టాలీవుడ్లో గ్యాప్ లేకుండా సినిమాలు చేస్తూనే క్వాలిటీ, వెరైటీ చూపించే హీరో నాని. దసరా, హాయ్ నాన్న, సరిపోదా శనివారం.. ఇలా ఏడాదిన్నర వ్యవధిలో మూడు భిన్న చిత్రాలతో ప్రేక్షకులను మెప్పించాడు. ఇక ఈ వేసవికి నాని నుంచి రాబోతున్న ‘హిట్-3’ మీద కూడా భారీ అంచనాలే ఉన్నాయి. ఒక సినిమా చేస్తుండగానే.. ఇంకో సినిమాకు అన్నీ సిద్ధం చేసుకుని.. కొత్త చిత్రం విడుదలైన వెంటనే ఆ చిత్రాన్ని పట్టాలెక్కించడం నానికి అలవాటు. ఈసారి కూడా అలాగే ప్లాన్ చేసుకున్నాడు కానీ.. తాను ఓకే చేసిన చిత్రాన్ని డైరెక్ట్ చేయాల్సిన వ్యక్తి సందిగ్ధంలో ఉండడం వల్ల అది వెంటనే పట్టాలెక్కే పరిస్థితి లేదు.
‘హిట్-3’ తర్వాత సుజీత్ దర్శకత్వంలో సినిమాను ఓకే చేశాడు నాని. కానీ అతను ‘ఓజీ’ సినిమాను పూర్తిచేయాల్సి ఉంది. అది పవన్ కళ్యాణ్ చేతుల్లోనే ఉంది. కానీ పవన్ ఇంకా ‘హరిహర వీరమల్లు’నే పూర్తిచేయలేదు. అది అయ్యాకే ‘ఓజీ’ పని మొదలుపెడతాడు. కాబట్టి సుజీత్ ఖాళీ అవ్వడానికి టైం పడుతుంది. ఈలోపు నాని ప్యారడైజ్ పూర్తి చేయనున్నాడు. ఇదిలా ఉండగా.. నాని-సుజీత్ సినిమాను నిర్మించాల్సిన డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ ఆ మూవీ నుంచి తప్పుకుందన్నది తాజా సమాచారం. కారణాలేంటన్నది తెలియదు మరి. అలా అని సుజీత్-నాని మూవీ ఆగిపోతుందని అనుకోవడానికేమీ లేదు.
నానితో ‘శ్యామ్ సింగరాయ్’ చిత్రాన్ని ప్రొడ్యూస్ చేసిన వెంకట్ బొల్లినేని లైన్లోకి వచ్చారట. ఈ సినిమాను తన బేనర్లో చేస్తానని.. అందుకోసం ఎన్నిరోజులైనా వెయిట్ చేస్తానని ఆయన అంటున్నారట. ‘శ్యామ్ సింగ రాయ్’తో తన బేనర్కు మంచి విజయాన్నందించిన నాని మీద వెంకట్కు చాలా అభిమానం ఉంది. నాని ప్రతి పుట్టిన రోజుకూ ఆయన శుభాకాంక్షలు చెబుతూ పలు మీడియాల్లో యాడ్స్ ఇస్తారు. ‘శ్యామ్ సింగరాయ్’ తర్వాత ‘సైంధవ్’తో షాక్ తిన్న ఆయన.. మళ్లీ నాని సినిమాతోనే బౌన్స్ బ్యాక్ అవ్వాలని చూస్తున్నారు.
This post was last modified on March 9, 2025 2:52 pm
దేశంలో అత్యధిక సినీ అభిమానం ఉన్న ప్రేక్షకులుగా తెలుగు ఆడియన్సుకి పేరుంది. తెలుగు రాష్ట్రాలు రెంటినీ కలిపి ఒక యూనిట్…
జగిత్యాల జిల్లాలోని ప్రసిద్ధ కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయ అభివృద్ధికి తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) రూ.30 కోట్ల నిధులను…
అటు ఢిల్లీలో కేంద్ర మంత్రులను కలిసి ఏపీకి నిధులు మంజూరు అయ్యేలా ప్రయత్నాలు చేస్తుంటారు. ఇటు తన శాఖలను సమర్థవంతంగా…
నిన్న జరిగిన ఛాంపియన్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కు రామ్ చరణ్ ముఖ్యఅతిధిగా రావడం హైప్ పరంగా దానికి మంచి…
వైసీపీ హయాంలో విశాఖపట్నంలోని ప్రఖ్యాత పర్యాటక ప్రాంతం రుషికొండను తొలిచి.. నిర్మించిన భారీ భవనాల వ్యవహారం కొలిక్కి వస్తున్నట్టు ప్రభుత్వ…
భారీ అంచనాలతో గత వారం విడుదలైన అఖండ 2 తాండవం నెమ్మదిగా సాగుతోంది. రికార్డులు బద్దలవుతాయని అభిమానులు ఆశిస్తే ఇప్పుడు…