గత రెండు వారాలుగా ఇండియన్ బాక్సాఫీస్ను ఏలుతున్న సినిమా.. చావా. ఛత్రపతి శివాజీ తనయుడు శంబాజీ మహారాజ్ జీవిత కథ ఆధారంగా లక్ష్మణ్ ఉటేకర్ ఈ చిత్రాన్ని రూపొందించాడు. రిలీజ్ ముందున్న అంచనాలను మించిపోయి ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర వసూళ్ల వర్షం కురిపిస్తూ దూసుకెళ్తోంది. ఇప్పటికే కలెక్షన్లు రూ.300 కోట్లకు చేరువ అయ్యాయి. ఫుల్ రన్లో రూ.400 కోట్ల మార్కును కూడా ఈ సినిమా దాటేసే అవకాశముంది.
ఐతే రిలీజ్ తర్వాత ఈ సినిమా చుట్టూ కొన్ని వివాదాలు కూడా ముసురుకున్నాయి. చరిత్రను వక్రీకరించారన్న ఆరోపణలు వచ్చాయి. మరోవైపు ఈ చిత్రంలో గనోజి, కనోజీ అనే పాత్రలను చూపించిన విధానంపై వారి వారసులు తీవ్ర అభ్యంతరం తెలిపారు. చరిత్రను వక్రీకరిస్తూ తమ పూర్వీకుల పాత్రలను చెడుగా చూపించినందుకు రూ.100 కోట్ల పరువు నష్టం చెల్లించాలంటూ వారి వారసులు చిత్ర బృందానికి లీగల్ నోటీసులు పంపించారు. ఐతే సినిమా గొప్పగా ఆడుతున్న సమయంలో ఇలాంటి వివాదాలు ఎందుకని చిత్ర బృందం ఈ విషయంలో తగ్గింది. స్వయంగా దర్శకుడు లక్ష్మణ్ ఉటేకర్ గనోజీ, ఖనోజీల వారసుల్లో ఒకడైన భూషణ్ షిర్కేను కలుసుకున్నాడు.
అంతే కాక సినిమాలో ఈ ఇద్దరిపై తీసిన సన్నివేశాల విషయంలో క్షమాపణలు కూడా చెప్పాడు. ఇంటి పేర్లను వాడకుండా ఈ పాత్రలను తెరపై చూపించామని.. ఆ పాత్రలను కించపరిచే ఉద్దేశం తమకు ఎంతమాత్రం లేదని లక్ష్మణ్ ఉటేకర్ స్పష్టం చేశాడు. ఎవరి మనోభావాలైనా దెబ్బ తిని ఉంటే అందుకు మన్నించాలని కోరాడు.
ఐతే సినిమాలో అభ్యంతరంగా ఉన్న సన్నివేశాలను తొలగించాలని గనోజీ, కనోజీల వారసులు డిమాండ్ చేసిన నేపథ్యంలో దీనిపై చిత్ర బృందం ఏం చేస్తుందో చూడాలి. ఈ వివాదాన్ని పక్కన పెడితే.. గత వారం వచ్చిన, ఈ వారం వస్తున్న కొత్త చిత్రాలు కూడా ‘చావా’ మీద పెద్దగా ప్రభావం చూపే సంకేతాలు కనిపించడం లేదు. ఈ వీకెండ్లో కూడా కొత్త సినిమా తరహాలో ‘చావా’ వసూళ్లు వస్తుండడం విశేషం.
This post was last modified on February 25, 2025 5:27 pm
ఎన్నికల్లో నోట్లు పంపిణీ చేస్తేనే ఓట్లు వేయడం మామూలైపోయింది. గత కొన్నేళ్లుగా ఈ దుస్సాంప్రదాయం పెరిగిపోయింది. దీంతో నిజంగా ప్రజలకు…
స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో ఢిల్లీలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నుంచి వచ్చిన ఒక వీడియో ఇప్పుడు వివాదానికి కేంద్రంగా మారింది.…
కాక్రోచ్ జనతా పార్టీ(సీజేపీ) అధినేత అభిజిత్ దీప్కే ఇటీవల ప్రకటించిన `పాఠశాలల అభివృద్ధి` కార్యక్రమానికి 80వ స్వాతంత్ర దినోత్సవం వేడుకలే…
స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని దేశమంతా జాతీయ పతాకాన్ని ఎగరేయడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు అమరావతి లోని రాయపూడి గ్రౌండ్స్…
గత కొన్ని రోజులుగా మలయాళ కథానాయిక అనుపమ పరమేశ్వరన్ బ్రేకప్ వ్యవహారం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే.…
తాజాగా విడుదలైన విశ్వనాథ్ అండ్ సన్స్ తెలుగులో చూపిస్తున్న జోరు తమిళంలో ప్రదర్శించడం లేదన్నది వాస్తవం. ఓపెనింగ్స్ నెంబర్లు పోల్చుకుని…