నిన్న జరిగిన లైలా ప్రీ రిలీజ్ ఈవెంట్లో నటుడు 30 ఇయర్స్ పృథ్వి మాటలు ఊహించనంత దుమారం రేపాయి. పదకొండు మేకలంటూ ఒక పార్టీ మీద వ్యంగ్యంగా వేసిన సెటైర్ చాలా దూరం వెళ్లి ఏకంగా సినిమాని బ్యాన్ చేయాలని కొందరు పిలుపు ఇచ్చేదాకా తీసుకెళ్లాయి.
ఏదో ఆషామాషీగా అనుకుంటే లైట్ తీసుకోవచ్చు కానీ ఇంకా ఇరవై నాలుగు గంటలు గడవక ముందే వేల ట్వీట్లు లైలాకు వ్యతిరేకంగా పడటం షాకింగ్ పరిణామం. దీంతో జరుగుతున్న నష్టాన్ని గుర్తించిన విశ్వక్, నిర్మాత సాహు గారపాటిలు ప్రెస్ మీట్ పెట్టి జరిగింది వివరించే ప్రయత్నం చేశారు. మనోభావాలు దెబ్బ తిన్నవాళ్లకు సారీ చెప్పారు.
పృథ్వి మాట్లాడే సమయంలో తాము చిరంజీవిని రిసీవ్ చేసుకోవడానికి బయటికి వెళ్లామని, ఒకవేళ ఎదురుగా కనక జరిగి ఉంటే ఖచ్చితంగా మైకు లాక్కునేవాళ్లమని విశ్వక్ చెప్పడం చూస్తే అందులో లాజిక్ ఉందనిపిస్తోంది. పైగా తమకు నేరుగా ఎలాంటి సంబంధం లేని ప్రసంగంలో రాజకీయ ప్రస్తావన తెచ్చినప్పుడు తన సినిమాను బలి పశువు చేయడం న్యాయం కాదని ఆవేదన స్వరంతో విశ్వక్ వాపోయాడు.
గెస్టుగా వచ్చిన వాళ్ళు ఏం మాట్లాడుతారో ముందే తమకు తెలియదని, అలాంటప్పుడు కంట్రోల్ చేయడం సాధ్యం కాదన్న హీరో, నిర్మాత ఒకరు చేసిన తప్పుకు అందరినీ శిక్షించవద్దని కోరుకున్నారు.
ఎలా చూసినా విశ్వక్ సేన్ బాధ పడటంలో అర్థముంది. వాళ్ళ పరిధిలో కట్టడిలో లేని సంఘటనకు నేరుగా టీమ్ ని బాధ్యులను చేయడం సబబు కాదు. అసలు మేకల సీన్ పృథ్వి చెప్పినట్టు సినిమాలో లేదని క్లారిటీ రావడం మరో ట్విస్ట్. ఉద్దేశపూర్వకంగా పొలిటికల్ అజెండాతో కొందరు ఆర్టిస్టులు ఇస్తున్న స్పీచులు చాలా డ్యామేజ్ చేస్తున్నాయి.
సోషల్ మీడియా ట్రెండింగ్ కి ఒక టాపిక్ దొరికితే చాలు క్షణాల్లో వైరలవుతోంది. అలాంటిది ఒక రాజకీయ పార్టీని లక్ష్యంగా చేసుకుని అతి కామెడీ చేస్తే ఇలాగే మిస్ ఫైర్ అయిపోయి ఊహించనంత నష్టం జరుగుతుంది. ఇకనైనా ఇలాంటి విషయాల్లో జాగ్రత్త తీసుకోవడం అవసరం.
This post was last modified on February 10, 2025 4:19 pm
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురం నియోజకవర్గానికి సంక్రాంతి పండుగ ముందుగానే వచ్చింది. శుక్రవారం నుంచి…
కన్నడలో ఒకప్పటి స్టార్ హీరోయిన్, తర్వాత రాజకీయ నాయకురాలిగా మారిన దివ్య స్పందన అలియాస్ రమ్య జర్నీలో వివాదాలకు లోటేమీ…
ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్ షిప్(పీపీపీ) ద్వారా రాష్ట్రంలో మెడికల్ కాలేజీలతో పాటు పర్యాటక ప్రాంతాలను కూడా అభివృద్ధి చేయాలని సీఎం…
వైసీపీ పార్లమెంట్ సభ్యుడు, సీనియర్ నేత మిథున్ రెడ్డి ఆస్తులు భారీగా పెరిగాయని పేర్కొంటూ ఏడిఆర్ సర్వే తాజాగా వెల్లడించింది.…
టాక్సిక్ టీజర్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ముఖ్యంగా కారులో రొమాన్స్ పెట్టి దాని ద్వారా స్మశానంలో…
ఇంకొద్ది గంటల్లో రాజా సాబ్ ప్రీమియర్లు ప్రారంభం కాబోతున్నాయి. జీవో త్వరగా రావడంతో ఆంధ్రప్రదేశ్ బుకింగ్స్ వేగంగా ఉండగా తెలంగాణది…