తెలంగాణ అసెంబ్లీలో గురువారం చోటుచేసుకున్న రచ్చ… బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి గుండకంట్ల జగదీశ్ రెడ్డి సస్పెన్షన్ నేపథ్యంలో కలకలం రేగిన సంగతి తెలిసిందే. జగదీశ్ రెడ్డి పొరపాటు చేయకున్నా కూడా ఆయనపై బహిష్కరణ వేటు వేశారంటూ బీఆర్ఎస్ గురువారమే నిరసనకు దిగంది. శుక్రవారం రాష్ట్రవ్యాప్త నిరసనలకు పిలుపునిచ్చింది. ఎక్కడికక్కడ కాంగ్రెస్ సర్కారు నిరంకుశ నిర్ణయాలపై నిరసన తెలపాలని ఆ పార్టీ అధిష్ఠానం పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేసింది. ఫలితంగా శుక్రవారం తెలంగాణ వ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసనలు జరుగుతాయని అంతా భావించారు. అయితే ఈ నిరసనలపై హోలీ వేడుకల ప్రభావం పడిపోయింది.
అయితే అనూహ్యంగా శుక్రవారం తెలంగాణలోని ఏ ఒక్క ప్రాంతంలోనూ పెద్దగా నిరసనలకే జరగలేదు. అక్కడక్కడ ఒకటి, రెండు చోట్ల నిరసనలు జరిగినా…వాటిలో వేళ్లపై లెక్కపెట్టేంత మంది పార్టీ శ్రేణులు మాత్రమే పాలుపంచుకున్నారు. ఈ నిరసనలు చూసినంతనే… ఇవెక్కడి నిరసనలు అంటూ జనం ముక్కున వేలేసుకున్నారు. ఉద్యమ పార్టీగా బీఆర్ఎస్ గతంలో నిర్వహించిన కార్యక్రమాలను గుర్తు చేసుకుంటున్న జనం… ఇప్పుడున్నది బీఆర్ఎస్ పార్టీనేనా అని తమను తాము ప్రశ్నించుకున్నారు.
జనం ముక్కున వేలేసుకున్న మాదిరిగా తేలిపోయిన బీఆర్ఎస్ నిరసనల పిలుపునకు కారణం హోలీ వేడుకలేనని చెప్పాలి. శుక్రవారం దేశవ్యాప్తంగా హోలీ వేడుకలు ఘనంగా జరిగాయి. తెలంగాణలోనూ ఈ వేడుకలు పెద్ద ఎత్తున జరిగాయి. దాదాపుగా అందరూ హోలీ వేడుకల్లోనే మునిగిపోయారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి చామకూర మల్లారెడ్డి కూడా హోలీ వేడుకల్లో మునిగిపోయారు. హిందువులు అత్యంత ఘనంగా నిర్వహించుకునే వేడుక హోలీ కాబట్టి… అదే రోజున బీఆర్ఎస్ ఇచ్చిన నిరసనల పిలుపునకు అంతగా స్పందన రాలేదు.
This post was last modified on March 14, 2025 3:06 pm
ఒకప్పుడు ఇంగ్లీష్ సినిమాలకు మన దేశంలో తెగ క్రేజ్ ఉండేది. జురాసిక్ పార్క్ నుంచి ఇది విపరీతంగా పెరిగిపోయింది. దానికి…
గత వారం విడుదలైన ‘చెన్నై లవ్ స్టోరీ’ సినిమా ఫుల్ పాజిటివ్ టాకేమీ తెచ్చుకోలేదు. ప్రిమియర్స్ నుంచే డివైడ్ టాక్ మొదలైంది.…
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని విష్ణుమూర్తి అవతారంగా ప్రముఖ బాలివుడ్ నటుడు సుదేష్ బెర్రీ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో…
బలమైన కంబ్యాక్ కోసం ఎదురు చూస్తున్న మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ఆశలన్నీ కొరియన్ కనకరాజు మీదే ఉన్నాయి. ఆగస్ట్…
ఏపీ దశ దిశలను మార్చేసే భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం శనివారం ఉదయం లాంఛనంగా ప్రారంబమైంది. దేశ ప్రధాని నరేంద్ర మోదీ అల్లూరి సీతారామరాజు…
జంతర్ మంతర్ ఆందోళనలో ప్రధాని మోదీపై విమర్శలు చేయడం కన్నీళ్లు తెప్పించిందని, పండ్లు కాసే చెట్టుపైకి రాళ్లేస్తారని, దేశం కోసం…