పవన్కళ్యాణ్ కొత్త సినిమా అనౌన్స్ చేసాడనే ఆనందం కంటే… అయ్యప్పనుమ్ కోశియుమ్ రీమేక్లో నటిస్తున్నాడని, అది కూడా సాగర్ చంద్ర లాంటి పేరు తెలియని దర్శకుడితో చేస్తున్నాడని అభిమానులు నిరుత్సాహ పడుతున్నారు. నిజానికి వకీల్ సాబ్లో పవన్ నటించడమే చాలా మంది అభిమానులకు ఇష్టం లేదు.
పవన్ స్క్రీన్ ఇమేజ్కి, అతని యాక్టింగ్ స్టయిల్కి ఆ కథ, పాత్ర సూట్ కావని ఫాన్స్ కి బాగా తెలుసు. కానీ పవన్తో అంత ట్రావెల్ చేసిన త్రివిక్రమ్కి తెలియలేదు. ఎందుకంటే పింక్ రీమేక్ చేయమంటూ పవన్ని ప్రోత్సహించింది త్రివిక్రమ్ అట. అసలయితే దిల్ రాజుతో కలిసి నిర్మాణంలో భాగస్వామ్యం కూడా తీసుకోవాలని అనుకున్నాడు కానీ అది కుదరలేదు.
వకీల్ సాబ్ విషయంలోనే త్రివిక్రమ్ పట్ల ఫాన్స్ కోపంగా వుంటే తాజాగా అయ్యప్పనుమ్ కోశియుమ్ రీమేక్ చేయడానికి పవన్ ఉపక్రమించడానికి కూడా కారణం త్రివిక్రమ్ అని ఫాన్స్ బలంగా నమ్ముతున్నారు. త్రివిక్రమ్తో చాలా మంచి అనుబంధం వున్న సితార ఎంటర్టైన్మెంట్స్లో ఈ సినిమా అనౌన్స్ అవడంతో త్రివిక్రమ్ పాత్రపై చాలా రూమర్లు వినిపిస్తున్నాయి.
అజ్ఞాతవాసి లాంటి ఫ్లాప్ ఇవ్వడమే కాకుండా పవన్తో ఇలాంటి రాంగ్ ప్రాజెక్టులు చేయిస్తున్నాడని, పవన్ క్రేజ్ని, అతడితో వున్న స్నేహాన్ని త్రివిక్రమ్ ఇలా వాడుకుంటున్నాడని ఫాన్స్ నుంచి విమర్శలొస్తున్నాయి. పవన్తో ఇంతవరకు త్రివిక్రమ్ మరో సినిమా అనౌన్స్ చేయకపోవడం వారిని మరింతగా హర్ట్ చేస్తోంది.
This post was last modified on October 27, 2020 10:18 am
ఒకప్పుడు టాలీవుడ్లో తిరుగులేని ఆధిపత్యం చలాయించిన కథానాయికల్లో తమన్నా ఒకరు. టీనేజీలోనే కథానాయిక అవతారం ఎత్తిన ఆమె పదేళ్లకు పైగానే టాప్…
థియేటర్, ఓటిటి మధ్య ఖచ్చితంగా ఎనిమిది వారాల గ్యాప్ ఉండాలనే నిబంధన మీద దక్షిణాది ఇండస్ట్రీ పెద్దలు చాలా సీరియస్…
అధికారంలోకి రావడానికి ముందు వరకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చాలా ఫెరోషియస్గా కనిపించేవారు. అవినీతి కేసుల వ్యవహారం పక్కన పెడితే…
‘బాహుబలి’ సినిమాకు బాలీవుడ్ నుంచి అప్పట్లో ఎంత గొప్ప సహకారం అందిందో తెలిసిందే. కరణ్ జోహార్ లాంటి అగ్ర నిర్మాత ఆ…
మోనాలిసా.. గత ఏడాది సోషల్ మీడియాను ఒక ఊపు ఊపేసిన పేరిది. ఉత్తర్ప్రదేశ్లో జరిగిన మహా కుంభమేళాతో వెలుగులోకి వచ్చిన…
తెలంగాణ ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్, మాజీ మంత్రి పార్టీ కీలక…