సినిమా థియేటర్లు తెరుచుకోవచ్చునని ప్రభుత్వం ప్రకటించినప్పటికీ నిర్మాతలెవరూ ముందుకు రావడం లేదు. సగం కెపాసిటీతో రన్ అయ్యే థియేటర్లలో ఎంత వసూలవుతాయి? పంపిణీదారుల నుంచి ఎన్ని డబ్బులొస్తాయి? అనేది తేలక నిర్మాతలు తగిన సమయం కోసం వేచి చూస్తున్నారు. అందుకే పూర్తయిన సినిమాలను కూడా సెన్సార్కి పంపించకుండా అట్టే పెట్టుకున్నారు.
ఈ నేపథ్యంలో సాయి ధరమ్ తేజ్ హీరోగా నటించిన ‘సోలో బ్రతుకే సో బెటర్’ సినిమా సెన్సార్ పూర్తి చేసుకుని రిలీజ్కి సిద్ధమవుతోంది. ఇంకా డేట్ ప్రకటించలేదు కానీ థియేటర్లలో విడుదలకి అయితే సిద్ధపడుతున్నారు. మిగతా నిర్మాతలకు, హీరోలకూ లేని ధైర్యం సాయి ధరమ్ తేజ్కి ఏమిటి అనుకోవచ్చు? అయితే ఇక్కడో లాజిక్కుంది. ఈ చిత్రం థియేట్రికల్ ప్లస్ నాన్ థియేట్రికల్ హక్కులను జీ సంస్థ గుత్తంగా తీసేసుకుంది. ఓటిటి రిలీజ్ కోసమనే తీసుకున్నారు కానీ థియేట్రికల్గా కూడా రెవెన్యూ వస్తే వదులుకోవడం దేనికని ఈ రిస్కు తీసుకుంటోంది.
చాలా కాలం తర్వాత కొత్త సినిమా థియేటర్లలో విడుదలయితే వచ్చే ప్రేక్షకులుంటారనేది వారి అంచనా. ఒకవేళ ఈ రిస్కు పే చేయకపోయినా కానీ వారికి పెద్దగా నష్టమేమీ వుండదు… ఎలాగో ఓటిటి రిలీజ్ కోసం సిద్ధపడి వున్నారు కనుక. అయితే ఈ సినిమా రిలీజ్ అయితే మిగతా నిర్మాతలకు పరిస్థితిని సమీక్షించుకునే వీలు చిక్కుతుంది. మరి ఈ సోలో బ్రతుకు ఎంత బెటర్ అనేది థియేటర్లలో షో పడ్డాకే తెలుస్తుంది.
This post was last modified on October 21, 2020 10:51 pm
అఖండ 2 తాండవం వచ్చి తొమ్మిది నెలలు అయిపోయాయి. సీక్వెల్ అందులోనూ బ్లాక్ బస్టర్ కొనసాగింపు కాబట్టి బాలయ్య మరోసారి…
తాను ప్రాతినిధ్యం వహిస్తున్న ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని పిఠాపురం నియోజకవర్గంతో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రత్యేక అనుబంధాన్ని…
ఒకప్పుడు సత్యం, గోదావరి, గౌరీ లాంటి హిట్లతో మంచి మార్కెట్ సంపాదించుకున్న హీరో సుమంత్ తర్వాత వరస ఫ్లాపుల దెబ్బకు…
స్థానిక ఎన్నికల్లో కూటమి పార్టీల మధ్య చిరాకులు, పరాకులకు అవకాశం ఉంటుందని.. తమకు అది మేలు చేస్తుందని భావిస్తున్న వైసీపీకి…
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకునే నిర్ణయాలు విస్మయానికి గురి చేస్తున్నాయి. నిన్న మొన్నటి వరకు ఇరాన్పై ఒంటికాలిపై లేచిన…
డీఎస్సీ నియమకాల్లో అక్రమాలు జరిగాయని ఆరోపణలు చేస్తున్న మాజీ ముఖ్యమంత్రి జగన్ కు విద్యా శాఖ మంత్రి నారా లోకేష్…