గత రెండు వారాలుగా ఇండియన్ బాక్సాఫీస్ను ఏలుతున్న సినిమా.. చావా. ఛత్రపతి శివాజీ తనయుడు శంబాజీ మహారాజ్ జీవిత కథ ఆధారంగా లక్ష్మణ్ ఉటేకర్ ఈ చిత్రాన్ని రూపొందించాడు. రిలీజ్ ముందున్న అంచనాలను మించిపోయి ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర వసూళ్ల వర్షం కురిపిస్తూ దూసుకెళ్తోంది. ఇప్పటికే కలెక్షన్లు రూ.300 కోట్లకు చేరువ అయ్యాయి. ఫుల్ రన్లో రూ.400 కోట్ల మార్కును కూడా ఈ సినిమా దాటేసే అవకాశముంది.
ఐతే రిలీజ్ తర్వాత ఈ సినిమా చుట్టూ కొన్ని వివాదాలు కూడా ముసురుకున్నాయి. చరిత్రను వక్రీకరించారన్న ఆరోపణలు వచ్చాయి. మరోవైపు ఈ చిత్రంలో గనోజి, కనోజీ అనే పాత్రలను చూపించిన విధానంపై వారి వారసులు తీవ్ర అభ్యంతరం తెలిపారు. చరిత్రను వక్రీకరిస్తూ తమ పూర్వీకుల పాత్రలను చెడుగా చూపించినందుకు రూ.100 కోట్ల పరువు నష్టం చెల్లించాలంటూ వారి వారసులు చిత్ర బృందానికి లీగల్ నోటీసులు పంపించారు. ఐతే సినిమా గొప్పగా ఆడుతున్న సమయంలో ఇలాంటి వివాదాలు ఎందుకని చిత్ర బృందం ఈ విషయంలో తగ్గింది. స్వయంగా దర్శకుడు లక్ష్మణ్ ఉటేకర్ గనోజీ, ఖనోజీల వారసుల్లో ఒకడైన భూషణ్ షిర్కేను కలుసుకున్నాడు.
అంతే కాక సినిమాలో ఈ ఇద్దరిపై తీసిన సన్నివేశాల విషయంలో క్షమాపణలు కూడా చెప్పాడు. ఇంటి పేర్లను వాడకుండా ఈ పాత్రలను తెరపై చూపించామని.. ఆ పాత్రలను కించపరిచే ఉద్దేశం తమకు ఎంతమాత్రం లేదని లక్ష్మణ్ ఉటేకర్ స్పష్టం చేశాడు. ఎవరి మనోభావాలైనా దెబ్బ తిని ఉంటే అందుకు మన్నించాలని కోరాడు.
ఐతే సినిమాలో అభ్యంతరంగా ఉన్న సన్నివేశాలను తొలగించాలని గనోజీ, కనోజీల వారసులు డిమాండ్ చేసిన నేపథ్యంలో దీనిపై చిత్ర బృందం ఏం చేస్తుందో చూడాలి. ఈ వివాదాన్ని పక్కన పెడితే.. గత వారం వచ్చిన, ఈ వారం వస్తున్న కొత్త చిత్రాలు కూడా ‘చావా’ మీద పెద్దగా ప్రభావం చూపే సంకేతాలు కనిపించడం లేదు. ఈ వీకెండ్లో కూడా కొత్త సినిమా తరహాలో ‘చావా’ వసూళ్లు వస్తుండడం విశేషం.
This post was last modified on February 25, 2025 5:27 pm
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…
చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…