తెలంగాణలో పేరొందిన చరిత్రాత్మక కట్టడాలు చరిత్రలో కలుస్తున్నాయి. వాటిస్థానంలో ప్రభుత్వాలు పోటీ పడి మరీ కొత్తవి నిర్మిస్తున్నాయి. దశాబ్దాలు, శతాబ్దాల నాటి కట్టడాలు కావడంతో కొంత మేరకు మార్పుల పేరుతో కొత్తవాటికి మొగ్గు చూపుతున్నాయి. ఈ క్రమంలోనే గతంలో కేసీఆర్ ఉమ్మడి రాష్ట్రానికి చెందిన సచివాలయాన్ని పక్కన పెట్టి ఇంద్రభవనం వంటి నూతన సచివాలయాన్ని నిర్మించారు. దీనిపై అనేక విమర్శలు వచ్చినా.. ఆయన ముందుకే వెళ్లారు.
ఇక, ఇప్పుడు రేవంత్ వంతు వచ్చింది. ఈయన ఉస్మానియా ఆసుపత్రి స్థానంలో కొత్తదానిని నిర్మిస్తున్నా రు. హైదరాబాద్లోనే పేరెన్నికగన్న ఉస్మానియా ఆసుపత్రి గురించి అందరికీ తెలిసిందే. సువిశాల ప్రాంగణంలో స్వాతంత్య్రానికి పూర్వమే నిర్మించిన ఈ ఆసుపత్రికి పొరుగు రాష్ట్రాల నుంచి కూడా రోగులు వస్తారు. అయితే.. ఇది పాత నిర్మాణం కావడంతో దానిని పక్కన పెట్టి కొత్తదానికి తాజాగా శంకుస్థాపన చేశారు.
గోషామహల్ మైదానంలో ఆస్పత్రి నూతన భవన నిర్మాణానికి తాజాగా సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు. దీనిని 2 వేల పడకలతో 26.3 ఎకరాల్లో నిర్మించనున్నారు. దీనికి సంబంధించి 2400 కోట్ల రూపాయలను ప్రభుత్వం వెచ్చించనుంది. మొత్తం 14 అంతస్తుల్లో ఆస్పత్రి భవనాన్ని నిర్మించనున్నారు. దీనిలో అత్యాధునిక వైద్య సౌకర్యాలను కల్పించనున్నారు. మొత్తం 30 విభాగాల్లో వైద్య సేవలు అందించను న్నారు.
కొత్తగా నిర్మిస్తున్న ఉస్మానియా ఆస్పత్రిలో రోబోటిక్ సర్జరీలు చేసేలా సౌకర్యాలు ఉండనున్నాయి. అదేవిధంగా కొత్త ఆస్పత్రిలో అన్ని రకాల సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు అందుబాటులోకి రానున్నాయి. దీనిని రెండు సంవత్సరాల్లో పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ప్రస్తుతం జరిగిన భూమి పూజలో సీఎం రేవంత్ తో పాటు మంత్రి భట్టి సహా పలువురు అధికారులు పాల్గొన్నారు. కాగా.. రేవంత్ రెడ్డి హయాంలో జరిగిన భారీ నిర్మాణానికి జరిగిన తొలి శంకుస్థాపన కావడం గమనార్హం.
This post was last modified on January 31, 2025 2:23 pm
ఒకప్పుడు హిందీ సినిమాలు తెలుగులోకి అనువాదం కావడం, ఇక్కడ పెద్ద స్థాయిలో రిలీజ్ కావడమే ఉండేది తప్ప.. తెలుగు చిత్రాలు…
మాజీ మంత్రి మల్లారెడ్డి స్టేజ్ ఎక్కారంటే, మైక్ అందుకున్నారు అంటే మెరుపులు మెరవాల్సిందే. అది రాజకీయ సభ అయినా.. సినిమా…
మన దేశంలో చాలా చోట్ల కోతుల బెడద ఉంది. అడవుల నరికివేత, పట్టణీకరణ నేపథ్యంలో కోతులు జనావాసాల మధ్యకు వచ్చాయి.…
అల్లు అర్జున్ అంటే ఒకప్పుడు మెగా హీరోల్లో ఒకడు. అతను మెగాస్టార్ చిరంజీవినో, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్నో పొగిడితేనో..…
టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద ఇరుముడి తప్ప మరొక మాట వినిపించదేమో అన్న రేంజ్ లో వసూళ్లు హోరెత్తిపోతున్నాయి. ఈ జోరు…
ఇంకో నాలుగు రోజుల్లో విడుదల కాబోతున్న టాక్సిక్ ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ మల్లారెడ్డి యునివర్సిటిలో ఘనంగా జరిగింది. తెలుగు…