Movie News

వ్యాపారం లోకి కిర‌ణ్ అబ్బ‌వ‌రం

సినీ రంగంలో ఉన్న వాళ్లు అక్క‌డ డ‌బ్బులు సంపాదించి.. వేరే రంగాల్లో పెట్టుబ‌డులు పెడుతుంటారు. చాలామంది రియ‌ల్ ఎస్టేట్ వైపు చూస్తే కొంద‌రు ఫుడ్ బిజినెస్ మీద ఫోక‌స్ పెడ‌తారు. టాలీవుడ్ హీరోల్లో సందీప్ కిష‌న్ వివాహ భోజ‌నంపు పేరుతో రెస్టారెంట్ ఛైన్ న‌డుపుతున్న సంగ‌తి తెలిసిందే. ద‌ర్శ‌కురాలు నందిని రెడ్డితో పాటు ఇంకా కొంత‌మందికి రెస్టారెంట్లు ఉన్నాయి. ఇప్పుడు ఈ జాబితాలోకి యువ క‌థానాయ‌కుడు కిర‌ణ్ అబ్బ‌వ‌రం కూడా రాబోతున్నాడు. త్వ‌ర‌లోనే అబ్బ‌వ‌రం వారి రెస్టారెంట్ రాబోతున్న‌ట్లు త‌న కొత్త చిత్రం దిల్ రుబా ప్ర‌మోష‌న్ల‌లో భాగంగా ఇచ్చిన ఓ ఇంట‌ర్వ్యూలో కిర‌ణ్ వెల్ల‌డించాడు. అథెంటిక్ రాయ‌ల‌సీమ ఫుడ్ జ‌నాల‌కు అందించాల‌న్న‌ది త‌న ఉద్దేశ‌మ‌ని.. అందుకోసం రెస్టారెంట్ ఛైన్ ఓపెన్ చేద్దామ‌నుకుంటున్నాన‌ని.. అందుకోసం స‌న్నాహాలు జరుగుతున్నాయ‌ని.. త్వ‌ర‌లోనే అనౌన్స్‌మెంట్ ఉంటుంద‌ని కిర‌ణ్ తెలిపాడు.

ఇక సినిమా రంగంలోకి రాక‌పోయి ఉంటే క‌చ్చితంగా రాజ‌కీయాల్లోకి వెళ్లేవాడిన‌ని కిర‌ణ్ తెలిపాడు. రాయ‌ల‌సీమ వాసిగా రాజ‌కీయాల‌ను చిన్న‌ప్ప‌టి నుంచి ద‌గ్గ‌ర‌గా చూశాన‌ని.. రాజ‌కీయాలపై ఆస‌క్తి, అవ‌గాహ‌న రెండూ ఉన్నాయ‌ని కిర‌ణ్ తెలిపాడు. ప్ర‌జ‌ల‌తో మమేకం కావ‌డాని్ని తాను చాలా ఇష్ట‌ప‌డ‌తాన‌ని అత‌న‌న్నాడు. తాను సాఫ్ట్‌వేర్ ఉద్యోగం వ‌దులుకుని, సినిమాల్లోకి వ‌చ్చిన‌పుడు చాలా బాధ ప‌డ్డాన‌ని, క‌న్నీళ్లు వ‌చ్చాయ‌ని.. కానీ ఇప్పుడు చాలా సంతోషంగా ఉన్నాన‌ని కిర‌ణ్ తెలిపాడు.

ర‌హ‌స్య గోర‌క్‌తో త‌న వైవాహిక జీవితం చాలా సంతోషంగా సాగిపోతున్న‌ట్లు కిర‌ణ్ వెల్ల‌డించాడు. రాజావారు రాణివారు, ఎస్ఆర్ క‌ళ్యాణ‌మండ‌పం చిత్రాల‌తో వెలుగులోకి వ‌చ్చిన కిర‌ణ్‌.. ఒక ద‌శ‌లో వ‌రుస‌గా అవ‌కాశాలు అందుకున్నాడు. కానీ వ‌రుస ఫ్లాపులు అత‌ణ్ని వెన‌క్కి లాగేశాయి. రూల్స్ రంజ‌న్ త‌ర్వాత అత‌ను గ్యాప్ తీసుకుని గ‌త ఏడాది క మూవీతో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చాడు. అది సూప‌ర్ హిట్ అయింది. ఇప్పుడు కిర‌ణ్ కొత్త సినిమా దిల్ రుబా మార్చి 14న మంచి అంచ‌నాల మ‌ధ్య ప్రేక్ష‌కుల ముందుకు వ‌స్తోంది.

This post was last modified on March 8, 2025 12:20 pm

Share

Recent Posts

రాఖీ రాజీ చేసేనా? సీఎం ఇంటికి కొండా సురేఖ!

తెలంగాణ రాజకీయాల్లో మంత్రి కొండా సురేఖ వ్యవహారం మరోసారి ఆసక్తికరంగా మారింది. ఇటీవల చోటుచేసుకున్న వివాదం తర్వాత తొలిసారిగా ఆమె…

13 minutes ago

ప్రాణాలు తీసుకునే ముందు… ఆ పాప గుర్తుకు రాలేదా?

అప్పుల బాధతో దంపతులు గోదావరిలో దూకిన ఘటన పశ్చిమగోదావరి జిల్లాలో విషాదం నింపింది. మూడేళ్ల చిన్నారిని వంతెనపై స్కూటీ వద్ద…

1 hour ago

పార్ల‌మెంటు డీలిమిటేష‌న్‌పై కాంగ్రెస్ భయం దేనికి?

దేశ‌వ్యాప్తంగా 543 పార్ల‌మెంటు నియోజ‌క‌వ‌ర్గాల పున‌ర్విభ‌జ‌న అంశంపై కాంగ్రెస్ పార్టీ మ‌ల్ల‌గుల్లాలు ప‌డుతోంది. నియోజ‌క‌వ‌ర్గాల పున‌ర్విభ‌జ‌న‌ను వ‌చ్చే 25 ఏళ్ల…

3 hours ago

బీజేపీ వ‌ర్సెస్ కాంగ్రెస్‌… `ప‌ర్స‌న‌లైజ్` అవుతున్న పార్టీలు!

రెండు జాతీయ పార్టీలు.. బీజేపీ, కాంగ్రెస్‌లో గ‌తానికి భిన్న‌మైన `వ్య‌క్తిపూజ` సాగుతోందా?.. అంటే ఔన‌నే స‌మాధాన‌మే వినిపిస్తోంది. ఇందిర‌మ్మ హ‌యాంలో…

5 hours ago

టీడీపీకి ఓట్ల `ప్రాజెక్టులు`… త‌మ్ముళ్లు హ్యాపీ.. !

కీల‌క‌మైన రెండు సాగు, తాగునీటి ప్రాజెక్టుల‌కు సీఎం చంద్ర‌బాబు శ్రీకారం చుట్టారు. నిజానికి ఇవి ఏళ్ల త‌ర‌బ‌డి సాగుతున్న ప్రాజెక్టుల‌నే…

10 hours ago

దేశ‌వ్యాప్తంగా 288 మంది.. ఏపీలో ఐదుగురు.. ఏమ‌య్యారు?

దేశ‌వ్యాప్తంగా 288 మంది నేపాల్ వ‌ర‌ద‌ల్లో గ‌ల్లంత‌య్యార‌ని కేంద్ర ప్ర‌భుత్వం అధికారికంగా ప్ర‌క‌టించింది. మొత్తం 532 మంది ఆచూకీ క‌నిపించ‌కుండా…

11 hours ago