ఎన్నాళ్ళో వేచిన ఉదయం అనే పాట ఇప్పుడు నాగచైతన్యకు బాగా సరిపోతుంది. ఎందుకంటే గత కొన్ని సినిమాలు కనీస టాక్ తెచ్చుకోలేక యుఎస్ ప్రీమియర్ల నుంచే డిజాస్టర్ అనిపించుకోవడం అభిమానులను తీవ్ర కలవరానికి గురి చేసింది. థాంక్ యు, కస్టడీ మొదటి రోజు సాయంత్రానికే చేతులెత్తేసిన వైనం అంత సులభంగా మర్చిపోయేది కాదు.
అతిథి పాత్ర చేసిన బాలీవుడ్ మూవీ లాల్ సింగ్ చద్దా సైతం దారుణమైన ఫలితాన్ని అందుకుంది. వెబ్ సిరీస్ దూతకు మంచి పేరే వచ్చినప్పటికీ దాని రీచ్ తక్కువ కాబట్టి థియేట్రికల్ గా బలంగా ఋజువు చేసుకోవాలనే కసి చైతులో కొన్ని నెలలుగా రగులుతోంది.
ఈ ఎదురు చూపులకు తండేల్ తెరవేసినట్టే. ఇండస్ట్రీ రికార్డులు బద్దలు కొట్టే టాక్ కాదు కానీ బాగుంది, నిరాశపరచలేదనే కామెంట్స్ పబ్లిక్ తో పాటు రివ్యూలలోనూ కనిపించాయి. ఆ ఆనందం చైతు మొహంలో స్పష్టమవుతోంది. నిన్న సాయంత్రం జరిగిన సక్సెస్ ప్రెస్ మీట్ లో ఆ భావోద్వేగాన్ని మీడియా ప్రతినిధులు గమనించారు.
హిట్ మాట విని చాలా కాలమయ్యిందని తనే స్వయంగా ఒప్పుకోవడం చూస్తే ఇంత కాలం ఎంత బాధపడ్డాడో అర్థమవుతోంది. సాయిపల్లవి లాంటి డామినేటింగ్ ఆర్టిస్ట్ ఉన్నప్పటికీ ఆమె కన్నా ఎక్కువ తన పెర్ఫార్మన్స్ గురించి మాట్లాడుకోవడం చైతు సాధించిన మరో బెంచ్ మార్కని చెప్పొచ్చు.
సో అక్కినేని అభిమానులకిది హ్యాపీ మూమెంట్. తండేల్ నెంబర్లు ఎలా ఉంటాయని ఊహించడం ఇప్పుడు తొందరపాటే అవుతుంది కానీ ప్రమోషన్లు ఆపకుండా జనాలకు సినిమాను మరింత చేరువగా చేసే బాధ్యతను చైతు టీమ్ తీసుకోబోతోంది. అల్లు అరవింద్ దీని కోసం ప్రత్యేక ప్రణాళిక సిద్ధం చేస్తున్నారట.
ఇటీవలే తీవ్ర సమస్యగా మారిన పైరసీ సమస్యని ఎదురుకునేలా బన్నీ వాస్ పలు సంస్థల సహాయ సహకారాలు తీసుకోబోతున్నారని తెలిసింది. ఎలాగూ ఈ నెలలో తీవ్రమైన పోటీ ఇచ్చే తండేల్ రేంజ్ సినిమాలు లేవు కాబట్టి ఈ మూమెంట్ ఇలాగే కొనసాగితే చైతు కెరీర్ లో హయ్యెస్ట్ గ్రాసర్ ఇదే కావొచ్చు.
This post was last modified on February 8, 2025 10:22 am
ఏపీ రాజధాని అమరావతిపై వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలు రాష్ట్రంలో తీవ్ర దుమారం రేపాయి. పార్టీలకు…
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురం నియోజకవర్గానికి సంక్రాంతి పండుగ ముందుగానే వచ్చింది. శుక్రవారం నుంచి…
కన్నడలో ఒకప్పటి స్టార్ హీరోయిన్, తర్వాత రాజకీయ నాయకురాలిగా మారిన దివ్య స్పందన అలియాస్ రమ్య జర్నీలో వివాదాలకు లోటేమీ…
ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్ షిప్(పీపీపీ) ద్వారా రాష్ట్రంలో మెడికల్ కాలేజీలతో పాటు పర్యాటక ప్రాంతాలను కూడా అభివృద్ధి చేయాలని సీఎం…
వైసీపీ పార్లమెంట్ సభ్యుడు, సీనియర్ నేత మిథున్ రెడ్డి ఆస్తులు భారీగా పెరిగాయని పేర్కొంటూ ఏడిఆర్ సర్వే తాజాగా వెల్లడించింది.…
టాక్సిక్ టీజర్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ముఖ్యంగా కారులో రొమాన్స్ పెట్టి దాని ద్వారా స్మశానంలో…