతపడి ఉండగా.. మరోవైపు ఓటీటీల్లో సైతం సరైన సినిమాలు రాలేదు. ఒక్క ‘కలర్ ఫోటో’ మాత్రమే విడుదలైంది. అది పండుగ మూడ్ను పెంచే సినిమా అయితే కాదు. ఇది కాకుండా వేరే సినిమాలేవీ విడుదల కాలేదు.
ఐతే దసరా తేలిపోయినప్పటికీ దీపావళికి మాత్రం కచ్చితంగా సినిమాల సందడి చూడబోతున్నట్లే. ఆ సమయానికి థియేటర్లు 100 శాతం ఆక్యుపెన్సీతో నడవొచ్చనే అంచనాలున్నాయి. కాబట్టి కొత్త సినిమాలేవైనా అప్పటికి విడుదలవుతాయేమో చూడాలి. దాని మీద ఆశలు తక్కువే కానీ.. ఆ టైంకి ఓటీటీలు మాత్రం కొత్త సినిమాలతో కళకళలాడబోతున్నాయి.
దీపావళి ముందు వారమే ‘ఆహా’లో ‘మా వింత గాథ వినుమా’ రిలీజ్ కానుంది. ‘కృష్ణ అండ్ హిజ్ లీల’ తర్వాత సిద్ధు జొన్నలగడ్డ, సీరత్ కపూర్ జంటగా నటించిన సినిమా కావడంతో దీనిపై మంచి అంచనాలే ఉన్నాయి. దీంతో పాటే కీర్తి సురేష్ సినిమా ‘మిస్ ఇండియా’ నెట్ఫ్లిక్స్లో నవంబరు 4నే విడుదల కానుంది. మరోవైపు సాయిధరమ్ తేజ్ సినిమా ‘సోలో బ్రతుకే సో బెటర్’ను జీ 5లో దీపావళి రోజునే స్ట్రీమ్ చేయబోతున్నారు. అంతకంటే ముందు అక్షయ్ కుమార్ హిందీ సినిమా ‘లక్ష్మీబాంబ్’ నవంబరు 9 నుంచే హాట్ స్టార్లో ప్రసారం కానుంది.
ఈ సినిమాలన్నింటికీ మించి దీపావళిని సందడిని పెంచే చిత్రం ‘ఆకాశం నీ హద్దురా’. సౌత్ ఇండియాలో ఓటీటీ సినిమాల్లో బిగ్గెస్ట్ అంటే ఇదే. సూర్య హీరోగా నటించిన ఈ చిత్రం నవంబరు 12న అమేజాన్ ప్రైమ్లో విడుదల కానుంది. ఈ చిత్రం తెలుగు, తమిళ భాషల్లో రాబోతోంది. దాంతో పాటే విశాల్ నటించిన ‘చక్ర’ సైతం తమిళ, తెలుగు భాషల్లో దీపావళికే రాబోతోంది. ఇలా అరడజను కొత్త సినిమాలతో దీపావళికి సందడి నెలకొనబోతోంది.
This post was last modified on October 28, 2020 3:57 pm
వైసీపీ అధినేత జగన్ మారుతాడేమో, ప్రజల్లో ఆయనపై సానుభూతి పెరుగుతుందేమో అని కూటమి నాయకులు పలుసార్లు భావిస్తూ వచ్చారు. అందుకే…
వైసీపీ అధినేత జగన్పై సీఎం చంద్రబాబు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. వైసీపీ పాలనతో రాష్ట్రం పూర్తిగా విధ్వంసమైందని అన్నారు.…
అమరావతి రాజధానిపై వైసీపీ అధినేతగా జగన్ చేసిన తాజా వ్యాఖ్యల నేపథ్యంలో ఆయనపై మరోసారి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రాజధాని విషయంలో…
వైసీపీ అధినేత జగన్ హయాంలో ఓ కుటుంబం రోడ్డున పడింది. కేవలం మాస్క్ అడిగిన పాపానికి ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరించి…
కోనసీమ జిల్లా వాసులు ఎంతో పవిత్రంగా, ప్రతిష్టాత్మకంగా నిర్వహించుకునే పండుగ జగ్గన్నతోట ప్రభల తీర్థం. ఇది తరతరాలుగా సంప్రదాయబద్ధంగా కొనసాగుతూ…
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. వైసీపీ నేతలకు, కార్యకర్తలకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. పిఠాపురం నియోజకవర్గంలో పిచ్చి పిచ్చి…