ఎన్నాళ్ళో వేచిన ఉదయం అనే పాట ఇప్పుడు నాగచైతన్యకు బాగా సరిపోతుంది. ఎందుకంటే గత కొన్ని సినిమాలు కనీస టాక్ తెచ్చుకోలేక యుఎస్ ప్రీమియర్ల నుంచే డిజాస్టర్ అనిపించుకోవడం అభిమానులను తీవ్ర కలవరానికి గురి చేసింది. థాంక్ యు, కస్టడీ మొదటి రోజు సాయంత్రానికే చేతులెత్తేసిన వైనం అంత సులభంగా మర్చిపోయేది కాదు.
అతిథి పాత్ర చేసిన బాలీవుడ్ మూవీ లాల్ సింగ్ చద్దా సైతం దారుణమైన ఫలితాన్ని అందుకుంది. వెబ్ సిరీస్ దూతకు మంచి పేరే వచ్చినప్పటికీ దాని రీచ్ తక్కువ కాబట్టి థియేట్రికల్ గా బలంగా ఋజువు చేసుకోవాలనే కసి చైతులో కొన్ని నెలలుగా రగులుతోంది.
ఈ ఎదురు చూపులకు తండేల్ తెరవేసినట్టే. ఇండస్ట్రీ రికార్డులు బద్దలు కొట్టే టాక్ కాదు కానీ బాగుంది, నిరాశపరచలేదనే కామెంట్స్ పబ్లిక్ తో పాటు రివ్యూలలోనూ కనిపించాయి. ఆ ఆనందం చైతు మొహంలో స్పష్టమవుతోంది. నిన్న సాయంత్రం జరిగిన సక్సెస్ ప్రెస్ మీట్ లో ఆ భావోద్వేగాన్ని మీడియా ప్రతినిధులు గమనించారు.
హిట్ మాట విని చాలా కాలమయ్యిందని తనే స్వయంగా ఒప్పుకోవడం చూస్తే ఇంత కాలం ఎంత బాధపడ్డాడో అర్థమవుతోంది. సాయిపల్లవి లాంటి డామినేటింగ్ ఆర్టిస్ట్ ఉన్నప్పటికీ ఆమె కన్నా ఎక్కువ తన పెర్ఫార్మన్స్ గురించి మాట్లాడుకోవడం చైతు సాధించిన మరో బెంచ్ మార్కని చెప్పొచ్చు.
సో అక్కినేని అభిమానులకిది హ్యాపీ మూమెంట్. తండేల్ నెంబర్లు ఎలా ఉంటాయని ఊహించడం ఇప్పుడు తొందరపాటే అవుతుంది కానీ ప్రమోషన్లు ఆపకుండా జనాలకు సినిమాను మరింత చేరువగా చేసే బాధ్యతను చైతు టీమ్ తీసుకోబోతోంది. అల్లు అరవింద్ దీని కోసం ప్రత్యేక ప్రణాళిక సిద్ధం చేస్తున్నారట.
ఇటీవలే తీవ్ర సమస్యగా మారిన పైరసీ సమస్యని ఎదురుకునేలా బన్నీ వాస్ పలు సంస్థల సహాయ సహకారాలు తీసుకోబోతున్నారని తెలిసింది. ఎలాగూ ఈ నెలలో తీవ్రమైన పోటీ ఇచ్చే తండేల్ రేంజ్ సినిమాలు లేవు కాబట్టి ఈ మూమెంట్ ఇలాగే కొనసాగితే చైతు కెరీర్ లో హయ్యెస్ట్ గ్రాసర్ ఇదే కావొచ్చు.
సమంత అసాధ్యం అనుకున్నది చేసి చూపించేసింది. ఈ రోజుతో మా ఇంటి బంగారం వంద కోట్ల గ్రాస్ క్లబ్బులో అడుగు…
ఎంతవరకు నిజమో చెప్పలేం కానీ నిర్మాత నమిత మల్హోత్రా చెబుతున్న దాని ప్రకారం రామాయణకు పెడుతున్న ఖర్చు నాలుగు వేల…
ఈ నెల 24 విడుదల కాబోతున్న చెన్నై లవ్ స్టోరీ టీమ్ ఒక విషయంలో టెన్షన్ పడుతోంది. అదే రోజు…
పెద్ది, మా ఇంటి బంగారం తర్వాత ఈ సీజన్ లో బాక్సాఫీస్ కు మళ్ళీ జోష్ వచ్చింది. థియేటర్లు కళకళలాడుతున్నాయి.…
తమిళ సినిమాల్లో చాలా ఏళ్ల నుంచి తిరుగులేని ఆధిపత్యం చలాయిస్తున్నాడు అనిరుధ్ రవిచందర్. అతడి హవా తమిళానికే పరిమితం కావట్లేదు…
బూత్ స్థాయిలో బలోపేతం అయ్యే దిశగా జనసేన కసరత్తు షురూ చేసింది. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ నాయకులు ఉన్నప్పటికీ..…