తన స్టార్డమ్కి అతీతంగా పవన్ కళ్యాణ్ ఒక్కోసారి విచిత్రమైన ప్రాజెక్టులు ఓకే చేస్తుంటాడు. మళ్లీ నటించాలనే నిర్ణయం తీసుకున్న తర్వాత ‘పింక్’ రీమేక్ చేయాలని పవన్ డిసైడ్ అవడమే ఆశ్చర్యకరమయితే ఇప్పుడు ‘అయ్యప్పనుమ్ కోషియుమ్’ చిత్రాన్ని తెలుగులో చేస్తున్నాడట. సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై రూపొందే ఈ చిత్రానికి సంబంధించిన అఫీషియల్ అనౌన్స్మెంట్ త్వరలోనే వస్తుందని సమాచారం. ఈ చిత్రానికి యువ దర్శకుడు సాగర్ చంద్ర దర్శకత్వం వహిస్తాడని ప్రచారంలో వుంది.
నారా రోహిత్, శ్రీవిష్ణుతో ‘అప్పట్లో ఒకడుండేవాడు’ చిత్రాన్ని రూపొందించిన సాగర్ చంద్ర ఆ తర్వాత మరే చిత్రం రూపొందించలేదు. పవన్కళ్యాణ్ లాంటి అగ్ర హీరోతో అంతగా అనుభవం లేని, కనీసం ఫీల్డులో కూడా లేని దర్శకుడితో సినిమా ఏమిటనేది ఫాన్స్ కి అంతు చిక్కడం లేదు. వకీల్ సాబ్ మాదిరిగా తక్కువ వర్కింగ్ డేస్లో కంప్లీట్ అయ్యే సినిమా కనుక పవన్ కళ్యాణ్ దీనిని ప్రిఫర్ చేస్తున్నట్టు భోగట్టా. వకీల్ సాబ్ షూటింగ్ పూర్తి కాగానే ఈ చిత్రం మొదలు పెట్టి ఆ తర్వాత క్రిష్తో చేసే చిత్రానికి పవన్ షిఫ్ట్ అవుతాడట. ఆ తర్వాతే హరీష్ శంకర్తో మైత్రి మూవీస్ సినిమా వుంటుందని ఇండస్ట్రీ రిపోర్ట్.
This post was last modified on October 25, 2020 10:51 am
లెజెండరీ రైటర్, దర్శక ధీరుడు రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్.. ఒక స్టేజ్ మీద తలవంచి క్షమాపణలు చెప్పడం చర్చనీయాంశమైంది.…
భారతదేశంలో ఇంటర్నెట్ వాడకాన్ని జియో ఎలాగైతే ఊహించని స్థాయికి తీసుకెళ్లిందో, ఇప్పుడు కృత్రిమ మేధ (AI) విషయంలోనూ అదే తరహా…
వెంకటేష్ ఫిల్మోగ్రఫీలో నువ్వు నాకు నచ్చావ్ చాలా ప్రత్యేక స్థానం సంపాదించుకున్న విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వచ్చి పాతిక సంవత్సరాలు…
చిన్న హీరోలు వేగంగా ఎక్కువ సినిమాలు చేయడం రెమ్యునరేషన్ పరంగా సంతృప్తినిస్తుందేమో కానీ కెరీర్ పరంగా ఒక్కోసారి ఇదే పెద్ద…
స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి బీఆర్ఎస్ తరఫున గత ఎన్నికల్లో గెలిచారు. ఆ తర్వాత కాంగ్రెస్కు మద్దతుగా వ్యవహరిస్తూ…
నైజాంలో చాలా ఏళ్ల నుంచి డిస్ట్రిబ్యూషన్లో దిల్ రాజే కింగ్. ఆయన ఈ ఏరియాలో నంబర్ వన్ డిస్ట్రిబ్యూటర్గా ఎదిగాక..…