పరిశ్రమ, ప్రభుత్వాలు మేలుకోవాల్సిన టైం వచ్చేసింది. నిన్న దాకా థియేటర్ ప్రింట్లకు పరిమితమైన పైరసీ ఇప్పుడు హెచ్డి రూపం సంతరించుకుని ప్రమాద హెచ్చరికలు చేస్తోంది. ఈ వార్నింగ్ బెల్ గేమ్ ఛేంజర్ కన్నా ముందే కంగువతో మొదలైనప్పటికీ సరైన సమయంలో నిర్మాతలు మేలుకోకపోవడంతో ఇతర భాషలకూ పాకుతోంది.
ఇది కేవలం నిర్మాతల సమస్య కాదు. పదులు వందల కోట్ల పెట్టుబడులతో హక్కులు కొనే ఓటిటిలకు సైతం పెనుముప్పుగా మారుతోంది. థియేటర్లో సినిమాలు ఆడుతుండగానే ఒరిజినల్ సౌండ్ తో క్వాలిటీ ప్రింట్లు అందుబాటులోకి వచ్చేస్తే సబ్స్క్రిప్షన్లు గణనీయంగా తగ్గిపోతాయి.
గత మూడు నెలల కాలంలో సుమారు పదిహేనుకి పైగా సినిమాలు హెచ్డి రక్కసి బారిన పడటం తీవ్రతను సూచిస్తోంది. నిన్న నెట్ ఫ్లిక్స్ లో వచ్చిన పుష్ప 2 సైతం దీనికి మినహాయింపు కాలేదు. రిలీజైన 17వ రోజే బయటికి తెచ్చారు. కానీ కంటెంట్ లో బలం వల్ల తట్టుకోగలిగింది.
కానీ ప్రతి సినిమా ఈ స్థాయిలో ఉండదు. ముఖ్యంగా యావరేజ్, డీసెంట్ హిట్లకు జనాన్ని రప్పించడం చాలా కష్టమైన తరుణంలో ఇలాంటి సవాళ్లు ప్రొడ్యూసర్లకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. వీటివల్ల భవిష్యత్తులో ఓటిటి నిబంధనలు మరింత కఠినంగా మారిపోయి లీక్ వస్తే కనక డబ్బులో కోత విధిస్తామని బెదిరించినా ఆశ్చర్యం లేదు.
పరిస్థితి మరింత దారుణంగా మారకముందే చర్యలు చేపట్టాలి. ముఖ్యంగా డబ్బింగ్ చేస్తున్న ప్యాన్ ఇండియా సినిమాలకు ఈ బెడద అధికంగా ఉంది. డాకు మహారాజ్ ని కూడా వదల్లేదు. కేవలం తెలుగులో మాత్రమే రిలీజైన సంక్రాంతికి వస్తున్నాం దీని బారిన పడకపోవడం గమనించాల్సిన అంశం.
అసలు హెచ్డి సోర్స్ కి లింక్ ఎక్కడి నుంచి వెళ్తోందో గుర్తిస్తే తప్ప అరికట్టడం అసాధ్యం. ప్రస్తుతానికి చూసి చూడనట్టు ఉందాం అని వదిలేస్తే పరిణామాలు ఊహకందటం కష్టమే. ఇప్పటిది ఒకరిద్దరి సమస్యగా కనిపించినా రాబోయే రోజుల్లో కరోనా వైరస్ లాగా అందరికీ అంటుకోవడం ఖాయం. ఆలోగానే మందు కనిపెట్టాలి.
This post was last modified on January 31, 2025 12:27 pm
స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో ఢిల్లీలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నుంచి వచ్చిన ఒక వీడియో ఇప్పుడు వివాదానికి కేంద్రంగా మారింది.…
కాక్రోచ్ జనతా పార్టీ(సీజేపీ) అధినేత అభిజిత్ దీప్కే ఇటీవల ప్రకటించిన `పాఠశాలల అభివృద్ధి` కార్యక్రమానికి 80వ స్వాతంత్ర దినోత్సవం వేడుకలే…
స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని దేశమంతా జాతీయ పతాకాన్ని ఎగరేయడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు అమరావతి లోని రాయపూడి గ్రౌండ్స్…
గత కొన్ని రోజులుగా మలయాళ కథానాయిక అనుపమ పరమేశ్వరన్ బ్రేకప్ వ్యవహారం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే.…
తాజాగా విడుదలైన విశ్వనాథ్ అండ్ సన్స్ తెలుగులో చూపిస్తున్న జోరు తమిళంలో ప్రదర్శించడం లేదన్నది వాస్తవం. ఓపెనింగ్స్ నెంబర్లు పోల్చుకుని…
జాతిరత్నాలు సినిమాతో మంచి గుర్తింపు సంపాదించి, తెలుగులో వరుసగా సినిమాలు చేస్తున్న కథానాయిక.. ఫరియా అబ్దుల్లా. థియేటర్ బ్యాగ్రౌండ్ నుంచి…