Movie News

మహేషే కాదు తారక్ కూడా అడవుల్లోకే

ఒక్క అప్డేట్ బయటికి తెలియకుండా గుట్టుచప్పుడు కాకుండా షూటింగ్ జరుపుకుంటున్న ఎస్ఎస్ఎంబి 29 అడవుల బ్యాక్ డ్రాప్ లో రూపొందుతున్న సంగతి తెలిసిందే. మహేష్ బాబుని ఇప్పటిదాకా చూడని టెర్రిఫిక్ పాత్రలో దర్శకుడు రాజమౌళి ప్రెజెంట్ చేయబోతున్నారనే టాక్ అంచనాలను ఎక్కడికో తీసుకెళ్తోంది. ప్రియాంకా చోప్రా ఒకటే కన్ఫర్మ్ గా తెలిసిన క్యాస్టింగ్ కాగా పృథ్వి రాజ్ సుకుమారన్, నానా పాటేకర్, జాన్ అబ్రహం తదితరుల పేర్లు గట్టిగానే చక్కర్లు కొడుతున్నాయి. అయితే జక్కన్న ఇప్పట్లో వీటికి సంబంధించి ఎలాంటి సమాచారం అధికారికంగా ఇచ్చేందుకు రెడీగా లేరు.

ఇదిలా ఉండగా జూనియర్ ఎన్టీఆర్ – ప్రశాంత్ నీల్ కలయికలో తెరకెక్కబోయే యాక్షన్ ఎంటర్ టైనర్ లోనూ అడవి నేపథ్యం ఉంటుందని సమాచారం. తొలుత ఆ సన్నివేశాలనే వికారాబాద్ పరిసరాల్లో తారక్ లేకుండా షూట్ చేయబోతున్నట్టు తెలిసింది. వార్ 2 బ్రేక్ తీసుకున్నాక తారక్ వచ్చి జాయిన్ కాబోతున్నాడు. ఇప్పటిదాకా నీల్ తన ఉగ్రం, కెజిఎఫ్, కెజిఎఫ్ 2 లో ఎక్కడ చెట్లు పుట్టలను చూపించలేదు. వేరే ప్రపంచాల్లోకి తీసుకెళ్లిపోయాడు. కానీ జూనియర్ మూవీ అలా ఉండదట. కమర్షియల్ జానరే అయినప్పటికీ హీరోయిజంని పీక్స్ లో చూపించే సరికొత్త బ్యాక్ డ్రాప్ ఎంచుకున్నట్టు సమాచారం.

దీనికి డ్రాగన్ టైటిల్ ముందు నుంచి ప్రచారంలో ఉంది. అయితే తమిళ హీరో ప్రదీప్ రంగనాథన్ ఇదే పేరుతో చేసిన సినిమా ఫిబ్రవరి 21 విడుదల కానుంది. టాలీవుడ్ డబ్బింగ్ వెర్షన్ కు రిటర్న్ అఫ్ ది డ్రాగన్ అని పెట్టడం గమనార్హం. ఎన్టీఆర్ నీల్ నిర్మిస్తున్న మైత్రి మూవీ మేకర్సే తెలుగులో ప్రదీప్ మూవీని తీసుకొస్తుండటం గమనార్హం. అంటే ఫలితం చూశాక డ్రాగన్ టైటిల్ పెట్టుకోవాలో వద్దో నిర్ణయిస్తారేమో. రుక్మిణి వసంత్ హీరోయిన్ గా నటిస్తున్న తారక్ నీల్ చిత్రంలో టోవినో థామస్ ఓ కీలక పాత్ర చేస్తున్నాడు. రవి బస్రూర్ సంగీతం సమకూరుస్తుండగా 2026 సంక్రాంతి విడుదలని లక్ష్యంగా పెట్టుకున్నారు.

This post was last modified on February 11, 2025 2:07 pm

Share

Recent Posts

స్పిరిట్ కంటే వారణాసి పెద్ద సినిమా: సందీప్ వంగా

సందీప్ రెడ్డి వంగా.. ఏదైనా మాట్లాడితే ఆ మాటను చుట్టూ తిప్పే రకం కాదు. రోమాంచకం ట్రైలర్ ఈవెంట్‌లో స్పిరిట్,…

59 minutes ago

బ్రేకింగ్… అమెరికా వీసా అపాయింట్‌మెంట్లు నిలిపివేత

అమెరికా వెళ్లాలనుకునే వారికి షాకింగ్ న్యూస్. ప్రపంచవ్యాప్తంగా ఉన్న అమెరికా ఎంబసీలు, కాన్సులేట్లలో వీసా అపాయింట్‌మెంట్లను తాత్కాలికంగా నిలిపివేసినట్లు తాజా…

1 hour ago

హైదరాబాద్ – విజయవాడ ఘోర బస్సు ప్రమాదం.. ఆరుగురు మృతి

సూర్యాపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కోదాడ మండలం ద్వారకుంట వద్ద ఆగి ఉన్న లారీని ప్రైవేట్ ట్రావెల్స్…

2 hours ago

కాంగ్రెస్ లో క్రమశిక్షణ తప్పదా?

మొత్తం మీద కాంగ్రెస్ అధిష్టానం స్పందించింది. కొండా సురేఖ కూతురు సుస్మిత మొదలుపెట్టిన వివాదానికి ఫుల్ స్థాప్ పెట్టడానికి రంగం…

8 hours ago

మీరు టికెట్ ఇవ్వడానికి ఎవరు ఉండరు జగన్

స్థానిక సంస్థల ఎన్నికలకు ముందే ఓటమిని అంగీకరిస్తున్నట్లుంది వైసీపీ అధినేత జగన్ తీరు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత వైసీపీకి…

11 hours ago

రోమాంచకం… సరిపోతుందా సమయం

టాలీవుడ్ లోనే కాదు బయట రాష్ట్రాల్లో కూడా దర్శకుడు సందీప్ రెడ్డి వంగా అంటే ఒక బ్రాండ్. తీసింది కేవలం…

12 hours ago