యూత్ హీరో నితిన్ కు డబుల్ సంకటం వచ్చి పడింది. రాబిన్ హుడ్ మార్చి 28 విడుదల తేదీని అధికారికంగా ప్రకటించుకున్న సంగతి తెలిసిందే. అదే డేట్ కి హరిహర వీరమల్లు రాదేమోననే అనుమానంతో మైత్రి మూవీ మేకర్స్ ముందు జాగ్రత్తగా డేట్ వేసుకున్నారు. కానీ ఒకవేళ పవన్ కళ్యాణ్ వస్తే మాత్రం వాయిదా వేసుకోవడం తప్ప వేరే మార్గం ఉండదు.
పవర్ స్టార్ వీరాభిమానిగా నితిన్ ఆ రిస్క్ చేయడు. అసలు మైత్రి నిర్మాతలే దానికి సిద్ధపడరు. ఇంకోవైపు వీరమల్లు ప్రమోషన్లలో డేట్ మారడం లేదు. మార్చి 28నే చూపిస్తున్నారు. సో పోస్ట్ పోన్ లేకుండా ప్రస్తుతానికి దానికే కట్టుబడిన విషయం స్పష్టమవుతోంది.
ఒకవేళ ఇదే జరిగితే రాబిన్ హుడ్ మళ్ళీ నిర్ణయం మార్చుకోక తప్పదు. వెంకీ కుడుముల దర్శకత్వంలో రూపొందుతున్న ఈ ఎంటర్ టైనర్ లో శ్రీలీల హీరోయిన్ గా చేయడం అంచనాలు రేపుతోంది. ఇంకోవైపు తమ్ముడు షూటింగ్ చివరి దశకు వచ్చింది.
దిల్ రాజు ముందైతే శివరాత్రి రిలీజ్ అనుకున్నారు కానీ ఇప్పుడది సాధ్యపడదు. సో వేసవికి వెళ్ళిపోవాలి. ప్యాన్ ఇండియా సినిమాలతో క్లాష్ లేకుండా చూసుకోవాలి. అందులోనూ రాబిన్ హుడ్, తమ్ముడు ల మధ్య కనీసం రెండు నెలల గ్యాప్ ఉండటం నితిన్ మార్కెట్ దృష్ట్యా అవసరం. సో ఇప్పటికిప్పుడు ఏదీ నిర్ధారణగా చెప్పలేని పరిస్థితి నెలకొంది.
ఒకవేళ ముందు అనుకున్నట్టు రాబిన్ హుడ్ కనక డిసెంబర్ లోనే వచ్చి ఉంటే ఇప్పుడీ డిస్కషన్ ఉండేది కాదు. తమ్ముడుకి రూట్ క్లియరయ్యేది. కానీ అలా జరగకపోవడం ఈ డైలమాకు దారి తీసింది. నితిన్ కి రెండు ప్రతిష్టాత్మక సినిమాలే. బడ్జెట్లు కూడా పెద్దవే.
తమ్ముడుకి వేణు శ్రీరామ్ దర్శకత్వం వహించారు. టైటిల్ సాఫ్ట్ గా ఉన్నా కమర్షియల్ ఎలిమెంట్స్ పుష్కలంగా ఉన్నాయి. పెద్ద బ్రేక్ కోసం ఎదురు చూస్తున్న నితిన్ కు ఈ రెండే దేనికవే కీలకం. విభిన్నమైన కథలతో తెరకెక్కుతున్నాయి. కాకపోతే అనుకోకుండా వచ్చిన సంకటం వల్ల ఈ సమస్యని ఎదురుకోవాల్సి వచ్చింది. చూడాలి పరిష్కారం ఏమవుతుందో.
This post was last modified on January 31, 2025 10:11 am
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…
రాయ్పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…