న్యాచురల్ స్టార్ నాని హీరోగానే కాక నిర్మాతగానూ తన అభిరుచిని చాటడం చూస్తున్నాం. ఏదో కమర్షియల్ గా తీసి నాలుగు డబ్బులు చేసుకుందామని కాకుండా కంటెంట్ తో మెప్పించి కొత్త తరహా ట్రెండ్ కి శ్రీకారం చుట్టేలా ఏదైనా చేయాలనే తాపత్రయం ప్రతి సినిమాలో కనిపిస్తుంది. ఇలా ఆలోచించి ఆ అవకాశం ఇవ్వకపోతే ఇవాళ ప్రశాంత్ వర్మ అనే దర్శకుడు ఇంత స్థాయికి రావడానికి మరింత టైం పట్టేదేమో. శైలేష్ కొలను అనే డాక్టర్ కు హిట్ ది ఫస్ట్ కేస్ ఛాన్స్ ఇవ్వకపోయి ఉంటే తర్వాత అతను అడివి శేష్, వెంకటేష్ తర్వాత ఇప్పుడు నానితోనే ప్యాన్ ఇండియా మూవీ చేసే స్థాయికి చేరడానికి లేటయ్యేదేమో.
ఇవన్నీ ఆయా దర్శకుల టాలెంట్లను నమ్ముకుని చేసిన ప్రయత్నాలే. ఫలితాలు కూడా అంతే గొప్పగా వచ్చాయి. తాజాగా నాని సమర్పణలో వస్తున్న మరో సినిమా కోర్ట్. క్యాప్షన్ గా స్టేట్ వర్సెస్ ఏ నో బడీ అని పెట్టారు. ఇవాళ జరిగిన ప్రెస్ మీట్ లో నాని మాములు కాన్ఫిడెన్స్ చూపించలేదు. మీడియా, ప్రేక్షకులు, ఇండస్ట్రీ అందరికీ ముందుగానే రెడ్ కార్పెట్ ప్రీమియర్లు వేస్తామని, షో అయ్యాక అందరూ స్టాండింగ్ ఒవేషన్ ఇచ్చేంత గొప్పగా ఎమోషన్ పండిందని అంచనాలు పెంచేశాడు. అంతేకాదు హీరోయిన్ నటనను ప్రశంసిస్తూ మూడు నాలుగుసార్లు కన్నీళ్లు పెట్టుకున్న వైనాన్ని గుర్తు చేసుకున్నాడు.
ప్రియదర్శికి బలగంని మించిన ల్యాండ్ మార్క్ గా కోర్ట్ నిలిచిపోతుందని భరోసా ఇవ్వడం మరో విశేషం. మొత్తానికి అసలు బజ్ అంతగా లేని కోర్ట్ మీద ఒక్కసారిగా హైప్ వచ్చేలా చేయడంలో నాని వేసిన మొదటి అడుగు బాగుంది. మాములుగా ఇలాంటి కోర్ట్ రూమ్ డ్రామాలు హిందీ, మలయాళంలో ఎక్కువగా వస్తాయి. తెలుగులో వకీల్ సాబ్ లాంటి ప్రయత్నాలు తక్కువ. అది కూడా పవన్ కళ్యాణ్ చేశాడు కాబట్టి రేంజ్ పెరిగింది. కానీ నాని ఈసారి పూర్తిగా కథను నమ్మి కోర్ట్ ని తీశాడు. నిర్మాణంలో ఉండగానే నెట్ ఫ్లిక్స్ కొనేసింది. థియేటర్ ఎక్స్ పీరియన్స్ బెస్ట్ ఉంటుందని నాని ఇస్తున్న హామీ ఓపెనింగ్స్ కి పునాది వేసింది.
ఈ ఏడాది వేసవికి సరైన గమ్యస్థానంగా శ్రీనగర్ నిలిచింది. పెద్దగా ప్రచారం జరగనప్పటికి.. ఈసారి వేసవిలో చల్లదనాన్ని అస్వాదించేందుకు శ్రీనగర్…
నేటి యువత ప్రభుత్వాలపై తమ ఆగ్రహాన్ని పలు రకాలుగా వ్యక్తం చేస్తున్నారు. "మాకు కార్పొరేటర్ అయినా ఒకటే, సీఎం అయినా…
ఈ రోజుల్లో చెప్పిన డేటుకు సినిమాను రిలీజ్ చేసే ఫిలిం మేకర్స్ అరుదైపోయారు. ఒకప్పుడు ఎంత భారీ చిత్రాలనైనా మూడు…
గత రెండు మాసాలకు పైగా ఇంధన, గ్యాస్ సమస్యలతో ప్రపంచ దేశాలు ఉక్కిరి బిక్కిరికి గురవుతున్నాయి. చమురు ధరలు పెరిగిపోవడమే…
తెలంగాణపై మరోసారి ఏపీ డిప్యూటీ సీఎం జనసేన పార్టీ అధినేత కీలక వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీలో సోమవారం చేపట్టిన జాతీయ…
దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో బీజేపీని మరింత బలోపేతం చేసుకునేందుకు ఆ పార్టీ అగ్ర నేతలు ప్రయత్నం చేస్తున్నారా? ప్రాంతీయ పార్టీల…