టాలీవుడ్ బెస్ట్ కమెడియన్స్ పేర్లు రాసుకుంటూ పోతే వాటిలో ఖచ్చితంగా వచ్చే పేరు ఎంఎస్ నారాయణ. కాలం చేసి స్వర్గానికి వెళ్లిపోయారు కానీ నిత్యం మనం చూసే పాత సినిమాల్లో ఇంకా బ్రతికే ఉన్నట్టు అనిపిస్తారు. ముఖ్యంగా తాగుబోతు పాత్రలకు వేరే ఎవరినీ ఊహించలేనంత గొప్పగా పండించేవారు.
అయితే ఇలాంటి మహా నటుల చివరి క్షణాలు ఎలా గడిచాయనేది సాటి కుటుంబ సభ్యులు, స్నేహితులు చెబితే కానీ బయటికి రావు. బ్రహ్మానందం అలాంటిది ఒకటి తాజాగా పంచుకున్నారు. ఈ రోజు విడుదలైన బ్రహ్మ ఆనందం ప్రమోషన్లలో భాగంగా ఇచ్చిన ఇంటర్వ్యూలలో గతాన్ని గుర్తు చేసుకున్నారు.
తీవ్ర అనారోగ్యంతో ఎంఎస్ నారాయణ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నప్పుడు గోపీచంద్ సినిమా షూటింగ్ లో ఉన్న బ్రహ్మానందం గారికి ఫోన్ వచ్చింది. నాన్న మిమ్మల్ని చూడాలని కోరుకుంటున్నట్టుగా పేపర్ మీద రాసిచ్చారని ఆయన కూతురు చెప్పింది. వెంటనే ఎవరికి చెప్పకుండా బ్రహ్మానందం హుటాహుటిన హాస్పిటల్ కు వెళ్లిపోయారు.
మంచం దగ్గరికి చేరగానే ఎంఎస్ ఆత్మీయంగా బ్రహ్మి చేయి గట్టిగా నొక్కి పట్టుకున్నారు. మాట్లాడలేకపోయినా మనసులో భావాన్ని అర్థం చేసుకున్నారు. డబ్బు ఎంత ఖర్చయినా నయం చేయమని డాక్టర్లకు చెప్పి షూట్ కి బయలుదేరారు. మధ్య దారిలో ఎంఎస్ పోయారనే వార్తలు వచ్చాయి.
నిజానికి అప్పుడాయన ఉన్నారో పోయారో నిర్ధారణ చేసుకోకుండానే యూట్యూబ్ ఛానల్స్ థంబ్ నైల్స్ పెట్టేయడం ఎందరో అభిమానులకు గుండె కోతని మిగిల్చింది. బ్రహ్మానందం తపన అటుపై ఎంఎస్ ని బ్రతికించలేకపోయినా చివరి క్షణంలో చేయి పట్టుకోవడం మాత్రం జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేనని అంటున్నారు.
ఇద్దరు కలిసి ఎన్నో బ్లాక్ బస్టర్లలో భాగం పంచుకోవడం ఫ్యాన్స్ గుర్తు చేసుకుంటూనే ఉంటారు. స్టార్ హీరోలు పిలిచి మరీ ఎంఎస్ ని తమతో పాటు నటింపజేసుకున్న సందర్భాలు ఎన్నో. లెజెండరీ హాస్యనటుడిగా చిరస్థానం సంపాదించుకున్న ఎంఎస్ తెలుగు సినిమాల్లో ఎప్పటికీ సజీవులే.
This post was last modified on February 14, 2025 2:52 pm
అమెరికాను నెంబర్ వన్ చేయాలన్న పేరుతో ఇష్టారాజ్యంగా నిర్ణయాలు తీసుకుంటూ.. ప్రపంచాన్ని ఆగమాగం చేసిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇమేజ్…
‘అమరావతి’ని ఆంధ్రప్రదేశ్ శాశ్వత రాజధానిగా నిర్ణయిస్తూ ఏపీ అసెంబ్లీ పెట్టిన తీర్మానం మీద ఇటీవలే ఒక టీవీ ఛానెల్లో చర్చా…
కంటెంట్ మీద ఎంత నమ్మకం ఉన్నా ప్రీమియర్ల విషయంలో నిర్మాతలు ఒకటికి పదిసార్లు ఆలోచించే పరిస్థితులు ఇప్పుడున్నాయి. కొన్నిసార్లు ఈ…
జివి ప్రకాష్ కుమార్ మనకూ బాగా సుపరిచితుడైన సంగీత దర్శకుడు. తమిళంలో అయితే రెగ్యులర్ గా హీరోగా కూడా నటిస్తూ…
ఆంధ్రప్రదేశ్ రాజధాని అంశంపై వైసీపీ అధినేత వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ‘ప్లాన్-బీ’గా మచిలీపట్నం–విజయవాడ–గుంటూరు ప్రాంతాన్ని…
టాలీవుడ్ టాప్ స్టార్లందరూ తమ సినిమా రిలీజ్ ముంగిట డ్రగ్ టెస్టులు చేసుకోవాలని.. అప్పుడే ఆ సినిమాలు రిలీజ్ అయ్యేలా…