సంక్రాంతి సినిమాల సందడి ముగింపు దశకు వచ్చింది. ఇక తెలుగు ప్రేక్షకుల దృష్టి ‘తండేల్’ మీదికి మళ్లబోతోంది. ఈ సినిమా మొదలైనప్పుడే మంచి బజ్ తెచ్చుకుంది. రిలీజ్ టైంకి హైప్ వేరే లెవెల్కు వెళ్తోంది. చిత్ర బృందం కూడా పకడ్బందీగా ప్రమోషన్లు ప్లాన్ చేస్తోంది. ఇటీవలే గ్రాండ్గా ట్రైలర్ లాంచ్ చేశారు. ఇక చిత్ర బృందంలోని ముఖ్యుల మీడియా ఇంటర్వ్యూలకు కూడా సమయం ఆసన్నమైంది. ముందుగా దర్శకుడు చందూ మొండేటి ఇంటర్వ్యూలు ఇస్తున్నారు.
ఈ క్రమంలో ఆయనో ఇంటర్వ్యూలో సినిమాలో మేజర్ హైలైట్ అవుతుందని భావిస్తున్న ఎపిసోడ్ గురించి చెప్పిన మాటలు చర్చనీయాంశంగా మారాయి. ఈ సినిమా టీజర్ రిలీజైన దగ్గర్నుంచి అందరినీ ఆకర్షించిన అంశం.. పాకిస్థాన్ ఎపిసోడ్. ఉత్తరాంధ్రకు చెందిన జాలర్ల బృందం పాకిస్థాన్ జనాల్లోకి వెళ్లి అక్కడి నావికా సిబ్బందికి చిక్కడం.. జైలు పాలవడం.. అక్కడ్నుంచి తప్పించుకుని తిరిగి సొంతూరికి చేరడం.. ఇదీ ‘తండేల్’లో కోర్ పాయింట్.
వాస్తవంగా జరిగిన ఈ ఉదంతం నేపథ్యంలోనే ‘తండేల్’ సినిమా రూపొందింది. ఐతే సినిమాలో ఆ ఎపిసోడ్ 20 నిమిషాలే ఉంటుందని.. సినిమాలో మేజర్ పోర్షన్ చైతూ-సాయిపల్లవిల ప్రేమకథ మీదే నడుస్తుందని దర్శకుడు చందూ చెప్పడం ఆశ్చర్యం కలిగిస్తోంది. అసలు కథకు మూలమే పాక్ ఎపిసోడ్ అంటే.. అది 20 నిమిషాలకు పరిమితం అయితే ప్రేక్షకులు హర్షిస్తారా అన్నది ప్రశ్నార్థకం.
అంత తక్కువ టైంలో ఆ ఎపిసోడ్ను ముగిస్తే దాని తాలూకు ఎమోషన్, ఇంపాక్ట్ ప్రేక్షకుల మీద ఏమేర ఉంటుందని సోషల్ మీడియాలో నెటిజన్లు చర్చించుకుంటున్నారు. ఐతే కేవలం పాకిస్థాన్లో మాత్రమే జరిగే సన్నివేశాల రన్ టైం మాత్రమే చందూ చెప్పాడని.. ఆ ఎపిసోడ్ మొదలయ్యాక మధ్యలో వేరే సన్నివేశాలు కూడా వచ్చి పోతుంటాయని.. కాబట్టి అది తక్కువ సమయంలో ముగిసినట్లేమీ ఉండదని..
మరీ ఎక్కువ టైం పాకిస్థాన్ నేపథ్యంలో నడిస్తే డాక్యుమెంటరీ తరహాలో ఉంటుందనే ఉద్దేశంతో.. తక్కువ టైంలో ఎక్కువ ఎఫెక్టివ్గా ఉండేలా ఈ ఎపిసోడ్ను తీర్చిదిద్ది ఉంటారని.. చందూ-అరవింద్-బన్నీ వాసు త్రయం అన్నీ ఆలోచించే ఈ ఆలోచన చేసి ఉంటుందనే వాదన కూడా నడుస్తోంది. మరి రేప్పొద్దున ఈ ఎపిసోడ్ విషయంలో ప్రేక్షకుల స్పందన ఎలా ఉంటుందో చూడాలి.
This post was last modified on January 30, 2025 1:40 pm
కరణం బలరామకృష్ణమూర్తి.. రాజకీయ ఉద్ధండుడిగా పేరొందిన ఉమ్మడి ప్రకాశం జిల్లాకు చెందిన నేత. కుమారుడు కరణం వెంకటేష్ను ఎమ్మెల్యేగా చూసుకోవాలన్న…
నియోజకవర్గాల పునర్విభజన అనూహ్య పరిణామాల నేపథ్యంలో అలా వెనక్కెళ్లిపోయింది. దక్షిణాది, ఈశాన్య రాష్ట్రాలకు తీరని అన్యాయం అంటూ కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా…
బ్లాక్ బస్టర్ సినిమాల వెనుక కొన్ని వేల మంది కష్టం దాగి ఉంటుంది. కాకపోతే ప్రేక్షకులకది అనవసరం. థియేటర్ లో…
ప్రతి నెల ఒకటో తారీకు కోసం ఉద్యోగులు ఎదురు చూడడం సహజం. కారణం నెలంతా కష్టపడితే జీవితాలు అకౌంట్ లో…
తెలంగాణలో కొత్త పార్టీ పెట్టేందుకు రెడీ అయిన మాజీ సీఎం, బీఆర్ ఎస్ అధినేత కేసీఆర్.. తనయ కవిత.. నిన్న…
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ముగిసింది. ఎన్నికల సంఘం నిబంధనల మేరకు మంగళవారం సాయంత్రం 5 గంటలకే అన్ని పార్టీలు..…