టాలీవుడ్ బెస్ట్ కమెడియన్స్ పేర్లు రాసుకుంటూ పోతే వాటిలో ఖచ్చితంగా వచ్చే పేరు ఎంఎస్ నారాయణ. కాలం చేసి స్వర్గానికి వెళ్లిపోయారు కానీ నిత్యం మనం చూసే పాత సినిమాల్లో ఇంకా బ్రతికే ఉన్నట్టు అనిపిస్తారు. ముఖ్యంగా తాగుబోతు పాత్రలకు వేరే ఎవరినీ ఊహించలేనంత గొప్పగా పండించేవారు.
అయితే ఇలాంటి మహా నటుల చివరి క్షణాలు ఎలా గడిచాయనేది సాటి కుటుంబ సభ్యులు, స్నేహితులు చెబితే కానీ బయటికి రావు. బ్రహ్మానందం అలాంటిది ఒకటి తాజాగా పంచుకున్నారు. ఈ రోజు విడుదలైన బ్రహ్మ ఆనందం ప్రమోషన్లలో భాగంగా ఇచ్చిన ఇంటర్వ్యూలలో గతాన్ని గుర్తు చేసుకున్నారు.
తీవ్ర అనారోగ్యంతో ఎంఎస్ నారాయణ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నప్పుడు గోపీచంద్ సినిమా షూటింగ్ లో ఉన్న బ్రహ్మానందం గారికి ఫోన్ వచ్చింది. నాన్న మిమ్మల్ని చూడాలని కోరుకుంటున్నట్టుగా పేపర్ మీద రాసిచ్చారని ఆయన కూతురు చెప్పింది. వెంటనే ఎవరికి చెప్పకుండా బ్రహ్మానందం హుటాహుటిన హాస్పిటల్ కు వెళ్లిపోయారు.
మంచం దగ్గరికి చేరగానే ఎంఎస్ ఆత్మీయంగా బ్రహ్మి చేయి గట్టిగా నొక్కి పట్టుకున్నారు. మాట్లాడలేకపోయినా మనసులో భావాన్ని అర్థం చేసుకున్నారు. డబ్బు ఎంత ఖర్చయినా నయం చేయమని డాక్టర్లకు చెప్పి షూట్ కి బయలుదేరారు. మధ్య దారిలో ఎంఎస్ పోయారనే వార్తలు వచ్చాయి.
నిజానికి అప్పుడాయన ఉన్నారో పోయారో నిర్ధారణ చేసుకోకుండానే యూట్యూబ్ ఛానల్స్ థంబ్ నైల్స్ పెట్టేయడం ఎందరో అభిమానులకు గుండె కోతని మిగిల్చింది. బ్రహ్మానందం తపన అటుపై ఎంఎస్ ని బ్రతికించలేకపోయినా చివరి క్షణంలో చేయి పట్టుకోవడం మాత్రం జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేనని అంటున్నారు.
ఇద్దరు కలిసి ఎన్నో బ్లాక్ బస్టర్లలో భాగం పంచుకోవడం ఫ్యాన్స్ గుర్తు చేసుకుంటూనే ఉంటారు. స్టార్ హీరోలు పిలిచి మరీ ఎంఎస్ ని తమతో పాటు నటింపజేసుకున్న సందర్భాలు ఎన్నో. లెజెండరీ హాస్యనటుడిగా చిరస్థానం సంపాదించుకున్న ఎంఎస్ తెలుగు సినిమాల్లో ఎప్పటికీ సజీవులే.
This post was last modified on February 14, 2025 2:52 pm
నేచురల్ స్టార్ నాని తన కెరీర్లోనే అతి పెద్ద పరీక్షకు సిద్ధమవుతున్నాడు. వచ్చే గురువారం తన కొత్త చిత్రం ‘ది…
థియేటర్లకు వచ్చే జనం తగ్గిపోతున్నారు అని.. సింగిల్ స్క్రీన్లు మూతపడిపోతున్నాయని తీవ్ర ఆందోళన వ్యక్తమవుతున్న దశలో గత మూడు నెలలుగా…
వచ్చే సంక్రాంతికి విశ్వంభర రిలీజవుతుందని, కాకా వేసవికి వెళ్లిపోవచ్చనే ప్రచారం గత వారం రోజులుగా చాలా బలంగా తిరుగుతోంది. తుది…
మొదటి వారం పూర్తి కాక ముందే సర్దార్ 2 ఎంత పెద్ద డిజాస్టరో జనాలకు అర్థమైపోయింది. యునానిమస్ గా ఫ్లాప్…
మెగాస్టార్ చిరంజీవి, దర్శకుడు బాబీ కొల్లి కలయికలో రూపొందుతున్న కాకాలో ఒక కీలక పాత్రకు సంబంధించిన ఆర్టిస్ట్ సెలక్షన్ పెండింగ్…
ఉత్సాహంగా పండుగ చేసుకుంటున్న సమయంలో ఒకే గ్రామానికి చెందిన ఆరుగురు విద్యార్థులు మరణించడంతో తెలంగాణాలో విషాదం నెలకొంది. మృతి చెందిన…