రీఎంట్రీలో వరుస బెట్టి సినిమాలు అనౌన్స్ చేసుకుంటూ పోతున్నాడు పవన్ కళ్యాణ్. పునరాగమనంలో తొలి చిత్రం అయిన ‘వకీల్ సాబ్’ ఇంకా పూర్తి కాలేదు కానీ.. అప్పుడే ఐదో సినిమా అనౌన్స్ చేశాడు. సితార ఎంటర్టైన్మెంట్స్ బేనర్లో ‘అప్పట్లో ఒకడుండేవాడు’ ఫేమ్ సాగర్.కె.చంద్ర దర్శకత్వంలో పవన్ నటించబోతున్న సంగతి తెలిసిందే. అధికారికంగా ప్రకటించలేదు కానీ.. ఈ చిత్రం మలయాళ బ్లాక్బస్టర్ ‘అయ్యప్పనుం కోషీయుం’ రీమేక్ అన్నది తెలిసిన విషయమే.
పైగా పవన్ ఈ చిత్రంలో పోలీస్ పాత్ర చేయబోతున్నట్లు కూడా సంకేతాలు ఇచ్చేశారు. దీన్ని బట్టి ఒరిజినల్లో బిజు మీనన్ చేసిన సిన్సియర్ పోలీసాఫీసర్ పాత్రలో పవన్ నటించనున్నట్లు స్పష్టమైంది. ఐతే ఈ పాత్రను, సినిమాను ఉన్నదున్నట్లుగా తెలుగులో తీస్తే ఆడుతుందా అన్నది సందేహం.
‘అయ్యప్పనుం కోషీయుం’ ఇద్దరు ఇగోయిష్టుల మధ్య సాగే పోరు నేపథ్యంలో కొంచెం క్లాస్గా సాగే సినిమా. మలయాళ ప్రేక్షకుల అభిరుచికి అది బాగానే ఉంటుంది. కానీ దాన్ని తెలుగులో యాజిటీజ్గా తీస్తే మాత్రం మన వాళ్లకు నచ్చుతుందా అన్నది సందేహం. పైగా ఈ సినిమాను లాక్ డౌన్ టైంలో తెలుగు వాళ్లు కూడా ఈ సినిమాను బాగానే చూశారు. అలాంటపుడు తెలుగు వెర్షన్లో కచ్చితంగా మార్పు చూపించాలి.
పవన్ చేయబోయే పోలీస్ పాత్ర ఆసక్తికరంగా ఉంటుంది. అందులో దమ్ము కనిపిస్తుంది. కానీ మలయాళంలో మాదిరి సటిల్గా, క్లాస్గా ఆ పాత్రను నడిపిస్తే కిక్కుండదు. కచ్చితంగా ఆ పాత్రకు మరింత ఎలివేషన్ ఇవ్వాలి. మాస్ అంశాలు జోడించాలి. ‘దబంగ్’లో బేసిక్ ఐడియా తీసుకుని దాని రూపురేఖలు మార్చి హరీష్ శంకర్ ‘గబ్బర్ సింగ్’గా మార్చినట్లు సాగర్ కూడా ‘తెలుగు మాస్ టచ్’ ఇస్తే పవన్ పాత్ర పేలేందుకు సినిమా సూపర్ హిట్టయ్యేందుకు అవకాశముంది. అలా కాకుండా ఉన్నదున్నట్లుగా తీసేస్తే ఈ సినిమా తెలుగు ప్రేక్షకులను ఎగ్జైట్ చేయడం కష్టమే.
This post was last modified on October 26, 2020 6:08 pm
సరిగ్గా వారం రోజుల్లో ఉస్తాద్ భగత్ సింగ్ వచ్చేస్తాడు. థియేటర్ యజమానులు ఆ క్షణం కోసమే ఎదురు చూస్తున్నారు. కేవలం…
ఇప్పుడు తెలుగు సినిమా ఎంతో ఎదిగిపోయింది.. సరికొత్త సినిమాలు తీస్తోంది అని కాలర్ ఎగరేస్తున్నాం కానీ.. రెండు దశాబ్దాల ముందు…
ఇండస్ట్రీ పెద్ద ఎవరు..? ఈ ప్రశ్న టాలీవుడ్లో తరచుగా వినిపిస్తుంటుంది. ఒకప్పుడు దర్శక రత్న దాసరి నారాయణరావు ఈ పాత్రను…
ఎన్నికలు అనగానే నాయకుల్లో మార్పులు సహజం. మరీ ముఖ్యంగా ప్రధాన మంత్రినరేంద్ర మోడీ అయితే.. మరింత ఎక్కువగా శ్రద్ధ తీసుకుంటారు.…
ఒకప్పుడు టాలీవుడ్లో తిరుగులేని ఆధిపత్యం చలాయించిన కథానాయికల్లో తమన్నా ఒకరు. టీనేజీలోనే కథానాయిక అవతారం ఎత్తిన ఆమె పదేళ్లకు పైగానే టాప్…
థియేటర్, ఓటిటి మధ్య ఖచ్చితంగా ఎనిమిది వారాల గ్యాప్ ఉండాలనే నిబంధన మీద దక్షిణాది ఇండస్ట్రీ పెద్దలు చాలా సీరియస్…