రీఎంట్రీలో వరుస బెట్టి సినిమాలు అనౌన్స్ చేసుకుంటూ పోతున్నాడు పవన్ కళ్యాణ్. పునరాగమనంలో తొలి చిత్రం అయిన ‘వకీల్ సాబ్’ ఇంకా పూర్తి కాలేదు కానీ.. అప్పుడే ఐదో సినిమా అనౌన్స్ చేశాడు. సితార ఎంటర్టైన్మెంట్స్ బేనర్లో ‘అప్పట్లో ఒకడుండేవాడు’ ఫేమ్ సాగర్.కె.చంద్ర దర్శకత్వంలో పవన్ నటించబోతున్న సంగతి తెలిసిందే. అధికారికంగా ప్రకటించలేదు కానీ.. ఈ చిత్రం మలయాళ బ్లాక్బస్టర్ ‘అయ్యప్పనుం కోషీయుం’ రీమేక్ అన్నది తెలిసిన విషయమే.
పైగా పవన్ ఈ చిత్రంలో పోలీస్ పాత్ర చేయబోతున్నట్లు కూడా సంకేతాలు ఇచ్చేశారు. దీన్ని బట్టి ఒరిజినల్లో బిజు మీనన్ చేసిన సిన్సియర్ పోలీసాఫీసర్ పాత్రలో పవన్ నటించనున్నట్లు స్పష్టమైంది. ఐతే ఈ పాత్రను, సినిమాను ఉన్నదున్నట్లుగా తెలుగులో తీస్తే ఆడుతుందా అన్నది సందేహం.
‘అయ్యప్పనుం కోషీయుం’ ఇద్దరు ఇగోయిష్టుల మధ్య సాగే పోరు నేపథ్యంలో కొంచెం క్లాస్గా సాగే సినిమా. మలయాళ ప్రేక్షకుల అభిరుచికి అది బాగానే ఉంటుంది. కానీ దాన్ని తెలుగులో యాజిటీజ్గా తీస్తే మాత్రం మన వాళ్లకు నచ్చుతుందా అన్నది సందేహం. పైగా ఈ సినిమాను లాక్ డౌన్ టైంలో తెలుగు వాళ్లు కూడా ఈ సినిమాను బాగానే చూశారు. అలాంటపుడు తెలుగు వెర్షన్లో కచ్చితంగా మార్పు చూపించాలి.
పవన్ చేయబోయే పోలీస్ పాత్ర ఆసక్తికరంగా ఉంటుంది. అందులో దమ్ము కనిపిస్తుంది. కానీ మలయాళంలో మాదిరి సటిల్గా, క్లాస్గా ఆ పాత్రను నడిపిస్తే కిక్కుండదు. కచ్చితంగా ఆ పాత్రకు మరింత ఎలివేషన్ ఇవ్వాలి. మాస్ అంశాలు జోడించాలి. ‘దబంగ్’లో బేసిక్ ఐడియా తీసుకుని దాని రూపురేఖలు మార్చి హరీష్ శంకర్ ‘గబ్బర్ సింగ్’గా మార్చినట్లు సాగర్ కూడా ‘తెలుగు మాస్ టచ్’ ఇస్తే పవన్ పాత్ర పేలేందుకు సినిమా సూపర్ హిట్టయ్యేందుకు అవకాశముంది. అలా కాకుండా ఉన్నదున్నట్లుగా తీసేస్తే ఈ సినిమా తెలుగు ప్రేక్షకులను ఎగ్జైట్ చేయడం కష్టమే.
This post was last modified on October 26, 2020 6:08 pm
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…
రాయ్పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…
కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…
ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్కు…
మలయాళం మెగాస్టార్ గా అభిమానులు పిలుచుకునే మమ్ముట్టి కొత్త సినిమా కలం కవల్ ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చింది. అఖండ 2…
టీమిండియా స్టార్ క్రికెటర్ స్మృతి మంధాన పెళ్లి ఆగిపోవడం అభిమానులను నిరాశపరిచింది. తండ్రి ఆరోగ్యం బాగోలేకపోవడంతో నవంబర్ 23న జరగాల్సిన…