అక్కినేని నాగచైతన్య కెరీర్లోనే అత్యధిక అంచనాల మధ్య విడుదల కాబోతోంది ‘తండేల్’ మూవీ. తన చివరి చిత్రాలు కస్టడీ, థాంక్యూ పెద్ద డిజాస్టర్లు అయినా సరే.. ఈ మూవీకి మంచి హైప్ ఉంది. గీతా ఆర్ట్స్ లాంటి పెద్ద సంస్థ ఎంతో నమ్మకంతో పెద్ద బడ్జెట్ పెట్టి ఈ సినిమాను నిర్మించడం.. పాటలు, ప్రోమోలు అదిరిపోవడంతో దీనికి హైప్ క్రియేట్ అయింది. ఈ నేపథ్యంలో ఈ చిత్రానికి బెనిఫిట్ షోలు ఉంటాయా.. రేట్లు పెంచుతారా అనే చర్చ జరుగుతోంది.
దీనికి నిర్మాత బన్నీ వాసు ఒక ఇంటర్వ్యూలో క్లారిటీ ఇచ్చాడు. ‘తండేల్’ కథ మీద నమ్మకంతో తాము ఏకంగా రూ.80 కోట్ల బడ్జెట్ పెట్టినట్లు బన్నీ వాసు తెలిపాడు. ఆ బడ్జెట్ రికవరీ కోసం కొంత మేర టికెట్ల ధరలు పెంచుకోవాలని చూస్తున్నామని.. అది రీజనబుల్గానే ఉంటుందని అతను చెబుతున్నాడు. సంధ్య థియేటర్ దుర్ఘటన వలన తెలంగాణలో బెనిఫిట్ షోలు, అదనపు రేట్లకు బ్రేక్ పడింది.
ఈ వ్యవహారంలో కోర్టు కూడా స్పష్టమైన ఆదేశాలు ఇవ్వడంతో ‘తండేల్’కు అర్లీ మార్నింగ్ షోలు, అదనపు రేట్లు ఉండవు. ఇటీవలి కోర్టు ఆదేశాలను అనుసరించి ఉదయం 8.40 నుంచే షోలు మొదలు కానున్నాయి. ఇటీవలి పరిణామాల దృష్ట్యా అదనపు షోలు, రేట్ల కోసం అసలు ప్రభుత్వాన్ని ‘తండేల్’ టీం సంప్రదించనే లేదట. ఏపీలో మాత్రం ఐదో షో, అదనపు రేట్ల కోసం అడుగుతున్నారు.
తొలి రోజు ఉదయం 6-7 గంటల మధ్య ఎక్స్ట్రా షోకు అనుమతి రావచ్చు. అలాగే టికెట్ మీద రూ.50 మేర పెంపు కూడా అడుగుతున్నారట. అనుమతులు రావడం కష్టమేమీ కాదు. కాబట్టి సంక్రాంతి సినిమాల మాదిరే ఈ చిత్రానికి కూడా ముందు ఏపీలోనే షోలు పడబోతున్నాయి. అక్కడ సినిమా చూడ్డానికి కొంచెం ఎక్కువ రేటు పెట్టాలి. తెలంగాణలో మాత్రం నార్మల్ రేట్లతోనే సినిమాచూడొచ్చు. అర్లీ మార్నింగ్ షోలు ఉండవు.
సమంత అసాధ్యం అనుకున్నది చేసి చూపించేసింది. ఈ రోజుతో మా ఇంటి బంగారం వంద కోట్ల గ్రాస్ క్లబ్బులో అడుగు…
ఎంతవరకు నిజమో చెప్పలేం కానీ నిర్మాత నమిత మల్హోత్రా చెబుతున్న దాని ప్రకారం రామాయణకు పెడుతున్న ఖర్చు నాలుగు వేల…
ఈ నెల 24 విడుదల కాబోతున్న చెన్నై లవ్ స్టోరీ టీమ్ ఒక విషయంలో టెన్షన్ పడుతోంది. అదే రోజు…
పెద్ది, మా ఇంటి బంగారం తర్వాత ఈ సీజన్ లో బాక్సాఫీస్ కు మళ్ళీ జోష్ వచ్చింది. థియేటర్లు కళకళలాడుతున్నాయి.…
తమిళ సినిమాల్లో చాలా ఏళ్ల నుంచి తిరుగులేని ఆధిపత్యం చలాయిస్తున్నాడు అనిరుధ్ రవిచందర్. అతడి హవా తమిళానికే పరిమితం కావట్లేదు…
బూత్ స్థాయిలో బలోపేతం అయ్యే దిశగా జనసేన కసరత్తు షురూ చేసింది. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ నాయకులు ఉన్నప్పటికీ..…