వన్ మూవీ వండర్ లాగా ఎప్పుడో దశాబ్దం క్రితం బిచ్చగాడుతో బ్లాక్ బస్టర్ సాధించిన విజయ్ ఆంటోనీ పాతిక సినిమాలు పూర్తి చేసుకోబోవడం విశేషమే. తన పాతికవ మూవీ భద్రకాళి (తమిళంలో శక్తి తిరుమగన్) త్వరలోనే విడుదలకు సిద్ధమవుతోంది. నిన్న టీజర్ లాంచ్ చేశారు. మైత్రి సంస్థ పంపిణి బాధ్యతలు తీసుకున్న ఈ యాక్షన్ డ్రామా కాన్సెప్ట్ కొంచెం కొత్తగా, అర్థం కానట్టుగా వెరైటీగా కట్ చేశారు. ఆరు వేల కోట్ల స్కామ్ జరిగితే ప్రభుత్వం తలకిందులయ్యే పరిస్థితి తలెత్తుంది. దానికి కిట్టు అనే యువకుడు కారణమని తెలుసుకున్న పోలీసులు అతని వెంట పడతారు. అతనెవరనేది అసలు స్టోరీ.
పాయింట్ కాస్త విభిన్నంగానే అనిపిస్తోంది. విమర్శకులు మెచ్చుకున్న అరువి లాంటి సోషల్ మెసేజ్ సూపర్ హిట్ ఇచ్చిన అరుణ్ ప్రభు దీనికి దర్శకత్వం వహించాడు. విషయమున్న డైరెక్టర్ దొరికాడు కాబట్టి విజయ్ ఆంటోనీ ఈసారి సక్సెస్ సాధిస్తాడేమో చూడాలి. ఎందుకంటే తెలుగులో అతని కొత్త సినిమాలు ఎన్ని వచ్చాయో ఎన్ని పోయాయో గుర్తించే లోపే థియేటర్లలో మాయమైపోతున్నాయి. కనీసం ఓటిటిలోనూ పెద్దగా ఆదరణ దక్కడం లేదు. బిచ్చగాడు 2 ఒకటే డీసెంట్ వసూళ్లు దక్కించుకోగా మిగిలినవి చాలా మటుకు కనీసం బ్రేక్ ఈవెన్ కూడా అందుకోలేకపోయాయి.
ఈ నేపథ్యంలో భద్రకాళి హిట్ కావడం విజయ్ ఆంటోనీకి చాలా కీలకం. ఈ టైటిల్ కోసం అతను వివాదం కొని తెచ్చుకున్న సంగతి తెలిసిందే. చివరికి సర్దుబాటు చేసి తెలుగులో ఆ పేరు విజయ్ ఆంటోనీకి ఇచ్చి తమిళంలో భద్రకాళిని శివ కార్తికేయన్ కు ఖరారు చేసారు. ఇది కొంత అయోమయానికి దారి తీసేదే అయినా ఇంతకన్నా పరిష్కారం దొరకలేదు. విజయ్ ఆంటోనీనే స్వయంగా సంగీతం సమకూర్చుకున్న భద్రకాళిలో మనకు పరిచయమున్న క్యాస్టింగ్ తక్కువగా ఉంది. కంటెంట్ మీద నమ్మకంతో అన్ని భాషల్లో ఒకేసారి తీసుకొస్తున్నారు. మరి ఈసారైనా బిచ్చగాడుని విజయలక్ష్మి వరిస్తుందో లేదో చూడాలి.
This post was last modified on March 13, 2025 11:11 am
బీఆర్ ఎస్ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ అరెస్టు నేపథ్యంలో తెలంగాణ రాజకీయాలు మరో సారి నిప్పు రాజుకున్నాయి.…
ఎట్టకేలకు మాజీ మంత్రి అంబటి రాంబాబు రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి విడుదలయ్యారు.అంబటి రాంబాబుపై ఉన్న అన్ని కేసుల్లోనూ ఆయనకు…
ఒకప్పుడు నిర్మాతలకు విపరీతమైన గౌరవం ఉండేది. పరిశ్రమను పోషించేది వాళ్లే కాబట్టి హీరో హీరోయిన్ దగ్గర నుంచి సాంకేతిక నిపుణులు,…
తెలంగాణలోని జగిత్యాల జిల్లా కోరుట్ల బస్టాండ్లో ఒక వింత సంఘటన స్థానికులను, ప్రయాణికులను ఆశ్చర్యానికి గురిచేసింది. బుర్ఖా వేసుకుని మహిళల…
తాజాగా రాజ్యసభలో ఖాళీ అవుతున్న 37 స్థానాలకు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నికలు నిర్వహించేందుకు రెడీ అయింది. దీనికి…
ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్.. గత ఆదివారం కొలంబోకు వెళ్లి ఇండియా, పాకిస్థాన్ మధ్య టీ20 ప్రపంచకప్ మ్యాచ్ను వీక్షించడం…