Political News

కేసీఆర్ సెక్ర‌టేరియెట్‌.. రేవంత్ ఉస్మానియా!

తెలంగాణ‌లో పేరొందిన చ‌రిత్రాత్మ‌క క‌ట్ట‌డాలు చ‌రిత్ర‌లో క‌లుస్తున్నాయి. వాటిస్థానంలో ప్ర‌భుత్వాలు పోటీ ప‌డి మ‌రీ కొత్త‌వి నిర్మిస్తున్నాయి. ద‌శాబ్దాలు, శ‌తాబ్దాల నాటి క‌ట్ట‌డాలు కావ‌డంతో కొంత మేర‌కు మార్పుల పేరుతో కొత్త‌వాటికి మొగ్గు చూపుతున్నాయి. ఈ క్ర‌మంలోనే గ‌తంలో కేసీఆర్ ఉమ్మ‌డి రాష్ట్రానికి చెందిన స‌చివాల‌యాన్ని ప‌క్క‌న పెట్టి ఇంద్ర‌భ‌వ‌నం వంటి నూత‌న సచివాల‌యాన్ని నిర్మించారు. దీనిపై అనేక విమ‌ర్శ‌లు వ‌చ్చినా.. ఆయ‌న ముందుకే వెళ్లారు.

ఇక‌, ఇప్పుడు రేవంత్ వంతు వ‌చ్చింది. ఈయ‌న ఉస్మానియా ఆసుప‌త్రి స్థానంలో కొత్త‌దానిని నిర్మిస్తున్నా రు. హైద‌రాబాద్‌లోనే పేరెన్నిక‌గ‌న్న ఉస్మానియా ఆసుప‌త్రి గురించి అంద‌రికీ తెలిసిందే. సువిశాల ప్రాంగణంలో స్వాతంత్య్రానికి పూర్వ‌మే నిర్మించిన ఈ ఆసుప‌త్రికి పొరుగు రాష్ట్రాల నుంచి కూడా రోగులు వ‌స్తారు. అయితే.. ఇది పాత నిర్మాణం కావ‌డంతో దానిని ప‌క్క‌న పెట్టి కొత్త‌దానికి తాజాగా శంకుస్థాప‌న చేశారు.

గోషామహల్‌ మైదానంలో ఆస్పత్రి నూతన భవన నిర్మాణానికి తాజాగా సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాప‌న చేశారు. దీనిని 2 వేల పడకలతో 26.3 ఎకరాల్లో నిర్మించ‌నున్నారు. దీనికి సంబంధించి 2400 కోట్ల రూపాయల‌ను ప్ర‌భుత్వం వెచ్చించ‌నుంది. మొత్తం 14 అంతస్తుల్లో ఆస్పత్రి భవనాన్ని నిర్మించ‌నున్నారు. దీనిలో అత్యాధునిక వైద్య సౌకర్యాలను క‌ల్పించ‌నున్నారు. మొత్తం 30 విభాగాల్లో వైద్య సేవలు అందించ‌ను న్నారు.

కొత్తగా నిర్మిస్తున్న ఉస్మానియా ఆస్పత్రిలో రోబోటిక్‌ సర్జరీలు చేసేలా సౌకర్యాలు ఉండ‌నున్నాయి. అదేవిధంగా కొత్త ఆస్పత్రిలో అన్ని రకాల సూపర్‌ స్పెషాలిటీ వైద్య సేవలు అందుబాటులోకి రానున్నాయి. దీనిని రెండు సంవ‌త్స‌రాల్లో పూర్తి చేయాల‌ని ల‌క్ష్యంగా పెట్టుకున్నారు. ప్ర‌స్తుతం జ‌రిగిన భూమి పూజ‌లో సీఎం రేవంత్ తో పాటు మంత్రి భ‌ట్టి స‌హా ప‌లువురు అధికారులు పాల్గొన్నారు. కాగా.. రేవంత్ రెడ్డి హ‌యాంలో జ‌రిగిన భారీ నిర్మాణానికి జ‌రిగిన తొలి శంకుస్థాప‌న కావ‌డం గ‌మ‌నార్హం.

Satya

Recent Posts

ఇక కొడాలి నాని వంతు

వైసీపీ సీనియ‌ర్ నాయ‌కుడు, ఫైర్‌బ్రాండ్ కొడాలి నానిపై 2021లో న‌మోదైన కేసు విచార‌ణ‌కు తాజాగా ప్రభుత్వం గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చింది.…

4 hours ago

అత్తెసరు వసూళ్లతో ముంచేసేలా ఉంది

హీరోయిన్ కంగనా రౌనత్ టైం ఏ మాత్రం బాలేదు. పట్టిందల్లా ప్లాస్టిక్ అన్న తరహాలో ఏ జానర్ సినిమా చేసినా…

5 hours ago

‘చంద్రబాబు భరోసానిచ్చారు… మాకు అది చాలు’

ఏపీ సీఎం చంద్రబాబును విజయవాడలోని కృష్ణలంకకు చెందిన సాయికృష్ణ కుటుంబ సభ్యులు కలిసిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత మీడియాతో…

6 hours ago

త్రినేత్రుడి కన్నెర్రకు ప్రతిరూపం ‘నాగబంధం’

విజువల్ ఎఫెక్ట్స్ మీద ఆధారపడి సినిమాలు తీయడం చాలా రిస్క్. కొన్నిసార్లు ఇవి తీసుకునే సమయం హీరోల కెరీర్ల మీద…

8 hours ago

బాలయ్యతో కాజల్… గ్లామర్ కు దూరంగా పవర్ఫుల్ రోల్

బాలకృష్ణ, గోపీచంద్ మలినేని కాంబినేషన్ లో తెరకెక్కుతున్న NBK111 ప్రాజెక్టులో స్టార్ క్యాస్ట్ మంచి ఇంపాక్ట్ క్రియేట్ చేసేలా ఉంది.…

9 hours ago

ఈ సమయంలో మౌనమేల షర్మిల గారు?

విజయవాడలో యువకుడి అదృశ్యం కేసు రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేకెత్తిస్తోంది. రాజకీయ, కులం రంగు పులుముకున్న ఈ వ్యవహారం…

9 hours ago