సినిమా థియేటర్లు తెరుచుకోవచ్చునని ప్రభుత్వం ప్రకటించినప్పటికీ నిర్మాతలెవరూ ముందుకు రావడం లేదు. సగం కెపాసిటీతో రన్ అయ్యే థియేటర్లలో ఎంత వసూలవుతాయి? పంపిణీదారుల నుంచి ఎన్ని డబ్బులొస్తాయి? అనేది తేలక నిర్మాతలు తగిన సమయం కోసం వేచి చూస్తున్నారు. అందుకే పూర్తయిన సినిమాలను కూడా సెన్సార్కి పంపించకుండా అట్టే పెట్టుకున్నారు.
ఈ నేపథ్యంలో సాయి ధరమ్ తేజ్ హీరోగా నటించిన ‘సోలో బ్రతుకే సో బెటర్’ సినిమా సెన్సార్ పూర్తి చేసుకుని రిలీజ్కి సిద్ధమవుతోంది. ఇంకా డేట్ ప్రకటించలేదు కానీ థియేటర్లలో విడుదలకి అయితే సిద్ధపడుతున్నారు. మిగతా నిర్మాతలకు, హీరోలకూ లేని ధైర్యం సాయి ధరమ్ తేజ్కి ఏమిటి అనుకోవచ్చు? అయితే ఇక్కడో లాజిక్కుంది. ఈ చిత్రం థియేట్రికల్ ప్లస్ నాన్ థియేట్రికల్ హక్కులను జీ సంస్థ గుత్తంగా తీసేసుకుంది. ఓటిటి రిలీజ్ కోసమనే తీసుకున్నారు కానీ థియేట్రికల్గా కూడా రెవెన్యూ వస్తే వదులుకోవడం దేనికని ఈ రిస్కు తీసుకుంటోంది.
చాలా కాలం తర్వాత కొత్త సినిమా థియేటర్లలో విడుదలయితే వచ్చే ప్రేక్షకులుంటారనేది వారి అంచనా. ఒకవేళ ఈ రిస్కు పే చేయకపోయినా కానీ వారికి పెద్దగా నష్టమేమీ వుండదు… ఎలాగో ఓటిటి రిలీజ్ కోసం సిద్ధపడి వున్నారు కనుక. అయితే ఈ సినిమా రిలీజ్ అయితే మిగతా నిర్మాతలకు పరిస్థితిని సమీక్షించుకునే వీలు చిక్కుతుంది. మరి ఈ సోలో బ్రతుకు ఎంత బెటర్ అనేది థియేటర్లలో షో పడ్డాకే తెలుస్తుంది.
This post was last modified on October 21, 2020 10:51 pm
మొన్న ఏడాది వచ్చిన వరుణ్ తేజ్ 'మట్కా'ని సామాన్య ప్రేక్షకులు మర్చిపోయి ఉండొచ్చు కానీ అభిమానులకు మాత్రం పీడకలలా నిలిచిపోయింది.…
నిన్న కీలకమైన వీకెండ్ పూర్తయ్యింది. శుక్రవారం విడుదలైన తిమ్మరాజుపల్లి టీవీ, పాపం ప్రతాప్ ఆశలన్నీ సండే మీద పెట్టుకుని ప్రమోషన్లు…
సమ్మర్ సీజన్ లో ఏప్రిల్ చివరి వారం సినిమాలకు చాలా మంచి టైం. వేసవి పీక్స్ లో ఉండటంతో పాటు…
గంధపు చెక్కల స్మగ్లర్గా.. దేశవ్యాప్తంగా ఒకప్పుడు సంచలనం రేపిన వీరప్పన్ గురించి అందరికీ తెలిసిందే. కర్ణాటక నుంచి తమిళనాడు వరకు…
ఎన్నికల రాజకీయాల్లో ఆరితేరిన ప్రధాని నరేంద్ర మోడీ.. సమయం.. సందర్భంతోపాటు సెంటిమెంటుకు కూడా ప్రాధాన్యం ఇస్తారు. సాధారణ ప్రజలకు అత్యంతచేరువ…
రెండేళ్ల క్రితం జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఏపీలో టీడీపీ నేతృత్వంలోని కూటమి సూపర్ 6 పేరిట ఇచ్చిన హామీలు బాగా…