ఇవాళ విడుదలైన తండేల్ కు మంచి టాకే వినిపిస్తోంది. అదిరిపోయింది, రికార్డులు కొల్లగొడుతుందనే స్థాయిలో కాదు కానీ నిరాశ పరచలేదనే అభిప్రాయం అటు ఆడియన్స్ ఇటు మీడియాలో కనిపిస్తోంది. ఈ మధ్య కాలంలో ముందు రోజు సాయంత్రం లేదా రిలీజ్ రోజు తెల్లవారుఝామున బెనిఫిట్ షోలు వేయడం పరిపాటిగా మారింది.
అలాని అన్నింటికి ఒకేలా వర్కౌట్ కావడం లేదు. పుష్ప 2 ది రూల్ దీన్నుంచి గొప్ప ఫలితాన్ని అందుకోగా ఉదయం నాలుగు గంటలకు వేసిన షోలే గేమ్ ఛేంజర్ కు శాపంగా మారాయి. అందుకే తండేల్ విషయంలో అల్లు అరవింద్ అలాంటి బెనిఫిట్లు ఏవీ వద్దని రెగ్యులర్ షోలకు ఓటేశారు.
దీని వల్లే ఏపీలో ఉదయం ఏడు, తెలంగాణలో ఎనిమిది గంటలకు తండేల్ మొదలయ్యింది. దీని వల్ల కలిగిన లాభమే ఎక్కువ. ఎందుకంటే జెన్యూన్ టాక్ బయటికి వస్తుంది. నిద్ర కళ్ళు, తాగిన మైకం, లేట్ నైట్ దాకా మేల్కొని థియేటర్ దాకా రావడం, హాలు బయట అభిమానుల గోల ఇవన్నీ సినిమా అనుభూతి మీద ప్రభావం చూపిస్తున్నాయి.
దేవరకు ముందు మిక్స్డ్ టాక్ వినిపించింది దీని వల్లే. తర్వాత తప్పని తెలిసింది. తండేల్ అలా కాకూడదనే ఉద్దేశంతోనే స్పెషల్ ప్రీమియర్లకు నో అనేశారు. గతంలో గీతా ఆర్ట్స్ 2లో వచ్చిన ఇతర మీడియం బడ్జెట్ సినిమాలకు ఈ ట్రెండ్ మిస్ ఫైర్ అయ్యింది.
సో తండేల్ ఎలాంటి ఇబ్బందులు లేకుండా టాక్ తెచ్చుకుంది. ఇది సాయంత్రానికి మరింత పికప్ అయితే వీకెండ్ లోపు భారీ వసూళ్లు ఆశించవచ్చు. ఎలాగూ సంక్రాంతికి వస్తున్నాం స్లో అయిపోయింది కాబట్టి బాక్సాఫీస్ వద్ద వ్యాక్యూమ్ ని తండేల్ వాడుకోవాలని చూస్తున్నారు. నిన్నటి దాకా విపరీతమైన ప్రమోషన్లు చేసిన చైతు టీమ్ వాటిని ఆపబోవడం లేదు.
మరికొన్ని కార్యక్రమాలకు శ్రీకారం చుట్టబోతున్నారు. ఎలాగూ వచ్చే వారం లైలా తప్ప చెప్పుకోదగ్గ పోటీ లేదు. యూత్ సరే కానీ ఫ్యామిలీ ఆడియన్స్ సపోర్ట్ ఎంతమేరకు దక్కుతుందనేది తండేల్ ఫైనల్ రిజల్ట్ ని శాశించనుంది. చూడాలి మరి.
This post was last modified on February 7, 2025 4:00 pm
దేశ రాజధాని ఢిల్లీలోని జంతర్ మంతర్ కు ఇటీవల ఎక్కడ లేని ప్రాచుర్యం లభించింది. నీట్ పేపర్ లీకేజి కి…
గతంలో బ్రహ్మానందం, బాబు మోహన్ లాంటి కమెడియన్స్ ఉన్నప్పుడు వాళ్ళ కోసమే విడిగా కామెడీ ఎపిసోడ్స్ రాసేవాళ్ళు. మెయిన్ రైటర్స్…
తెలుగు సినిమా చరిత్రలోనే అత్యంత గొప్ప నటుల జాబితా తీస్తే.. అందులో పైవరుసలో ఉండే ఆర్టిస్టుల్లో మోహన్ బాబు ఒకరు.…
ప్రముఖ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ కొత్త ప్రస్థానం మొదలైపోయింది. నిన్నటిదాకా రాజకీయ వ్యూహకర్తగా, ఓ రాజకీయ పార్టీకి అధినేతగా…
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు చెందిన ఓ కీలక కేసు విషయంలో సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. వ్యక్తి చనిపోయిన తర్వాత.. కేసును…
టాలీవుడ్ విచిత్రాలు కొన్ని భలే అనిపిస్తాయి. కాకతాళీయమే అయినా అదేదో రాసిపెట్టి జరగడం ఆశ్చర్యం కలిగిస్తుంది. ఇటీవలే విడుదలైన శ్రీనివాస…