దక్షిణాది సినిమాను గొప్ప మలుపు తిప్పిన దర్శకుడు శంకర్. ‘జెంటిల్మ్యాన్’తో మొదలుపెడితే ఎన్నో అద్భుతమైన సినిమాలను అందించిన శంకర్.. రెండేళ్ల కిందట ఇండియాస్ హైయెస్ట్ బడ్జెట్ మూవీ ‘2.0’తో పలకరించాడు. దీని తర్వాత ఆయన మరో మెగా మూవీని లైన్లో పెట్టారు. అదే.. ఇండియన్-2. రెండు దశాబ్దాల కిందట వచ్చిన మెగా బ్లాక్బస్టర్ మూవీ ‘ఇండియన్’కు ఇది సీక్వెల్ అన్న సంగతి తెలిసిందే. కమల్ హాసనే ఇందులోనూ కథానాయకుడు.
ఐతే ఈ సినిమాను ఏ ముహూర్తాన మొదలుపెట్టారో కానీ.. ఏదో ఒక అవాంతరం వస్తూనే ఉంది. మొదట కమల్కు మేకప్ పడనందుకు, ఆ తర్వాత ఆయన లోక్సభ ఎన్నికల్లో బిజీ అయినందుకు.. ఆపై సెట్లో ఒక భారీ ప్రమాదం చోటు చేసుకోవడం వల్ల ఈ సినిమాకు బ్రేకులు పడ్డాయి. చివరికి కరోనా వచ్చి ఈ సినిమాకు ఇంకా పెద్ద బ్రేక్ వేసింది.
ఐతే కరోనా ప్రభావం కొంచెం తగ్గాక అన్ని భాషల్లోనూ చిత్రీకరణలు పున:ప్రారంభం అయినప్పటికీ ‘ఇండియన్-2’ మాత్రం పట్టాలెక్కట్లేదు. ఇందుకు కారణాలేంటేన్నది అర్థం కావడం లేదు. సమస్య నిర్మాతల దగ్గరే ఉందని కోలీవుడ్ మీడియా అంటోంది. వాళ్ల తీరుతో విసిగిపోయిన శంకర్.. తాజాగా ఒక ఘాటు లేఖ రాసినట్లు తెలిసింది. సినిమాను పున:ప్రారంభించే ప్రణాళికలేమైనా ఉన్నాయా లేదా అని ఆయన సూటిగా ప్రశ్నించాడట.
సాధ్యమైనంత త్వరగా చిత్రీకరణ మొదలుపెట్టని పక్షంలో తాను వేరే సినిమాను మొదలుపెట్టుకుంటానని ఆయన హెచ్చరించినట్లు తెలుస్తోంది. వచ్చే మూణ్నాలుగు నెలల్లో ‘ఇండియన్-2’ పూర్తి చేయని పక్షంలో ఆ తర్వాత చాలా ఆలస్యమవుతుంది. కమల్ అసెంబ్లీ ఎన్నికల పనుల్లో బిజీ అయిపోతారు. ఎన్నికల ఫలితాల తర్వాత ఆయన ప్రయాణం ఎలా ఉంటుందో చెప్పలేం. ఈ నేపథ్యంలో ‘ఇండియన్-2’ సంగతి నిర్మాతల దగ్గర తేల్చుకోవాలని శంకర్ భావిస్తున్నట్లు సమాచారం.
This post was last modified on October 23, 2020 5:58 pm
ఒకప్పుడు టాలీవుడ్లో తిరుగులేని ఆధిపత్యం చలాయించిన కథానాయికల్లో తమన్నా ఒకరు. టీనేజీలోనే కథానాయిక అవతారం ఎత్తిన ఆమె పదేళ్లకు పైగానే టాప్…
థియేటర్, ఓటిటి మధ్య ఖచ్చితంగా ఎనిమిది వారాల గ్యాప్ ఉండాలనే నిబంధన మీద దక్షిణాది ఇండస్ట్రీ పెద్దలు చాలా సీరియస్…
అధికారంలోకి రావడానికి ముందు వరకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చాలా ఫెరోషియస్గా కనిపించేవారు. అవినీతి కేసుల వ్యవహారం పక్కన పెడితే…
‘బాహుబలి’ సినిమాకు బాలీవుడ్ నుంచి అప్పట్లో ఎంత గొప్ప సహకారం అందిందో తెలిసిందే. కరణ్ జోహార్ లాంటి అగ్ర నిర్మాత ఆ…
మోనాలిసా.. గత ఏడాది సోషల్ మీడియాను ఒక ఊపు ఊపేసిన పేరిది. ఉత్తర్ప్రదేశ్లో జరిగిన మహా కుంభమేళాతో వెలుగులోకి వచ్చిన…
తెలంగాణ ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్, మాజీ మంత్రి పార్టీ కీలక…