సినిమా థియేటర్లు తెరుచుకోవచ్చునని ప్రభుత్వం ప్రకటించినప్పటికీ నిర్మాతలెవరూ ముందుకు రావడం లేదు. సగం కెపాసిటీతో రన్ అయ్యే థియేటర్లలో ఎంత వసూలవుతాయి? పంపిణీదారుల నుంచి ఎన్ని డబ్బులొస్తాయి? అనేది తేలక నిర్మాతలు తగిన సమయం కోసం వేచి చూస్తున్నారు. అందుకే పూర్తయిన సినిమాలను కూడా సెన్సార్కి పంపించకుండా అట్టే పెట్టుకున్నారు.
ఈ నేపథ్యంలో సాయి ధరమ్ తేజ్ హీరోగా నటించిన ‘సోలో బ్రతుకే సో బెటర్’ సినిమా సెన్సార్ పూర్తి చేసుకుని రిలీజ్కి సిద్ధమవుతోంది. ఇంకా డేట్ ప్రకటించలేదు కానీ థియేటర్లలో విడుదలకి అయితే సిద్ధపడుతున్నారు. మిగతా నిర్మాతలకు, హీరోలకూ లేని ధైర్యం సాయి ధరమ్ తేజ్కి ఏమిటి అనుకోవచ్చు? అయితే ఇక్కడో లాజిక్కుంది. ఈ చిత్రం థియేట్రికల్ ప్లస్ నాన్ థియేట్రికల్ హక్కులను జీ సంస్థ గుత్తంగా తీసేసుకుంది. ఓటిటి రిలీజ్ కోసమనే తీసుకున్నారు కానీ థియేట్రికల్గా కూడా రెవెన్యూ వస్తే వదులుకోవడం దేనికని ఈ రిస్కు తీసుకుంటోంది.
చాలా కాలం తర్వాత కొత్త సినిమా థియేటర్లలో విడుదలయితే వచ్చే ప్రేక్షకులుంటారనేది వారి అంచనా. ఒకవేళ ఈ రిస్కు పే చేయకపోయినా కానీ వారికి పెద్దగా నష్టమేమీ వుండదు… ఎలాగో ఓటిటి రిలీజ్ కోసం సిద్ధపడి వున్నారు కనుక. అయితే ఈ సినిమా రిలీజ్ అయితే మిగతా నిర్మాతలకు పరిస్థితిని సమీక్షించుకునే వీలు చిక్కుతుంది. మరి ఈ సోలో బ్రతుకు ఎంత బెటర్ అనేది థియేటర్లలో షో పడ్డాకే తెలుస్తుంది.
This post was last modified on October 21, 2020 10:51 pm
శుక్రవారం ఏదైనా థియేటర్ రిలీజ్ మిస్ అయితే మూవీ లవర్స్ బాధ పడకుండా ఓటిటిలు ఆ లోటు తీరుస్తున్నాయి. ఇంకా…
తెలంగాణకు చెందిన ప్రముఖ రాజకీయ నాయకుడు, సీపీఐ మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య జీవిత చరిత్ర సినిమాగా రాబోతున్న సంగతి…
బయట తన హీరోలతోనే కాక తన టీంలో అందరితో చాలా సరదాగా ఉంటూ.. క్లోజ్ రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తుంటాడు రాజమౌళి.…
కన్నడ కి అతి దగ్గర గా ఉండే లిపి తెలుగే. బళ్లారి ఆంధ్ర సరిహద్దు పట్టణం తెలుగు కూడా మాట్లాడుతారు.…
వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…