సలార్ విలన్ పృథ్విరాజ్ సుకుమారన్ దర్శకత్వంలో మోహన్ లాల్ హీరోగా నిర్మించిన ఎల్2 ఎంపురాన్ (లూసిఫర్ సీక్వెల్) కు సంబంధించి ఇప్పటిదాకా ప్రమోషన్లు ఊపందుకోకపోవడం అభిమానులను టెన్షన్ కు గురి చేస్తోంది. ఇతర భాషల సంగతమేమో కానీ మళయాలంలోనూ ఇలాంటి పరిస్థితి ఉండటం చూసి ఖంగారు పడుతున్నారు. ఎస్ఎస్ఎంబి 29 షూటింగ్ కోసం మహేష్ బాబు, రాజమౌళితో బిజీగా ఉన్న పృథ్విరాజ్ వీటిని పట్టించుకునే స్టేజిలో లేకపోవడంతో నిర్మాణ సంస్థ మీదే ఒత్తిడి ఉంది. మల్లువుడ్ టాక్ ప్రకారం ఎల్2 పబ్లిసిటీ ఇంకా మొదలుకాకపోవడానికి కారణం బిజినెస్ డీల్సేనట.
ఇప్పటిదాకా ఓటిటి ఒప్పందం జరగలేదని, నిర్మాత అడుగుతున్న దానికి డిజిటల్ కంపెనీలు ఆఫర్ చేస్తున్న మొత్తానికి చాలా వ్యత్యాసం ఉండటం వల్లే పెండింగ్ లో ఉంచారని అంటున్నారు. పైగా లైకా ప్రొడక్షన్ కావడంతో లాల్ సలామ్, ఇండియన్ 2, విడాముయార్చికి సంబంధించిన నష్టాల లావాదేవీలు పెండింగ్ లో ఉన్నాయట. దీంతో బయ్యర్ల నుంచి సహకారం సరిగా లేకపోవడంతో థియేటర్ అగ్రిమెంట్లలో ఆలస్యమవుతోందని తెలిసింది. ఈ జాప్యం వల్ల తమిళనాడు, కర్ణాటక, ఏపీ, తెలంగాణలో అధిక శాతం స్క్రీన్లు పోటీలో ఉన్న రాబిన్ హుడ్, మ్యాడ్ స్క్వేర్, వీరధీర శూర పార్ట్ 2 లాక్ చేసుకుంటున్నాయి.
ఇంతకీ ఎల్2 ఎంపురాన్ మార్చి 27 వస్తుందా అంటే అందులో డౌట్ అక్కర్లేదని కేరళ మీడియా చెబుతోంది. కానీ క్రమంగా అనుమానాలైతే పెరుగుతున్నాయి. లూసిఫర్ లాంటి వంద కోట్ల సినిమా సీక్వెల్ కి ఇలాంటి పరిస్థితి రావడం విచిత్రం. చాలా క్రేజీ క్యాస్టింగ్ తో భారీ బడ్జెట్ తో నిర్మించిన ఎల్2 మీద మోహన్ లాల్ మాములు ఆశలు పెట్టుకోలేదు. గత చిత్రం బరోజ్ దారుణంగా డిజాస్టర్ కావడంతో ఆ గాయం దీంతో పూర్తిగా మానిపోతుందని ఎదురు చూస్తున్నారు. కానీ ఇప్పుడేమో ఇలా ట్విస్టుల మీద ట్విస్టులు వచ్చి పడుతున్నాయి. తెలుగు హక్కులు ఎవరికి ఇచ్చారనే క్లారిటీ ఇంకా అఫీషియల్ గా రావాల్సి ఉంది.
This post was last modified on March 12, 2025 4:12 pm
ఒకప్పుడు టాలీవుడ్లో తిరుగులేని ఆధిపత్యం చలాయించిన కథానాయికల్లో తమన్నా ఒకరు. టీనేజీలోనే కథానాయిక అవతారం ఎత్తిన ఆమె పదేళ్లకు పైగానే టాప్…
థియేటర్, ఓటిటి మధ్య ఖచ్చితంగా ఎనిమిది వారాల గ్యాప్ ఉండాలనే నిబంధన మీద దక్షిణాది ఇండస్ట్రీ పెద్దలు చాలా సీరియస్…
అధికారంలోకి రావడానికి ముందు వరకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చాలా ఫెరోషియస్గా కనిపించేవారు. అవినీతి కేసుల వ్యవహారం పక్కన పెడితే…
‘బాహుబలి’ సినిమాకు బాలీవుడ్ నుంచి అప్పట్లో ఎంత గొప్ప సహకారం అందిందో తెలిసిందే. కరణ్ జోహార్ లాంటి అగ్ర నిర్మాత ఆ…
మోనాలిసా.. గత ఏడాది సోషల్ మీడియాను ఒక ఊపు ఊపేసిన పేరిది. ఉత్తర్ప్రదేశ్లో జరిగిన మహా కుంభమేళాతో వెలుగులోకి వచ్చిన…
తెలంగాణ ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్, మాజీ మంత్రి పార్టీ కీలక…