యూత్ హీరో నితిన్ కు డబుల్ సంకటం వచ్చి పడింది. రాబిన్ హుడ్ మార్చి 28 విడుదల తేదీని అధికారికంగా ప్రకటించుకున్న సంగతి తెలిసిందే. అదే డేట్ కి హరిహర వీరమల్లు రాదేమోననే అనుమానంతో మైత్రి మూవీ మేకర్స్ ముందు జాగ్రత్తగా డేట్ వేసుకున్నారు. కానీ ఒకవేళ పవన్ కళ్యాణ్ వస్తే మాత్రం వాయిదా వేసుకోవడం తప్ప వేరే మార్గం ఉండదు.
పవర్ స్టార్ వీరాభిమానిగా నితిన్ ఆ రిస్క్ చేయడు. అసలు మైత్రి నిర్మాతలే దానికి సిద్ధపడరు. ఇంకోవైపు వీరమల్లు ప్రమోషన్లలో డేట్ మారడం లేదు. మార్చి 28నే చూపిస్తున్నారు. సో పోస్ట్ పోన్ లేకుండా ప్రస్తుతానికి దానికే కట్టుబడిన విషయం స్పష్టమవుతోంది.
ఒకవేళ ఇదే జరిగితే రాబిన్ హుడ్ మళ్ళీ నిర్ణయం మార్చుకోక తప్పదు. వెంకీ కుడుముల దర్శకత్వంలో రూపొందుతున్న ఈ ఎంటర్ టైనర్ లో శ్రీలీల హీరోయిన్ గా చేయడం అంచనాలు రేపుతోంది. ఇంకోవైపు తమ్ముడు షూటింగ్ చివరి దశకు వచ్చింది.
దిల్ రాజు ముందైతే శివరాత్రి రిలీజ్ అనుకున్నారు కానీ ఇప్పుడది సాధ్యపడదు. సో వేసవికి వెళ్ళిపోవాలి. ప్యాన్ ఇండియా సినిమాలతో క్లాష్ లేకుండా చూసుకోవాలి. అందులోనూ రాబిన్ హుడ్, తమ్ముడు ల మధ్య కనీసం రెండు నెలల గ్యాప్ ఉండటం నితిన్ మార్కెట్ దృష్ట్యా అవసరం. సో ఇప్పటికిప్పుడు ఏదీ నిర్ధారణగా చెప్పలేని పరిస్థితి నెలకొంది.
ఒకవేళ ముందు అనుకున్నట్టు రాబిన్ హుడ్ కనక డిసెంబర్ లోనే వచ్చి ఉంటే ఇప్పుడీ డిస్కషన్ ఉండేది కాదు. తమ్ముడుకి రూట్ క్లియరయ్యేది. కానీ అలా జరగకపోవడం ఈ డైలమాకు దారి తీసింది. నితిన్ కి రెండు ప్రతిష్టాత్మక సినిమాలే. బడ్జెట్లు కూడా పెద్దవే.
తమ్ముడుకి వేణు శ్రీరామ్ దర్శకత్వం వహించారు. టైటిల్ సాఫ్ట్ గా ఉన్నా కమర్షియల్ ఎలిమెంట్స్ పుష్కలంగా ఉన్నాయి. పెద్ద బ్రేక్ కోసం ఎదురు చూస్తున్న నితిన్ కు ఈ రెండే దేనికవే కీలకం. విభిన్నమైన కథలతో తెరకెక్కుతున్నాయి. కాకపోతే అనుకోకుండా వచ్చిన సంకటం వల్ల ఈ సమస్యని ఎదురుకోవాల్సి వచ్చింది. చూడాలి పరిష్కారం ఏమవుతుందో.
This post was last modified on January 31, 2025 10:11 am
భర్త మహాశయులకు విజ్ఞప్తి ప్రీ రిలీజ్ ఈవెంట్ లో గెస్టుగా వచ్చిన దర్శకుడు బాబీ మాట్లాడుతూ రవితేజ రొటీన్ సినిమాలు…
వైసీపీ అధినేత జగన్పై ఏపీ సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతిపై జగన్ రెండు రోజుల కిందట…
తెలంగాణలో త్వరలో జరగనున్న మునిసిపల్ ఎన్నికల్లో జనసేన పార్టీ పోటీ చేయనున్నట్లు ఆ పార్టీ అధికారికంగా ప్రకటించింది.“త్వరలో జరగనున్న తెలంగాణ…
సినిమాల మీద మీమ్స్ క్రియేట్ చేయడంలో తెలుగు వాళ్లను మించిన వాళ్లు ఇంకెవ్వరూ ఉండరంటే అతిశయోక్తి కాదు. కొన్ని మీమ్స్…
అమరావతిని ఉద్దేశించి వైఎస్ జగన్ చేసిన వ్యాఖ్యలు రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర రాజకీయ దుమారాన్ని రేపాయి. రాజధానిని సో-కాల్డ్ నగరంగా అభివర్ణిస్తూ,…
సంక్రాంతి పండుగ వచ్చిందంటే చాలు…చిన్నా పెద్దా అని తేడా లేకుండా పతంగులు ఎగరేస్తుంటారు. పండుగ పూట కుటుంబ సభ్యులు, మిత్రులతో…