గత రెండు వారాలుగా ఇండియన్ బాక్సాఫీస్ను ఏలుతున్న సినిమా.. చావా. ఛత్రపతి శివాజీ తనయుడు శంబాజీ మహారాజ్ జీవిత కథ ఆధారంగా లక్ష్మణ్ ఉటేకర్ ఈ చిత్రాన్ని రూపొందించాడు. రిలీజ్ ముందున్న అంచనాలను మించిపోయి ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర వసూళ్ల వర్షం కురిపిస్తూ దూసుకెళ్తోంది. ఇప్పటికే కలెక్షన్లు రూ.300 కోట్లకు చేరువ అయ్యాయి. ఫుల్ రన్లో రూ.400 కోట్ల మార్కును కూడా ఈ సినిమా దాటేసే అవకాశముంది.
ఐతే రిలీజ్ తర్వాత ఈ సినిమా చుట్టూ కొన్ని వివాదాలు కూడా ముసురుకున్నాయి. చరిత్రను వక్రీకరించారన్న ఆరోపణలు వచ్చాయి. మరోవైపు ఈ చిత్రంలో గనోజి, కనోజీ అనే పాత్రలను చూపించిన విధానంపై వారి వారసులు తీవ్ర అభ్యంతరం తెలిపారు. చరిత్రను వక్రీకరిస్తూ తమ పూర్వీకుల పాత్రలను చెడుగా చూపించినందుకు రూ.100 కోట్ల పరువు నష్టం చెల్లించాలంటూ వారి వారసులు చిత్ర బృందానికి లీగల్ నోటీసులు పంపించారు. ఐతే సినిమా గొప్పగా ఆడుతున్న సమయంలో ఇలాంటి వివాదాలు ఎందుకని చిత్ర బృందం ఈ విషయంలో తగ్గింది. స్వయంగా దర్శకుడు లక్ష్మణ్ ఉటేకర్ గనోజీ, ఖనోజీల వారసుల్లో ఒకడైన భూషణ్ షిర్కేను కలుసుకున్నాడు.
అంతే కాక సినిమాలో ఈ ఇద్దరిపై తీసిన సన్నివేశాల విషయంలో క్షమాపణలు కూడా చెప్పాడు. ఇంటి పేర్లను వాడకుండా ఈ పాత్రలను తెరపై చూపించామని.. ఆ పాత్రలను కించపరిచే ఉద్దేశం తమకు ఎంతమాత్రం లేదని లక్ష్మణ్ ఉటేకర్ స్పష్టం చేశాడు. ఎవరి మనోభావాలైనా దెబ్బ తిని ఉంటే అందుకు మన్నించాలని కోరాడు.
ఐతే సినిమాలో అభ్యంతరంగా ఉన్న సన్నివేశాలను తొలగించాలని గనోజీ, కనోజీల వారసులు డిమాండ్ చేసిన నేపథ్యంలో దీనిపై చిత్ర బృందం ఏం చేస్తుందో చూడాలి. ఈ వివాదాన్ని పక్కన పెడితే.. గత వారం వచ్చిన, ఈ వారం వస్తున్న కొత్త చిత్రాలు కూడా ‘చావా’ మీద పెద్దగా ప్రభావం చూపే సంకేతాలు కనిపించడం లేదు. ఈ వీకెండ్లో కూడా కొత్త సినిమా తరహాలో ‘చావా’ వసూళ్లు వస్తుండడం విశేషం.
This post was last modified on February 25, 2025 5:27 pm
టీవీకే అధినేత, తమిళనాడు సీఎం విజయ్ తీసుకుంటున్న నిర్ణయాలపై ప్రశంసలు వస్తున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా పాఠశాలలు, దేవాలయాల సమీపంలో…
రాత్రి వేళ గస్తీ కాసేందుకు దేశం కాని దేశం వస్తున్న నేపాలీలు ఇప్పుడు నేరాల్లో ఆరితేరిపోయారని చెప్పాలి. గుర్ఖాలుగా ఎంట్రీ…
చట్టం గెలిచిందనుకున్న ప్రతీసారి పైరసీ కొత్త అవతారం ఎత్తుతోంది. ఐబొమ్మ ఆపరేటర్ రవి అరెస్ట్, సైట్ క్లోజ్ అని పోలీసులు…
ఇప్పుడు ఇండస్ట్రీలో చాలా విషయాల మీద వేడి వేడి చర్చలు జరుగుతున్నాయి. సింగల్ స్క్రీన్లకు పర్సెంటెజ్ ఇవ్వడం, పేరు మోసిన…
అల.. వైకుంఠపురములో.. తర్వాత పాన్ ఇండియా హీరోయిన్ అయిపోయిందనుకున్న టైమ్లో వరుస డిజాస్టర్లు పూజా కెరీర్ని రివర్స్లో తిప్పేశాయి. రాధేశ్యామ్,…
ఏపీ సీఎం చంద్రబాబుకు కేంద్రం చేసిన ప్రతిపాదన తీవ్ర సంకట స్థితిలోకి నెట్టేసింది. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు అనుమతి ఇవ్వాలంటూ.. కేంద్ర…