తన స్టార్డమ్కి అతీతంగా పవన్ కళ్యాణ్ ఒక్కోసారి విచిత్రమైన ప్రాజెక్టులు ఓకే చేస్తుంటాడు. మళ్లీ నటించాలనే నిర్ణయం తీసుకున్న తర్వాత ‘పింక్’ రీమేక్ చేయాలని పవన్ డిసైడ్ అవడమే ఆశ్చర్యకరమయితే ఇప్పుడు ‘అయ్యప్పనుమ్ కోషియుమ్’ చిత్రాన్ని తెలుగులో చేస్తున్నాడట. సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై రూపొందే ఈ చిత్రానికి సంబంధించిన అఫీషియల్ అనౌన్స్మెంట్ త్వరలోనే వస్తుందని సమాచారం. ఈ చిత్రానికి యువ దర్శకుడు సాగర్ చంద్ర దర్శకత్వం వహిస్తాడని ప్రచారంలో వుంది.
నారా రోహిత్, శ్రీవిష్ణుతో ‘అప్పట్లో ఒకడుండేవాడు’ చిత్రాన్ని రూపొందించిన సాగర్ చంద్ర ఆ తర్వాత మరే చిత్రం రూపొందించలేదు. పవన్కళ్యాణ్ లాంటి అగ్ర హీరోతో అంతగా అనుభవం లేని, కనీసం ఫీల్డులో కూడా లేని దర్శకుడితో సినిమా ఏమిటనేది ఫాన్స్ కి అంతు చిక్కడం లేదు. వకీల్ సాబ్ మాదిరిగా తక్కువ వర్కింగ్ డేస్లో కంప్లీట్ అయ్యే సినిమా కనుక పవన్ కళ్యాణ్ దీనిని ప్రిఫర్ చేస్తున్నట్టు భోగట్టా. వకీల్ సాబ్ షూటింగ్ పూర్తి కాగానే ఈ చిత్రం మొదలు పెట్టి ఆ తర్వాత క్రిష్తో చేసే చిత్రానికి పవన్ షిఫ్ట్ అవుతాడట. ఆ తర్వాతే హరీష్ శంకర్తో మైత్రి మూవీస్ సినిమా వుంటుందని ఇండస్ట్రీ రిపోర్ట్.
This post was last modified on October 25, 2020 10:51 am
స్కూల్లో పాఠాలు నేర్చుకోవాల్సిన, పరీక్షలు రాయాల్సిన వయసులో ఐపీఎల్లో వైభవ్ సూర్యవంశీ అనే కుర్రాడు ఎలా చెలరేగిపోతున్నాడో చూస్తున్నాం. సినీ…
టాలీవుడ్ బాక్సాఫీస్ కు ఏప్రిల్ అంటే చాలా స్పెషల్. ఎందుకంటే చరిత్రలో చెప్పుకోదగిన ఎన్నో బ్లాక్ బస్టర్లు ఈ నెలలోనే…
కొన్ని కథలు ముగిసిపోవడాన్ని ప్రేక్షకులు అంతగా ఇష్టపడరు. వాటికి కొనసాగింపు ఉంటేనే బాగుంటుందని ఆశిస్తారు. వాటి మేకర్స్ కూడా ఆ…
దేవర పార్ట్ 2 ఉంటుందో లేదోననే అనుమానాలు ఇంకా కొనసాగుతుండగానే దర్శకుడు కొరటాల శివ బాలకృష్ణతో ఒక ప్రాజెక్టు లాక్…
తెలంగాణ అధికార పార్టీ కాంగ్రెస్లో వన్ మ్యాన్ `ఆర్మీ`గా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కనిపిస్తున్నారు. గత ఎన్నికల్లో పార్టీని అధికారంలోకి…
ఉత్తరాంధ్ర రాజకీయాల్లో ఒకప్పుడు దూకుడుగా ఉన్న వైసీపీ ఇప్పుడు పెద్దగా కనిపించడం లేదన్న టాక్ వినిపిస్తోంది. కీలక నాయకులు ఉన్నప్పటికీ..…