Political News

ఢిల్లీ రిజ‌ల్ట్‌: తేడా 2 ల‌క్ష‌లు.. పోయింది.. ఆరు ల‌క్ష‌లు!

క‌ల‌సి ఉంటే క‌ల‌దు సుఖం.. అన్న‌ట్టుగా కూట‌మిగా ఢిల్లీలో నిల‌బ‌డి ఉంటే.. ఇండియా కూట‌మి ఘ‌న విజ‌యం ద‌క్కించుకునేది.. అనేందుకు తాజాగా కేంద్ర ఎన్నిక‌ల సంఘం వెల్ల‌డించిన ఓట్ల షేరు ఉదాహ‌ర‌ణ‌గా నిలుస్తోంది. దాదాపు 27 సంవ‌త్స‌రాల త‌ర్వా త‌.. బీజేపీ హ‌స్తిన పీఠాన్ని కైవ‌సం చేసుకుంది. 48 స్థానాల్లో విజ‌యం ద‌క్కించుకుని అధికారం చేప‌ట్టింది. అయితే.. ఇదేస‌మయంలో ఆమ్ ఆద్మీ పార్టీ 22 స్థానాల‌కే ప‌రిమిత‌మై… అధికారం కోల్పోయింది. ఇది పైకిక‌నిపిస్తున్న వాస్త‌వం. కానీ, తాజాగా కేంద్ర ఎన్నిక‌ల సంఘం ఇచ్చిన ఓట్ల షేర్‌ను ప‌రిశీలిస్తే.. ఈ రెండు పార్టీల మ‌ధ్య ఓట్ల తేడా కేవ‌లం 2 ల‌క్ష‌లు!

ఆశ్చ‌ర్యం కాదు.. గెలిచిన పార్టీ, ఓడిన పార్టీ మ‌ధ్య 2 ల‌క్ష‌ల ఓట్లే తేడా ఉన్నాయి. అంటే..ఈ రెండు ల‌క్ష‌ల ఓట్లు చీలిపోయాయి. ఇవి క‌నుక‌.. ప‌దిలంగా ఉండి ఉంటే.. కేజ్రీవాల్ విజ‌యం ద‌క్కించుకునే వారు. మ‌రోసారి ఢిల్లీ ప‌గ్గాలు చేప‌ట్టేవారు. కానీ, ఇక్క‌డే ఇండియా కూట‌మి చేతులు క‌ల‌ప‌ని వైనంతో ఏకంగా 6 ల‌క్ష‌లకుపైగా ఓట్లు చీలిపోయాయి.

తాజా ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ పార్టీకి ఒక్క‌సీటు ద‌క్కలేదు. కాంగ్రెస్‌కు జీరో! కానీ, ఓట్ల షేర్ విష‌యానికి వ‌స్తే.. కేంద్ర ఎన్నిక‌ల సంఘం పేర్కొన్న లెక్క‌ల ప్ర‌కారం.. కాంగ్రెస్ పార్టీకి రాష్ట్ర వ్యాప్తంగా ఆరు ల‌క్ష‌ల‌పై చిలుకు ఓట్లు వ‌చ్చాయి.

అంటే.. ఇవి అచ్చంగా కూట‌మి ఓట్లు! ఆప్‌-కాంగ్రెస్‌లు క‌లిసి ఉంటే.. ఈ ఆరు ల‌క్ష‌ల ఓట్లు కూడా.. కూట‌మికి ప‌డేవి. త‌ద్వారా.. ఢిల్లీ ఆప్ వ‌శం అయ్యేది. కానీ, క‌ల‌సి ఉండ‌ని ఫ‌లితంగా ఓట్లు చీలి .. ఆప్ కుదేలైంది. మ‌రోవైపు.. చిన్న చిత‌కా పార్టీలు కూడా.. ఆప్ ఓట‌మికి కార‌ణ‌మ‌య్యాయి. హైద‌రాబాద్‌కు చెందిన ఎంఐఎం.. ఈ ఎన్నిక‌ల్లో 80 వేల ఓట్ల‌ను రాబ‌ట్టుకుంది. ఇక‌, యూపీకి చెందిన బీఎస్పీ.. 35 వేల ఓట్ల‌ను తెచ్చుకుంది. అదేవిధంగా ఇత‌ర ప్రాంతీయ ప‌క్షాలు కూడా.. 60 వేల ఓట్ల‌పైచిలుకు చీల్చాయం. ఇవ‌న్నీ.. కూడా ఇండియా కూట‌మికి ద‌క్కే ఓట్లుగా విశ్లేష‌కులు చెబుతున్నారు. సో.. ఎలా చూసుకున్నా.. స్వ‌ల్ప ఓట్ల తేడాకు క‌ల‌సి క‌ట్టుగా ముందుకు వెళ్ల‌క‌పోవ‌డం.. పంతాలు, ప‌ట్టింపులకు పోవ‌డం.. వంటివి కార‌ణాలుగా చెబుతున్నారు.

This post was last modified on February 8, 2025 10:29 pm

Share

Recent Posts

వివేకా హత్యకు రూ.40 కోట్ల సుపారీ?

కడప ఎంపీ, వైసీపీ అధినేత జగన్ సోదరుడు వైఎస్ అవినాష్ రెడ్డి గృహాల్లో ఈడీ సోదాలతో మాజీ మంత్రి వైఎస్…

1 hour ago

మెగాస్టార్ ప్రస్థానం… టాలీవుడ్ మాస్ సంతకం

తెలుగు సినిమా పుట్టిన తర్వాత ఎందరో లెజెండ్స్ ప్రేక్షకుల హృదయాల మీద చెరిగిపోని సంతకం చేశారు. చిత్తూరు నాగయ్య నుంచి…

1 hour ago

సందీప్ వంగ ‘చిరు’ ఫ్యానిజం… ఇది చాలా లోతు బాసూ

అర్జున్ రెడ్డి, కబీర్ సింగ్, యానిమల్ ఇలా తీసింది మూడు సినిమాలే అయినా ప్యాన్ ఇండియా లెవెల్ లో పాపులారిటీ…

2 hours ago

చిరంజీవి కాకా… అదిరింది కానుక

ఈ సంవత్సరం మన శంకరవరప్రసాద్ గారుతో మూడు వందల కోట్ల బ్లాక్ బస్టర్ ఖాతాలో వేసుకున్న మెగాస్టార్ చిరంజీవి వచ్చే…

2 hours ago

ప్యారడైజ్ నిర్ణయం ఇరుముడికి వరం

ఒక్కోసారి మనం తీసుకునే నిర్ణయాలు పక్కవాళ్ళకు మేలు చేస్తాయి. ఇండస్ట్రీలో కూడా ఇది సర్వ సాధారణం. కాకపోతే ఈ ప్రయోజనం…

3 hours ago

గవర్నర్ గా యనమల రామకృష్ణుడు?

కేంద్రంలో రాజకీయ పరిణామాలు వేగంగా మారిపోతున్నాయి. జంతర్ మంతర్ దెబ్బకు కేంద్ర విద్యా శాఖ మంత్రి రాజీనామా చేయడం తెలిసిందే.…

5 hours ago