Movie News

సప్తసాగరాల భామ తెలిసే త్యాగం చేసింది

రెండేళ్ల క్రితం సప్తసాగరాలు దాటి సైడ్ ఏ తర్వాత ఏడాది సైడ్ బి రిలీజైనప్పుడు దాని కమర్షియల్ సక్సెస్ పక్కనపెడితే హీరోయిన్ రుక్మిణి వసంత్ నటన ఎందరికో ఫేవరెట్ గా మార్చేసింది. కానీ కథల ఎంపికలో పొరపాట్లు, కాంబోల ట్రాప్ లో పడి ఎంచుకున్న సినిమాలు ఫ్లాపులని ఇచ్చాయి. నిఖిల్ అప్పుడో ఇప్పుడో ఎప్పుడోలో తనే మెయిన్ లీడ్ అంటే ఆశ్చర్యపోతారేమో కానీ రిలీజైన విషయమే చాలా మందికి తెలియనంత డిజాస్టర్ అది. కన్నడ డబ్బింగులు శ్రీమురళి బఘీరా, శివరాజ్ కుమార్ భైరతి రనగల్ హిట్టా ఫ్లాపా పక్కనపెడితే వాటిలో మొక్కుబడి పాత్రలు దక్కి పెర్ఫార్మన్స్ చేసే ఛాన్స్ దొరకలేదు.

అందుకే జూనియర్ ఎన్టీఆర్-ప్రశాంత్ నీల్ కలయికలో తెరకెక్కుతున్న ప్యాన్ ఇండియా మూవీ డ్రాగన్ (ప్రచారంలో ఉన్న టైటిల్) కి సంతకం చేసే టైంలో వేరే ఏ సినిమాకు కమిట్ అవ్వకూడదన్న కండీషన్ కు ఒప్పుకుంది. ఎందుకంటే దర్శకుడు ప్రశాంత్ నీల్ తన పాత్రను డిజైన్ చేసిన విధానం, తారక్ కాంబినేషన్ చాలా ప్రత్యేకంగా కెరీర్ కి బ్రేక్ ఇచ్చేలా ఉన్నాయట. ఆ కారణంగానే వేరే ఆఫర్లు వదులుకోవాల్సి వచ్చినా సరే టెన్షన్ పడటం లేదట. విజయ్ దేవరకొండ – రవికిరణ్ కోలా కాంబోలో రాబోయే సినిమా ఆఫర్ ఈ కారణంగానే చేయలేదనే టాక్ ఫిలింనగర్ వర్గాల్లో గుప్పుమంటోంది.

గ్లామర్ షో చేయకపోయినా అందం, అభినయం రెండూ ఉన్న రుక్మిణి వసంత్ కు డ్రాగన్ ఎలాంటి బ్రేక్ అవుతుందో చూడాలి. ఎలాగూ ప్రశాంత్ నీల్ చిత్రాల్లో హీరోయిన్ మొక్కుబడిగా డాన్సులు చేయడం కోసం ఉండదు. ఆ మాటకొస్తే ఆయన అసలు డ్యూయెట్లే పెట్టడు. అవసరం లేని కామెడీ ట్రాకులు, ఐటెం సాంగ్స్ ఊసు ఉండదు. కెజిఎఫ్ లో శ్రీనిధి శెట్టికి ఎలాంటి ప్రాధాన్యం దక్కిందో ఇప్పుడీ డ్రాగన్ లో అంతకు మించే రుక్మిణికి ఉంటుందట. ఎలాగూ అక్టోబర్ లేదా నవంబర్ లోగా షూటింగ్ పూర్తి చేసే టార్గెట్ లో ఉన్నారు కాబట్టి 2026 ప్రథమార్ధం నుంచి ఆమె కొత్త సినిమాలు ఎంచక్కా ఒప్పేసుకోవచ్చు.

This post was last modified on March 8, 2025 12:18 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

నిన్న బాబు – నేడు పవన్!!

పార్టీ పటిష్టంగా ఉండాలన్నా, ప్రజలకు పారదర్శకంగా సంక్షేమ పథకాలు అందాలన్నా ఆ పార్టీ ప్రజా ప్రతినిధులే కీలకం. రాజకీయాల్లో ఈ…

13 minutes ago

ఐమాక్స్ వస్తే మన పరిస్తితి కూడా ఇంతేనా?

దేశంలో అత్యధిక సినీ అభిమానం ఉన్న ప్రేక్షకులుగా తెలుగు ఆడియన్సుకి పేరుంది. తెలుగు రాష్ట్రాలు రెంటినీ కలిపి ఒక యూనిట్…

2 hours ago

పవన్ చొరవతో తెలంగాణ ఆలయానికి రూ.30 కోట్లు?

జగిత్యాల జిల్లాలోని ప్రసిద్ధ కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయ అభివృద్ధికి తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) రూ.30 కోట్ల నిధులను…

3 hours ago

గల్లి సమస్యను సైతం వదలని లోకేష్!

అటు ఢిల్లీలో కేంద్ర మంత్రులను కలిసి ఏపీకి నిధులు మంజూరు అయ్యేలా ప్రయత్నాలు చేస్తుంటారు. ఇటు తన శాఖలను సమర్థవంతంగా…

4 hours ago

చరణ్ రాకతో పెరిగిన ఛాంపియన్ మైలేజ్

నిన్న జరిగిన ఛాంపియన్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కు రామ్ చరణ్ ముఖ్యఅతిధిగా రావడం హైప్ పరంగా దానికి మంచి…

4 hours ago

రుషికొండ పంచాయతీ… కొలిక్కి వచ్చినట్టేనా?

వైసీపీ హ‌యాంలో విశాఖ‌ప‌ట్నంలోని ప్ర‌ఖ్యాత ప‌ర్యాట‌క ప్రాంతం రుషికొండ‌ను తొలిచి.. నిర్మించిన భారీ భ‌వ‌నాల వ్య‌వ‌హారం కొలిక్కి వ‌స్తున్న‌ట్టు ప్ర‌భుత్వ…

5 hours ago