తన స్టార్డమ్కి అతీతంగా పవన్ కళ్యాణ్ ఒక్కోసారి విచిత్రమైన ప్రాజెక్టులు ఓకే చేస్తుంటాడు. మళ్లీ నటించాలనే నిర్ణయం తీసుకున్న తర్వాత ‘పింక్’ రీమేక్ చేయాలని పవన్ డిసైడ్ అవడమే ఆశ్చర్యకరమయితే ఇప్పుడు ‘అయ్యప్పనుమ్ కోషియుమ్’ చిత్రాన్ని తెలుగులో చేస్తున్నాడట. సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై రూపొందే ఈ చిత్రానికి సంబంధించిన అఫీషియల్ అనౌన్స్మెంట్ త్వరలోనే వస్తుందని సమాచారం. ఈ చిత్రానికి యువ దర్శకుడు సాగర్ చంద్ర దర్శకత్వం వహిస్తాడని ప్రచారంలో వుంది.
నారా రోహిత్, శ్రీవిష్ణుతో ‘అప్పట్లో ఒకడుండేవాడు’ చిత్రాన్ని రూపొందించిన సాగర్ చంద్ర ఆ తర్వాత మరే చిత్రం రూపొందించలేదు. పవన్కళ్యాణ్ లాంటి అగ్ర హీరోతో అంతగా అనుభవం లేని, కనీసం ఫీల్డులో కూడా లేని దర్శకుడితో సినిమా ఏమిటనేది ఫాన్స్ కి అంతు చిక్కడం లేదు. వకీల్ సాబ్ మాదిరిగా తక్కువ వర్కింగ్ డేస్లో కంప్లీట్ అయ్యే సినిమా కనుక పవన్ కళ్యాణ్ దీనిని ప్రిఫర్ చేస్తున్నట్టు భోగట్టా. వకీల్ సాబ్ షూటింగ్ పూర్తి కాగానే ఈ చిత్రం మొదలు పెట్టి ఆ తర్వాత క్రిష్తో చేసే చిత్రానికి పవన్ షిఫ్ట్ అవుతాడట. ఆ తర్వాతే హరీష్ శంకర్తో మైత్రి మూవీస్ సినిమా వుంటుందని ఇండస్ట్రీ రిపోర్ట్.
This post was last modified on October 25, 2020 10:51 am
కామేపల్లి తులసిబాబుకు ఏపీ సీఐడీ భారీ నజరానా ఇచ్చిందన్న వ్యవహారం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఏపీ అసెంబ్లీ…
తమిళ టాప్ స్టార్లలో ఒకడైన అజిత్ కుమార్కు కొన్నేళ్ల నుంచి నిఖార్సయిన బాక్సాఫీస్ హిట్ లేదు. 2019లో వచ్చిన ‘విశ్వాసం’తో…
వైసీపీ కీలక నేత, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అటవీ భూములు ఆక్రమించారన్న విషయంపై ఏపీ ప్రభుత్వం ఇప్పటికే విచారణకు…
సినిమా ఫంక్షన్ లో వైసీపీని టార్గెట్ చేశారంటూ ఆరోపణలు ఎదుర్కొంటున్న టలీవుడ్ నటుడు 30 ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వీరాజ్… బుధవారం…
పెద్ద హీరోల సినిమాలకు ఏ టైటిల్ పెట్టినా చెల్లుతుందనుకోవడం తప్పు. ఎంపికలో ఏ మాత్రం పొరపాటు చేసినా దాని ప్రభావం…
``జగన్ గురించి ఎందుకు అంత వ్యతిరేక ప్రచారం చేస్తున్నారో.. నాకు ఇప్పటికీ అర్ధం కాదు. ఆయన చాలా మంచి వారు.…