సినిమా వేడుకలో రాజకీయ వ్యాఖ్యలు చేసి కలకలం రేపి పెను వివాదానికి తెర తీసిన ౩౦ ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వీరాజ్ తాజాగా ఆసుపత్రిలో చేరాడు. టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్సేన్ నటించిన తాజా చిత్రం లైలా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఇటీవలే జరగగా.. ఆ వేడుకకు మెగాస్టార్ చిరంజీవితో పాటు పలువురు సినీ ప్రముఖులు హాజరయ్యారు. వీరిలో పృథ్వీరాజ్ కూడా ఉన్నారు. ఈ సినిమాలో ఓ పాత్రలో కనిపించిన పృథ్వీ వేడుకలో మాట్లాడుతూ వైసీపీ పేరు ఊటంకించకుండానే… ఆ పార్టీపై సెటైర్లు వేశారు.
పృథ్వీ వ్యాఖ్యలపై వైసీపీ శ్రేణులు భగ్గుమన్నాయి. వైసీపీని కించపరిచేలా వ్యాఖ్యలు చేసిన పృథ్వీ క్షమాపణలు చెప్పాల్సిందేనని వారు డిమాండ్ చేశారు. లేదంటే…లైలా సినిమాకు తమ సత్తా ఏమిటో చూపిస్తామని హెచ్చరికలు జారీ చేశారు. అనుకున్నట్టుగానే… బొయికాట్ లైలా అంటూ హాష్ టాగ్ లతో సోషల్ మీడియాలో వైసీపీ అక్టీవిస్టులు తెగ హల్చల్ చేస్తున్నారు. దీంతో సమస్యను చల్లబరిచే క్రమంలో విశ్వక్సేన్ బహిరంగంగా సారీ చెప్పారు. సినిమా నిర్మాత కూడా సారీ చెప్పారు.
అయినా… వైసీపీ శ్రేణులు శాంతించలేదు. తమ మనోభావాలను దెబ్బ తీసిన పృథ్వీ నేరుగా వచ్చి క్షమాపణ చెప్పాలని వారు డిమాండ్ చేస్తున్నారు. అంతేకాకుండా.. పృథ్విపై సోషల్ మీడియాలో నెగటివ్ ప్రచారాన్ని మొదలు పెట్టారు. ఈ ప్రచారం అంతకంతకు పెరిగి పోతోంది. దేనిని చూసిన పృథ్వీ కి బీపీ పెరిగిపోయింది. ఉన్నట్టుండి ఆ పెరిగిన బీపీ మరింతగా పెరుగుతూ హై బీపీ గా మారిపోయింది. దీంతో పృథ్వీ హుటాహుటీన హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేరి చికిత్స తీసుకుంటున్నారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి నిలకడగానే ఉన్నట్టు వైద్యులు చెబుతున్నారు.
This post was last modified on February 12, 2025 4:05 am
నటుడిగా విజయ్ దేవరకొండ.. దర్శకుడిగా సందీప్ రెడ్డి వంగ కెరీర్లను మార్చేసిన సినిమా.. అర్జున్ రెడ్డి. ట్రెండ్ సెట్టర్ అనే…
ఇప్పుడు ఇండస్ట్రీలో వెలుగొందుతున్న చాలామంది దర్శకులు కెరీర్ ఆరంభంలో బాగా ఇబ్బంది పడ్డ వాళ్లే. సినీ పరిశ్రమలోకి వచ్చి అసిస్టెంట్…
తమిళంలో పెద్ద స్టార్గా ఎదిగిన శివ కార్తికేయన్ లాగే టీవీ రంగం నుంచి ఇండస్ట్రీలోకి వచ్చిన అమ్మాయి ప్రియ భవానీ…
తెలుగులో తెర మీద హీరోలకు ఎలివేషన్లు ఇవ్వడంలో చాలామంది దర్శకులు తమ నైపుణ్యాన్ని చూపిస్తుంటారు కానీ.. వేదికల మీద ఎలివేషన్లు…
ఒకప్పుడు తమిళ ప్రేక్షకుల అభిరుచి గురించి ఇతర భాషల వాళ్లు గొప్పగా చెప్పుకునేవాళ్లు. కొత్త తరహా సినిమాలను, ప్రయోగాత్మక చిత్రాలను…
ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలకు ముహూర్తం రెడీ అవుతోంది. ప్రభుత్వం వైపు నుంచి ఈ ఎన్నికలకు గ్రీన్ సిగ్నల్ వచ్చేసింది.…