Movie News

‘పుష్ప-2’లో పరుచూరిని ఆశ్చర్యపరిచిన సీన్

రెండు నెలల కిందట విడుదలైన ‘పుష్ప-2’ చిత్రం పాన్ ఇండియా స్థాయిలో ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ అయిందో తెలిసిందే. మాతృక అయిన తెలుగు వెర్షన్ ఓ మోస్తరుగా ఆడింది కానీ.. హిందీ వెర్షన్ మాత్రం ఎవ్వరూ ఊహించని స్థాయిలో వసూళ్ల మోత మోగించి ఇండియన్ ఫిలిం హిస్టరీలోనే అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రాల్లో ఒకటిగా నిలిచింది.

ఇలా మంచి క్రేజున్న రిలీజైన కొన్ని వారాలకు టాలీవుడ్ లెజెండరీ రైటర్ పరుచూరి గోపాలకృష్ణ తన ‘పరుచూరి పలుకులు’ యూట్యూబ్ ఛానెల్లో విశ్లేషణలు చేస్తుంటారు. తాజాగా ఆయన ‘పుష్ప-2’ మీద విశ్లేషణ చేశారు. ఇందులో సినిమాలోని కీలక మలుపుల గురించి.. అలాగే తనను ఆశ్చర్యపరిచిన విషయాల గురించి ఆయన మాట్లాడారు.సినిమాలో షెకావత్‌కు పుష్ప సారీ చెప్పే సన్నివేశంలో తాను బోల్తా కొట్టినట్లు పరుచూరి చెప్పారు.

హీరో విలన్‌కు సారీ చెప్పడాన్ని ప్రేక్షకులు అంగీకరించరని.. కాబట్టి హీరో సారీ చెప్పడని తాను అనుకున్నానని పరుచూరి చెప్పారు. ఈ సన్నివేశం తనను ఆశ్చర్యపరిచిందన్నారు. హీరో సారీ చెప్పకుండా వేర ఏదో ప్లాన్ చేస్తారేమో అని తాను అనుకున్నానని.. కానీ సుకుమార్ తన ఆలోచనలకు భిన్నంగా ఈ సీన్ డిజైన్ చేశాడని పరుచూరి చెప్పారు. ఐతే పుష్పరాజ్‌లో ప్రతినాయక ఛాయలు ఉండడం, అతను ఒక స్మగ్లర్ కావడం వల్లే ప్రేక్షకులు ఈ సన్నివేశాన్ని అంగీకరించారన్నారు.

సాధారణంగా ధర్మాన్ని పాటించే హీరో సారీ చెబితే ప్రేక్షకులు తట్టుకోలేరన్నారు. ముఖ్యమంత్రి తనతో ఫొటో దిగకపోవడం అనే సిల్లీ రీజన్‌ మూడు గంటల 40 నిమిషాల కథకు కారణమైనప్పటికీ.. సుకుమార్ ఎంతో నేర్పుగా కథనాన్ని నడిపారని పరుచూరి చెప్పారు. సినిమాలో షెకావత్ చనిపోయినట్లుగా చూపించారని.. కానీ అంత పెద్ద విలన్ ఆత్మాహుతి చేసుకుని చనిపోవడం కరెక్ట్ కాదని.. పుష్ప-3 తీస్తే అతను బతికే ఉన్నట్లు చూపిస్తారని అభిప్రాయపడ్డారు పరుచూరి.

This post was last modified on February 8, 2025 7:02 pm

Share
Show comments
Published by
Kumar

Recent Posts

ఫ్యామిలీ ఆడియన్స్ కనెక్ట్ అయితే రచ్చే

రేపు రాత్రి ప్రీమియర్లతో విడుదల కాబోతున్న మన శంకరవరప్రసాద్ గారు మీద ఆల్రెడీ ఉన్న బజ్ మరింత పెరిగే దిశగా…

23 minutes ago

ప్రతిచోట చీపురు పట్టుకొని పవన్ ఊడవాలా?

పాలన అంటే కార్యాలయాల్లో కూర్చుని సమీక్షలు చేయడమే కాదు. ప్రజల మధ్యకు వెళ్లి వారి సమస్యలను ప్రత్యక్షంగా చూడడమే నిజమైన…

3 hours ago

విమర్శకులను పనితీరుతో కొడుతున్న లోకేష్..!

తనపై విమర్శలు చేసే వారిని సహజంగా ఎవరైనా ప్రతివిమర్శలతో ఎదుర్కొంటారు. మాటకు మాట అంటారు. ఇక రాజకీయాల్లో అయితే ఈ…

5 hours ago

రండి.. కూర్చుని మాట్లాడుకుందాం: ఏపీకి రేవంత్ రెడ్డి పిలుపు

ఇరు తెలుగు రాష్ట్రాల మధ్య ఉన్న జల వివాదాలపై యాగీ చేసుకోకుండా కూర్చుని మాట్లాడుకుంటే సమస్యలు పరిష్కారం అవుతాయని తెలంగాణ…

5 hours ago

షమీ కెరీర్ క్లోజ్ అయినట్టేనా?

టీమ్ ఇండియా సీనియర్ పేసర్ మహమ్మద్ షమీ ఇంటర్నేషనల్ కెరీర్ దాదాపు ముగింపు దశకు చేరుకున్నట్లే కనిపిస్తోంది. గతేడాది జరిగిన…

5 hours ago

‘వైసీపీ చేసిన పాపాలను కడుగుతున్నాం’

రెండు రాష్ట్రాల మధ్య జల వివాదాలపై ఏపీ సీఎం చంద్రబాబు మరోసారి స్పందించారు. నీళ్లు వద్దు, గొడవలే కావాలని కొందరు…

14 hours ago