‘మిర్చి’ సినిమా ఇంటర్వెల్ బ్యాంగ్లో ‘నా ఫ్యామిలీ సేఫ్’ అంటూ ప్రభాస్ చెప్పే డైలాగ్ ఎంత పాపులరో కొత్తగా చెప్పాల్సిన పని లేదు. కాల క్రమంలో అదొక మీమ్ టెంప్లేట్గా మారిపోయింది. ఇప్పుడు ఒక దర్శకుడు ఈ టెంప్లేట్తో పెట్టిన పోస్టు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ దర్శకుడు ఎవరో కాదు.. ‘హిట్’ ఫ్రాంఛైజీ చిత్రాలతో సెన్సేషన్ క్రియేట్ చేసిన శైలేష్ కొలను. నాని నిర్మాణంలో ప్రియదర్శి ప్రధాన పాత్ర పోషించిన ‘కోర్ట్’ మూవీ ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే.
ఈ నేపథ్యంలో రెండు రోజుల ముందే ఈ చిత్రానికి ప్రిమియర్స్ వేశారు. ఆ షో చూసిన అనంతరం శైలేష్ ‘నా సినిమా సేఫ్’ అంటూ పోస్టు పెట్టాడు. ‘మిర్చి’లో ‘నా ఫ్యామిలీ సేఫ్’ అంటూ ప్రభాస్ డైలాగ్ చెప్పే ఫొటోను కూడా అతను జోడించాడు. ఇంతకీ అతనిలా పోస్టు పెట్టడానికి కారణం ఏంటంటే..?‘కోర్ట్’ సినిమా ప్రి రిలీజ్ ఈవెంట్లో నాని ఒక ఆసక్తికర సవాలు విసిరాడు. ‘కోర్ట్’ సినిమా చూసి అది నచ్చకపోతే తాను హీరోగా నటిస్తున్న ‘హిట్-3’ సినిమా చూడాల్సిన అవసరం లేదని అన్నాడు. దీన్ని బట్టే ‘కోర్ట్’ మీద నాని నమ్మకం ఎలాంటిదో జనాలకు అర్థమైంది. ఇప్పుడు సినిమా చూసిన వాళ్లంతా నాని అంత ధీమాగా ఆ ప్రకటన చేయడంలో ఆశ్చర్యం లేదంటున్నారు.
‘కోర్ట్’కు ఫుల్ పాజిటివ్ టాకే వచ్చింది. కాబట్టి ‘హిట్-3’ సినిమాకు వచ్చిన ఇబ్బందేమీ లేదని తేలిపోయింది. ఈ నేపథ్యంలోనే శైలేష్ ఈ పోస్ట్ పెట్టాడు. ‘కోర్ట్’ సినిమా హిట్ కాబట్టి నాని ఛాలెంజ్ నిలబడిందని.. తన సినిమా సేఫ్ అని అతనిలా వ్యాఖ్యానించాడు. ‘కోర్ట్’ సినిమా నుంచి తీసుకోవడానికి చాలా ఉందని.. ఇది సమాజానికి చాలా అవసరమైన సినిమా అని అతను వ్యాఖ్యానించాడు. ఈ పోస్ట్ పెట్టి ఇక తాను ‘హిట్-3’ ఎడిట్ రూంకు వెళ్లాల్సి ఉందంటూ బై చెప్పాడు శైలేష్. నాని నిర్మాణంలో ఇంతకుముందు వచ్చిన ‘అ!’, ‘హిట్’, ‘హిట్-2’ మంచి అప్లాజ్ తెచ్చుకోక.. తన విన్నింగ్ స్ట్రీక్ను ‘కోర్ట్’ కూడా కొనసాగించేలాగే కనిపిస్తోంది.
This post was last modified on March 13, 2025 8:10 pm
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ వైసీపీ నేతలను ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశారు. ``అన్నీ గుర్తుంచుకున్నా.…
దసరా తర్వాత న్యాచురల్ స్టార్ నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కలయికలో తెరకెక్కుతున్న ది ప్యారడైజ్ షూటింగ్ నిర్విరామంగా జరుగుతోంది.…
రాజకీయాల్లో మార్పులు జరుగుతూనే ఉంటాయి. ప్రత్యర్థులు కూడా మిత్రులుగా మారుతారు. ఇలాంటి పరిణామమే ఉమ్మడి కృష్నాజిల్లాలో కూడా చోటు చేసుకుంటోంది.…
ప్రస్తుతం ఇండియాలో తెరకెక్కుతున్న చిత్రాల్లో అత్యంత హైప్ ఉన్న వాటిలో అల్లు అర్జున్, అట్లీ సినిమా ఒకటి. ఏకంగా రూ.800…
భారీ అంచనాల మధ్య అవతార్ ఫైర్ అండ్ యాష్ విడుదలయ్యింది. ఇవాళ రిలీజులు ఎన్ని ఉన్నా థియేటర్లలో జనం నిండుగా…
మన దగ్గర అయిదు టాలీవుడ్ స్ట్రెయిట్ సినిమాలు సంక్రాంతికి తలపడుతున్నా సరే పెద్దగా టెన్షన్ వాతావరణం లేదు కానీ తమిళంలో…