Movie News

హై బీపీతో ఆసుపత్రిలో చేరిన పృథ్వీ

సినిమా వేడుకలో రాజకీయ వ్యాఖ్యలు చేసి కలకలం రేపి పెను వివాదానికి తెర తీసిన ౩౦ ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వీరాజ్ తాజాగా ఆసుపత్రిలో చేరాడు. టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్సేన్ నటించిన తాజా చిత్రం లైలా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఇటీవలే జరగగా.. ఆ వేడుకకు మెగాస్టార్ చిరంజీవితో పాటు పలువురు సినీ ప్రముఖులు హాజరయ్యారు. వీరిలో పృథ్వీరాజ్ కూడా ఉన్నారు. ఈ సినిమాలో ఓ పాత్రలో కనిపించిన పృథ్వీ వేడుకలో మాట్లాడుతూ వైసీపీ పేరు ఊటంకించకుండానే… ఆ పార్టీపై సెటైర్లు వేశారు.

పృథ్వీ వ్యాఖ్యలపై వైసీపీ శ్రేణులు భగ్గుమన్నాయి. వైసీపీని కించపరిచేలా వ్యాఖ్యలు చేసిన పృథ్వీ క్షమాపణలు చెప్పాల్సిందేనని వారు డిమాండ్ చేశారు. లేదంటే…లైలా సినిమాకు తమ సత్తా ఏమిటో చూపిస్తామని హెచ్చరికలు జారీ చేశారు. అనుకున్నట్టుగానే… బొయికాట్ లైలా అంటూ హాష్ టాగ్ లతో సోషల్ మీడియాలో వైసీపీ అక్టీవిస్టులు తెగ హల్చల్ చేస్తున్నారు. దీంతో సమస్యను చల్లబరిచే క్రమంలో విశ్వక్సేన్ బహిరంగంగా సారీ చెప్పారు. సినిమా నిర్మాత కూడా సారీ చెప్పారు.

అయినా… వైసీపీ శ్రేణులు శాంతించలేదు. తమ మనోభావాలను దెబ్బ తీసిన పృథ్వీ నేరుగా వచ్చి క్షమాపణ చెప్పాలని వారు డిమాండ్ చేస్తున్నారు. అంతేకాకుండా.. పృథ్విపై సోషల్ మీడియాలో నెగటివ్ ప్రచారాన్ని మొదలు పెట్టారు. ఈ ప్రచారం అంతకంతకు పెరిగి పోతోంది. దేనిని చూసిన పృథ్వీ కి బీపీ పెరిగిపోయింది. ఉన్నట్టుండి ఆ పెరిగిన బీపీ మరింతగా పెరుగుతూ హై బీపీ గా మారిపోయింది. దీంతో పృథ్వీ హుటాహుటీన హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేరి చికిత్స తీసుకుంటున్నారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి నిలకడగానే ఉన్నట్టు వైద్యులు చెబుతున్నారు.

Satya

Recent Posts

ఈసారి పాదయాత్ర ఈజీ కాదేమో జగన్

ఇప్ప‌టి వ‌ర‌కు ఒక లెక్క‌.. ఇక నుంచి మరో లెక్క‌.. అన్న‌ట్టుగా వైసీపీ అధినేత‌, మాజీ సీఎం జ‌గ‌న్ ప‌రిస్థితి…

43 minutes ago

పట్టు వదలకుండా పరిగెత్తాలి పెద్ది

పెద్ది మొదటి వారం పూర్తి చేసుకుని సెకండ్ వీక్ లో అడుగు పెట్టింది. మూడు వందల యాభై కోట్ల వైపు…

1 hour ago

పవన్ పేరు ఎందుకు మారింది?

ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తన పేరు వెనుక ఉన్న ఆసక్తికరమైన కథను వెల్లడించారు. జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో…

7 hours ago

కేంద్ర మంత్రుల ‘కార్ పూలింగ్’ షురూ!

పశ్చిమాసియాలో యుద్ధ వాతావరణం నేపథ్యంలో ఇందన పొదుపు దిశగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కీలక సూచనలు చేశాక… మన…

7 hours ago

ఏపీ పాఠ‌శాల‌ల్లో చాగంటి పాఠ్యాంశాలు..!

ఏపీ ప్ర‌భుత్వ పాఠ‌శాల‌ల్లో ప్ర‌ముఖ ప్ర‌వ‌చ క‌ర్త చాగంటి కోటేశ్వ‌ర‌రావు ప్ర‌సంగాల‌ను పాఠ్యాంశాలుగా ప్ర‌వేశ పెడుతున్నట్టు ప్ర‌క‌టించింది. దీనికి సంబంధించి…

8 hours ago

ఆమెకు జీతం రూ.1.4 లక్షలు… భరణం రూ.1.35

ఒక విడాకుల కేసుకు సంబంధించి కోర్టు ఇచ్చిన తీర్పుపై ఇప్పుడు పెద్ద ఎత్తున డిబేట్ జరుగుతోంది. సోషల్ మీడియాలో దీనిపై…

9 hours ago