Movie News

మహేషే కాదు తారక్ కూడా అడవుల్లోకే

ఒక్క అప్డేట్ బయటికి తెలియకుండా గుట్టుచప్పుడు కాకుండా షూటింగ్ జరుపుకుంటున్న ఎస్ఎస్ఎంబి 29 అడవుల బ్యాక్ డ్రాప్ లో రూపొందుతున్న సంగతి తెలిసిందే. మహేష్ బాబుని ఇప్పటిదాకా చూడని టెర్రిఫిక్ పాత్రలో దర్శకుడు రాజమౌళి ప్రెజెంట్ చేయబోతున్నారనే టాక్ అంచనాలను ఎక్కడికో తీసుకెళ్తోంది. ప్రియాంకా చోప్రా ఒకటే కన్ఫర్మ్ గా తెలిసిన క్యాస్టింగ్ కాగా పృథ్వి రాజ్ సుకుమారన్, నానా పాటేకర్, జాన్ అబ్రహం తదితరుల పేర్లు గట్టిగానే చక్కర్లు కొడుతున్నాయి. అయితే జక్కన్న ఇప్పట్లో వీటికి సంబంధించి ఎలాంటి సమాచారం అధికారికంగా ఇచ్చేందుకు రెడీగా లేరు.

ఇదిలా ఉండగా జూనియర్ ఎన్టీఆర్ – ప్రశాంత్ నీల్ కలయికలో తెరకెక్కబోయే యాక్షన్ ఎంటర్ టైనర్ లోనూ అడవి నేపథ్యం ఉంటుందని సమాచారం. తొలుత ఆ సన్నివేశాలనే వికారాబాద్ పరిసరాల్లో తారక్ లేకుండా షూట్ చేయబోతున్నట్టు తెలిసింది. వార్ 2 బ్రేక్ తీసుకున్నాక తారక్ వచ్చి జాయిన్ కాబోతున్నాడు. ఇప్పటిదాకా నీల్ తన ఉగ్రం, కెజిఎఫ్, కెజిఎఫ్ 2 లో ఎక్కడ చెట్లు పుట్టలను చూపించలేదు. వేరే ప్రపంచాల్లోకి తీసుకెళ్లిపోయాడు. కానీ జూనియర్ మూవీ అలా ఉండదట. కమర్షియల్ జానరే అయినప్పటికీ హీరోయిజంని పీక్స్ లో చూపించే సరికొత్త బ్యాక్ డ్రాప్ ఎంచుకున్నట్టు సమాచారం.

దీనికి డ్రాగన్ టైటిల్ ముందు నుంచి ప్రచారంలో ఉంది. అయితే తమిళ హీరో ప్రదీప్ రంగనాథన్ ఇదే పేరుతో చేసిన సినిమా ఫిబ్రవరి 21 విడుదల కానుంది. టాలీవుడ్ డబ్బింగ్ వెర్షన్ కు రిటర్న్ అఫ్ ది డ్రాగన్ అని పెట్టడం గమనార్హం. ఎన్టీఆర్ నీల్ నిర్మిస్తున్న మైత్రి మూవీ మేకర్సే తెలుగులో ప్రదీప్ మూవీని తీసుకొస్తుండటం గమనార్హం. అంటే ఫలితం చూశాక డ్రాగన్ టైటిల్ పెట్టుకోవాలో వద్దో నిర్ణయిస్తారేమో. రుక్మిణి వసంత్ హీరోయిన్ గా నటిస్తున్న తారక్ నీల్ చిత్రంలో టోవినో థామస్ ఓ కీలక పాత్ర చేస్తున్నాడు. రవి బస్రూర్ సంగీతం సమకూరుస్తుండగా 2026 సంక్రాంతి విడుదలని లక్ష్యంగా పెట్టుకున్నారు.

This post was last modified on February 11, 2025 2:07 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

అధికారంలో ఉన్నాం ఆ తమ్ముళ్ల బాధే వేరుగా ఉందే…!

అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…

2 hours ago

డాలర్లు, మంచి లైఫ్ కోసం విదేశాలకు వెళ్ళాక నిజం తెలిసింది

డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…

5 hours ago

జగన్ ఇలానే ఉండాలి టీడీపీ ఆశీస్సులు

వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవ‌రినీ దెబ్బతీయరు.…

8 hours ago

టీం ఇండియా ఇప్పటికైన ఆ ప్లేయర్ ను ఆడిస్తుందా?

రాయ్‌పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…

8 hours ago

చరిత్ర ఎన్నోసార్లు హెచ్చరిస్తూనే ఉంది

కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…

11 hours ago

చంద్రబాబును కలిసిన కాంగ్రెస్ మంత్రి

ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్‌కు…

13 hours ago