కొందరు హీరోయిన్లు కెరీర్ ఆరంభంలో చేసే పాత్రలను బట్టి వారి మీద ఒక ట్రెడిషనల్ ముద్ర పడిపోతుంది. దీంతో ఆ తర్వాత కూడా అలాంటి పాత్రలే వస్తాయి. గ్లామర్ పాత్రలు అనగానే వీళ్లు చేయరనే అభిప్రాయం బలంగా ఉంటుంది. ముఖ్యంగా తెలుగమ్మాయిల విషయంలో ఈ ముద్ర పడడం ఎక్కువ. తన మీదా అలాంటి అభిప్రాయం ఉండిపోయిందని.. తాను చేయనేమో అనుకుని ముద్దు సీన్లు ఉన్న సినిమాలేవీ తనకు ఆఫర్ చేయట్లేదని ఓ ఇంటర్వ్యూలో రీతూ వర్మ వ్యాఖ్యానించింది.
కథ డిమాండ్ చేస్తే అలాంటి పాత్రలు చేయడానికి తనకు అభ్యంతరం లేదని రీతూ చెప్పడం విశేషం. ‘‘ముద్దు సీన్లు ఉన్న సినిమాల్లో నాకు అవకాశాలు రావడం లేదు. కానీ కథకు అవసరం అనుకుంటే అలాంటి సీన్లు చేయడానికి నాకు ఇబ్బందేమీ లేదు. ఈ అమ్మాయి ఇలాంటి పాత్రలు చేయదు అని కొందరు ఒక నిర్ణయానికి వచ్చేశారు. ఆ కారణంతోనే నా దగ్గరికి అలాంటి కథలు రావడం లేదనుకుంటా’’ అని రీతూ పేర్కొంది.
ఇక గత ఏడాది తమ టీం అంతా ఎన్నో ఆశలు పెట్టుకున్న ‘స్వాగ్’ సినిమా అనుకున్నంతగా ఆడకపోవడం గురించి రీతూ స్పందిస్తూ.. ‘‘మేం ఆ సినిమా చేసేటపుడే అది అందరికీ నచ్చే సినిమా కాదని అనుకున్నాం. ఒక వర్గమే దీనికి కనెక్ట్ అవుతుందనుకున్నాం. ఆ కథలోని డెప్త్ చాలామందికి అర్థం కాలేదు. కానీ ఆ విషయంలో బాధ లేదు. నేను చేసి స్పెషల్ మూవీస్లో ‘స్వాగ్’ ఒకటి. అలాంటి కథలో నటించినందుకు సంతృప్తిగా ఉంది. నటిగా నాకు అది స్పెషల్’’ అని చెప్పింది.
తన కెరీర్ను మలుపు తిప్పిన ‘పెళ్ళిచూపులు’ చిత్రానికి తరుణ్ భాస్కర్ సీక్వెల్ తీయాలనుకుని తనను అడిగితే తప్పకుండా నటిస్తానని రీతూ చెప్పింది. ‘‘పెళ్లిచూపులు మా స్నేహితులందరం కలిసి చిన్న బడ్జెట్లో చేసిన సినిమా. అది మా అందరి జీవితాలను మలుపు తిప్పింది. విజయ్ పెద్ద స్టార్ అయ్యాడు. అతను ఆ స్థాయికి వెళ్తాడనుకోలేదు. కానీ తనకు మాత్రం ఆ కాన్ఫిడెన్స్ ఉండేది. తనను చూస్తే గర్వంగా అనిపిస్తుంది. ‘పెళ్ళిచూపులు-2’ మేమిద్దరం చేయాలని ప్రేక్షకులు డిమాండ్ చేస్తే తప్పకుండా నటిస్తాం’’ అని రీతూ తెలిపింది.
This post was last modified on February 23, 2025 3:18 pm
బీఆర్ ఎస్ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ అరెస్టు నేపథ్యంలో తెలంగాణ రాజకీయాలు మరో సారి నిప్పు రాజుకున్నాయి.…
ఎట్టకేలకు మాజీ మంత్రి అంబటి రాంబాబు రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి విడుదలయ్యారు.అంబటి రాంబాబుపై ఉన్న అన్ని కేసుల్లోనూ ఆయనకు…
ఒకప్పుడు నిర్మాతలకు విపరీతమైన గౌరవం ఉండేది. పరిశ్రమను పోషించేది వాళ్లే కాబట్టి హీరో హీరోయిన్ దగ్గర నుంచి సాంకేతిక నిపుణులు,…
తెలంగాణలోని జగిత్యాల జిల్లా కోరుట్ల బస్టాండ్లో ఒక వింత సంఘటన స్థానికులను, ప్రయాణికులను ఆశ్చర్యానికి గురిచేసింది. బుర్ఖా వేసుకుని మహిళల…
తాజాగా రాజ్యసభలో ఖాళీ అవుతున్న 37 స్థానాలకు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నికలు నిర్వహించేందుకు రెడీ అయింది. దీనికి…
ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్.. గత ఆదివారం కొలంబోకు వెళ్లి ఇండియా, పాకిస్థాన్ మధ్య టీ20 ప్రపంచకప్ మ్యాచ్ను వీక్షించడం…