సినిమా థియేటర్లు తెరుచుకోవచ్చునని ప్రభుత్వం ప్రకటించినప్పటికీ నిర్మాతలెవరూ ముందుకు రావడం లేదు. సగం కెపాసిటీతో రన్ అయ్యే థియేటర్లలో ఎంత వసూలవుతాయి? పంపిణీదారుల నుంచి ఎన్ని డబ్బులొస్తాయి? అనేది తేలక నిర్మాతలు తగిన సమయం కోసం వేచి చూస్తున్నారు. అందుకే పూర్తయిన సినిమాలను కూడా సెన్సార్కి పంపించకుండా అట్టే పెట్టుకున్నారు.
ఈ నేపథ్యంలో సాయి ధరమ్ తేజ్ హీరోగా నటించిన ‘సోలో బ్రతుకే సో బెటర్’ సినిమా సెన్సార్ పూర్తి చేసుకుని రిలీజ్కి సిద్ధమవుతోంది. ఇంకా డేట్ ప్రకటించలేదు కానీ థియేటర్లలో విడుదలకి అయితే సిద్ధపడుతున్నారు. మిగతా నిర్మాతలకు, హీరోలకూ లేని ధైర్యం సాయి ధరమ్ తేజ్కి ఏమిటి అనుకోవచ్చు? అయితే ఇక్కడో లాజిక్కుంది. ఈ చిత్రం థియేట్రికల్ ప్లస్ నాన్ థియేట్రికల్ హక్కులను జీ సంస్థ గుత్తంగా తీసేసుకుంది. ఓటిటి రిలీజ్ కోసమనే తీసుకున్నారు కానీ థియేట్రికల్గా కూడా రెవెన్యూ వస్తే వదులుకోవడం దేనికని ఈ రిస్కు తీసుకుంటోంది.
చాలా కాలం తర్వాత కొత్త సినిమా థియేటర్లలో విడుదలయితే వచ్చే ప్రేక్షకులుంటారనేది వారి అంచనా. ఒకవేళ ఈ రిస్కు పే చేయకపోయినా కానీ వారికి పెద్దగా నష్టమేమీ వుండదు… ఎలాగో ఓటిటి రిలీజ్ కోసం సిద్ధపడి వున్నారు కనుక. అయితే ఈ సినిమా రిలీజ్ అయితే మిగతా నిర్మాతలకు పరిస్థితిని సమీక్షించుకునే వీలు చిక్కుతుంది. మరి ఈ సోలో బ్రతుకు ఎంత బెటర్ అనేది థియేటర్లలో షో పడ్డాకే తెలుస్తుంది.
This post was last modified on October 21, 2020 10:51 pm
అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న కేరళలో పలు రాష్ట్రాలకు చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్లు, ఫైర్ బ్రాండ్లు, మంచి గళం వినిపించే…
అటు తమిళం, ఇటు తెలుగు ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకున్న భారీ చిత్రాల్లో ‘యుగానికి ఒక్కడు’ ఒకటి. కార్తికి స్టార్ ఇమేజ్ తీసుకొచ్చిన…
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి మూడు అనే అంకె అంటే చాలా ఇష్టంగానే ఉన్నట్టుంది. కనీసం రాజధాని కూడా…
ప్రస్తుతం ఎవరు ఔనన్నా.. కాదన్నా.. దేశానికే కాదు.. దేశంలోని రాజకీయాలకు కూడా ప్రధాని మోడీ పెద్దదిక్కుగా మారారన్నది వాస్తవం. ఆయనను…
ఒక పెద్ద సినిమాలో రాముడి పాత్రను పోషించడం ఏ నటుడికైనా అరుదైన అవకాశమే. దాన్ని లైఫ్ టైం ఛాన్స్లాగే ఫీలవుతారు ఎవ్వరైనా. ‘ఆదిపురుష్’ ఫలితం…
వైసీపీ అధినేత, తన బ్రదర్ జగన్పై ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిల మరోసారి విమర్శలు గుప్పించారు. దళిత క్రైస్తవులకు రిజర్వేషన్…