బ్లాక్ బస్టర్ చూసి సంవత్సరాలు గడిచిపోతున్నా ఒక హీరో మార్కెట్, బడ్జెట్ తగ్గడానికి బదులు పెరుగుతోందంటే అతని స్టార్ ఇమేజ్ చాలా పైనున్నట్టు అర్థం. విజయ్ దేవరకొండ ప్రస్తుతం ఇదే స్టేజిలో ఉన్నాడు. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో సితార ఎంటర్ టైన్మెంట్స్ నిర్మిస్తున్న ప్యాన్ ఇండియా మూవీకి ‘కింగ్ డం’ టైటిల్ ఖరారు చేస్తూ ఇవాళ రెండు నిమిషాల టీజర్ రిలీజ్ చేశారు.
తెలుగులో జూనియర్ ఎన్టీఆర్, తమిళంలో సూర్య, హిందీలో రన్బీర్ కపూర్ వాయిస్ ఓవర్ అందించగా అనిరుధ్ రవిచందర్ సమకూర్చిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మీద ఫ్యాన్స్ ఓ రేంజ్ అంచనాలు పెట్టుకున్నారు.
ఎక్కడో నాగరిక ప్రపంచానికి దూరంగా ఒక సముద్ర తీర ప్రాంతం. నిత్యం రక్తం ఏరులై ప్రవహిస్తుంది. వందలాది శవాలు ఎవరివో గుర్తు పట్టేలోగానే మరికొన్ని వాటికి తోడవుతూ ఉంటాయి. భూమిలో పాతి పెట్టిన మృతదేహాలకు లెక్క లేదు. ఒకపక్క తుపాకులు పట్టిన మాఫియా శక్తులు, ఇంకో వైపు ఆర్మీ దుస్తుల్లో ఉన్న రాక్షసులు.
వీళ్ళ మధ్య క్షణమొక యుగంగా బ్రతుకుతున్న సమూహం ఒక నాయకుడి కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. అప్పుడు వస్తాడు అతను (విజయ్ దేవరకొండ). బుల్లెట్లకు భయపడకుండా, పోలీసులకు నెరవకుండా మొత్తం తగలబెట్టేందుకు సిద్ధపడతాడు. అతనికీ సామ్రాజ్యం ఎలా హస్తగతమయ్యిందనేది చూడాలి.
ఇప్పటిదాకా సున్నితమైన కథలనే తెరకెక్కించిన గౌతమ్ తిన్ననూరి ఇంత వయొలెంట్ బ్యాక్ డ్రాప్ ని చూపిస్తాడని ఊహించని విధంగా కింగ్ డం సెటప్ చాలా పవర్ ఫుల్ గా ఉంది. శ్రీలంకలో శరణార్ధుల నేపధ్యాన్ని తీసుకున్న గౌతమ్ చాలా ఇంటెన్స్ తో యాక్షన్ ఎపిసోడ్స్ కి తీర్చిదిద్దినట్టు కనిపిస్తోంది.
అనిరుద్ బిజిఎంకి తోడు, సహజంగా అనిపిస్తున్న బ్యాక్ డ్రాప్ అంచనాలు పెంచేలా ఉన్నాయి. కురచ జుత్తుతో విజయ్ దేవరకొండ లుక్స్, నటన చాలా డెప్త్ గా కనిపిస్తున్నాయి. వేరే క్యాస్టింగ్ రివీల్ చేయలేదు. తారక్ స్వరం కంటెంట్ ని ఎలివేట్ చేసింది. మే 30 ప్రపంచవ్యాప్తంగా కింగ్ డం ప్యాన్ ఇండియా భాషల్లో విడుదల కానుంది.
This post was last modified on February 12, 2025 4:31 pm
తెలంగాణలోని సింగిల్ థియేటర్లలో అద్దె విధానానికి స్వస్తి పలికి పర్సంటేజీ పద్ధతిని తీసుకురావాలని ఇక్కడి ఎగ్జిబిటర్లు ఎప్పట్నుంచో డిమాండ్ చేస్తూ…
తినుబండారాలు అంటే చాలా మందికి అర్థం కాదేమో. ఎందుకంటే మనోళ్లంతా ఇప్పుడు ఆ తినుబండారాలకు స్నాక్స్ అని పేరు పెట్టుకున్నారు…
తాజాగా జరిగిన తెలంగాణ ఎగ్జిబిటర్ల సమావేశంలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానం అమలు చేయడం గురించి పెద్ద చర్చే జరిగింది.…
అప్డేట్స్ కంటే పుకార్లతో ఎక్కువ కాలక్షేపం చేస్తున్న సినిమా విశ్వంభర. చిరంజీవి అంతటి మెగాస్టార్ తో తీసిన ఈ ప్యాన్…
తెలంగాణలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానాన్ని అమలు చేయాలనే డిమాండ్ క్రమంగా తీవ్ర రూపం దాలుస్తోంది. ఇవాళ హైదరాబాద్ లో…
నీట్ యూజీ పేపర్ లీక్ వ్యవహారం దేశవ్యాప్తంగా సంచలనం రేపిన సంగతి తెలిసిందే. దేశవ్యాప్తంగా 22 మంది లక్షల విద్యార్థుల…