ఖుషి తర్వాత స్క్రీన్ పై కనిపించకుండా పోయిన సమంతా తిరిగి ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. తన స్వంత ప్రొడక్షన్ లో రూపొందుతున్న మా ఇంటి బంగారం రిలీజ్ డేట్ గట్రా బయటికి చెప్పకుండా సైలెంట్ గా షూటింగ్ చేసేస్తున్నారు. సిటాడెల్ హనీ బన్నీ వెబ్ సిరీస్ స్పందన అంతంత మాత్రంగానే రావడంతో బలమైన కంబ్యాక్ కోసం సామ్ ప్లాన్లు వేసుకుంటోంది. తన బెస్ట్ ఫ్రెండ్ దర్శకురాలు నందిని రెడ్డికి ఓకే చెప్పడం చూశాం. కానీ దీనికన్నా ముందే సామ్ ఒక సినిమాలో క్యామియో రూపంలో కనిపించనుంది. అదే అనుపమ పరమేశ్వరన్ లీడ్ రోల్ చేస్తున్న పరదా.
ఈ సినిమాలో సామ్ ఒక కీలక పాత్ర చేస్తోందని, క్యారెక్టర్ గెటప్ రెండూ విభిన్నంగా గతంలో చూడని తరహాలో ఉంటాయని టీమ్ నుంచి అందుతున్న సమాచారం. కొన్ని వారాల క్రితం రిలీజైన టీజర్ లో పరదా కంటెంట్ షాకింగ్ గా ఉండబోతోందనే క్లూస్ ఇచ్చారు. ప్రవీణ్ కండ్రేగుల దర్శకత్వంలో ఈ విలేజ్ థ్రిల్లర్ లో దర్శన రాజేంద్ర, సంగీతలకు చాలా ప్రాధాన్యం ఉన్న పాత్రలు దక్కాయి. వీళ్లకు సమంతకున్న కనెక్షన్ ఏంటనేది సినిమాలోనే చూడాలని అంటున్నారు. సో అఫీషియల్ కంబ్యాక్ గా సామ్ కు పరదానే నిలవనుంది. విడుదల తేదీ ఇంకా నిర్ణయించలేదు కానీ వేసవిలోనే రాబోతోంది.
ఇదలా ఉంచితే సమంత తర్వాత ఏం చేయనుందనేది ఇంకా సస్పెన్స్ గానే ఉంది. రామ్ చరణ్ 17 కోసం దర్శకుడు సుకుమార్ తన పేరుని పరిశీలిస్తున్నట్టు వచ్చిన వార్త పుకారేనని ఆ టీమ్ వర్గాలు చెబుతున్న మాట. స్క్రిప్ట్ లాకయ్యే దశలో హీరోయిన్ వేట జరుగుతుందని, అప్పటిదాక ఇవన్నీ ఊహాగానాలుగానే చూడాలని అంటున్నారు. ఇక సిటాడెల్ సీజన్ 2 ఉంటుందో లేదో అనేది అనుమానంగానే ఉంది. ఆర్థిక కారణాల వల్ల బ్రేక్ పడిన వెబ్ సిరీస్ రక్త్ బ్రహ్మాండ్ త్వరలోనే కొనసాగబోతోందట. సమంతాకి ఇది చాలా ముఖ్యం. సరికొత్త హారర్ ఎక్స్ పీరియన్స్ ఇచ్చేలా తీర్చిదిద్దుతున్నారట.
This post was last modified on March 14, 2025 12:00 pm
ఒకప్పటి డిజాస్టర్లు ఇప్పుడు రీ రిలీజ్ ట్రెండ్ లో బాగా ఆడటం గమనిస్తున్నాం. ఆరెంజ్ మూడుసార్లు వచ్చినా కలెక్షన్లు కుమ్మరించింది.…
టాలీవుడ్లో ఘన చరిత్ర ఉన్న బేనర్లో లక్ష్మీప్రసన్న పిక్చర్స్ ఒకటి. ఈ బేనర్ మీద పదుల సంఖ్యలో సినిమాలు తీశారు…
‘యమదొంగ’ చిత్రంతో టాలీవుడ్లోకి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చింది మలయాళ భామ మమతా మోహన్ దాస్. ఆ చిత్రంలో చలాకీ పాత్ర…
ఇరు తెలుగు రాష్ట్రాలకు చెందిన రాజకీయ నాయకుల్లో చాలామంది పెద్దగా భావోద్వేగాలకు లోను కారు. మిన్ను విరిగి మీద పడ్డా…ఎన్నికల…
మన శంకరవరప్రసాద్ గారు రూపంలో చిరంజీవికి బ్లాక్ బస్టర్ కానుక ఇచ్చి రెమ్యునరేషన్ తో పాటు రేంజ్ రోవర్ కారు…
24 ఏళ్ల కిందట ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే కాక దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అయిన నటి ప్రత్యూష మృతి వ్యవహారంలో సుప్రీం కోర్టు…