నిన్న జరిగిన లైలా ప్రీ రిలీజ్ ఈవెంట్లో నటుడు 30 ఇయర్స్ పృథ్వి మాటలు ఊహించనంత దుమారం రేపాయి. పదకొండు మేకలంటూ ఒక పార్టీ మీద వ్యంగ్యంగా వేసిన సెటైర్ చాలా దూరం వెళ్లి ఏకంగా సినిమాని బ్యాన్ చేయాలని కొందరు పిలుపు ఇచ్చేదాకా తీసుకెళ్లాయి.
ఏదో ఆషామాషీగా అనుకుంటే లైట్ తీసుకోవచ్చు కానీ ఇంకా ఇరవై నాలుగు గంటలు గడవక ముందే వేల ట్వీట్లు లైలాకు వ్యతిరేకంగా పడటం షాకింగ్ పరిణామం. దీంతో జరుగుతున్న నష్టాన్ని గుర్తించిన విశ్వక్, నిర్మాత సాహు గారపాటిలు ప్రెస్ మీట్ పెట్టి జరిగింది వివరించే ప్రయత్నం చేశారు. మనోభావాలు దెబ్బ తిన్నవాళ్లకు సారీ చెప్పారు.
పృథ్వి మాట్లాడే సమయంలో తాము చిరంజీవిని రిసీవ్ చేసుకోవడానికి బయటికి వెళ్లామని, ఒకవేళ ఎదురుగా కనక జరిగి ఉంటే ఖచ్చితంగా మైకు లాక్కునేవాళ్లమని విశ్వక్ చెప్పడం చూస్తే అందులో లాజిక్ ఉందనిపిస్తోంది. పైగా తమకు నేరుగా ఎలాంటి సంబంధం లేని ప్రసంగంలో రాజకీయ ప్రస్తావన తెచ్చినప్పుడు తన సినిమాను బలి పశువు చేయడం న్యాయం కాదని ఆవేదన స్వరంతో విశ్వక్ వాపోయాడు.
గెస్టుగా వచ్చిన వాళ్ళు ఏం మాట్లాడుతారో ముందే తమకు తెలియదని, అలాంటప్పుడు కంట్రోల్ చేయడం సాధ్యం కాదన్న హీరో, నిర్మాత ఒకరు చేసిన తప్పుకు అందరినీ శిక్షించవద్దని కోరుకున్నారు.
ఎలా చూసినా విశ్వక్ సేన్ బాధ పడటంలో అర్థముంది. వాళ్ళ పరిధిలో కట్టడిలో లేని సంఘటనకు నేరుగా టీమ్ ని బాధ్యులను చేయడం సబబు కాదు. అసలు మేకల సీన్ పృథ్వి చెప్పినట్టు సినిమాలో లేదని క్లారిటీ రావడం మరో ట్విస్ట్. ఉద్దేశపూర్వకంగా పొలిటికల్ అజెండాతో కొందరు ఆర్టిస్టులు ఇస్తున్న స్పీచులు చాలా డ్యామేజ్ చేస్తున్నాయి.
సోషల్ మీడియా ట్రెండింగ్ కి ఒక టాపిక్ దొరికితే చాలు క్షణాల్లో వైరలవుతోంది. అలాంటిది ఒక రాజకీయ పార్టీని లక్ష్యంగా చేసుకుని అతి కామెడీ చేస్తే ఇలాగే మిస్ ఫైర్ అయిపోయి ఊహించనంత నష్టం జరుగుతుంది. ఇకనైనా ఇలాంటి విషయాల్లో జాగ్రత్త తీసుకోవడం అవసరం.
This post was last modified on February 10, 2025 4:19 pm
దేశంలో అత్యధిక సినీ అభిమానం ఉన్న ప్రేక్షకులుగా తెలుగు ఆడియన్సుకి పేరుంది. తెలుగు రాష్ట్రాలు రెంటినీ కలిపి ఒక యూనిట్…
జగిత్యాల జిల్లాలోని ప్రసిద్ధ కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయ అభివృద్ధికి తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) రూ.30 కోట్ల నిధులను…
అటు ఢిల్లీలో కేంద్ర మంత్రులను కలిసి ఏపీకి నిధులు మంజూరు అయ్యేలా ప్రయత్నాలు చేస్తుంటారు. ఇటు తన శాఖలను సమర్థవంతంగా…
నిన్న జరిగిన ఛాంపియన్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కు రామ్ చరణ్ ముఖ్యఅతిధిగా రావడం హైప్ పరంగా దానికి మంచి…
వైసీపీ హయాంలో విశాఖపట్నంలోని ప్రఖ్యాత పర్యాటక ప్రాంతం రుషికొండను తొలిచి.. నిర్మించిన భారీ భవనాల వ్యవహారం కొలిక్కి వస్తున్నట్టు ప్రభుత్వ…
భారీ అంచనాలతో గత వారం విడుదలైన అఖండ 2 తాండవం నెమ్మదిగా సాగుతోంది. రికార్డులు బద్దలవుతాయని అభిమానులు ఆశిస్తే ఇప్పుడు…