సంక్రాంతి సినిమాల సందడి ముగింపు దశకు వచ్చింది. ఇక తెలుగు ప్రేక్షకుల దృష్టి ‘తండేల్’ మీదికి మళ్లబోతోంది. ఈ సినిమా మొదలైనప్పుడే మంచి బజ్ తెచ్చుకుంది. రిలీజ్ టైంకి హైప్ వేరే లెవెల్కు వెళ్తోంది. చిత్ర బృందం కూడా పకడ్బందీగా ప్రమోషన్లు ప్లాన్ చేస్తోంది. ఇటీవలే గ్రాండ్గా ట్రైలర్ లాంచ్ చేశారు. ఇక చిత్ర బృందంలోని ముఖ్యుల మీడియా ఇంటర్వ్యూలకు కూడా సమయం ఆసన్నమైంది. ముందుగా దర్శకుడు చందూ మొండేటి ఇంటర్వ్యూలు ఇస్తున్నారు.
ఈ క్రమంలో ఆయనో ఇంటర్వ్యూలో సినిమాలో మేజర్ హైలైట్ అవుతుందని భావిస్తున్న ఎపిసోడ్ గురించి చెప్పిన మాటలు చర్చనీయాంశంగా మారాయి. ఈ సినిమా టీజర్ రిలీజైన దగ్గర్నుంచి అందరినీ ఆకర్షించిన అంశం.. పాకిస్థాన్ ఎపిసోడ్. ఉత్తరాంధ్రకు చెందిన జాలర్ల బృందం పాకిస్థాన్ జనాల్లోకి వెళ్లి అక్కడి నావికా సిబ్బందికి చిక్కడం.. జైలు పాలవడం.. అక్కడ్నుంచి తప్పించుకుని తిరిగి సొంతూరికి చేరడం.. ఇదీ ‘తండేల్’లో కోర్ పాయింట్.
వాస్తవంగా జరిగిన ఈ ఉదంతం నేపథ్యంలోనే ‘తండేల్’ సినిమా రూపొందింది. ఐతే సినిమాలో ఆ ఎపిసోడ్ 20 నిమిషాలే ఉంటుందని.. సినిమాలో మేజర్ పోర్షన్ చైతూ-సాయిపల్లవిల ప్రేమకథ మీదే నడుస్తుందని దర్శకుడు చందూ చెప్పడం ఆశ్చర్యం కలిగిస్తోంది. అసలు కథకు మూలమే పాక్ ఎపిసోడ్ అంటే.. అది 20 నిమిషాలకు పరిమితం అయితే ప్రేక్షకులు హర్షిస్తారా అన్నది ప్రశ్నార్థకం.
అంత తక్కువ టైంలో ఆ ఎపిసోడ్ను ముగిస్తే దాని తాలూకు ఎమోషన్, ఇంపాక్ట్ ప్రేక్షకుల మీద ఏమేర ఉంటుందని సోషల్ మీడియాలో నెటిజన్లు చర్చించుకుంటున్నారు. ఐతే కేవలం పాకిస్థాన్లో మాత్రమే జరిగే సన్నివేశాల రన్ టైం మాత్రమే చందూ చెప్పాడని.. ఆ ఎపిసోడ్ మొదలయ్యాక మధ్యలో వేరే సన్నివేశాలు కూడా వచ్చి పోతుంటాయని.. కాబట్టి అది తక్కువ సమయంలో ముగిసినట్లేమీ ఉండదని..
మరీ ఎక్కువ టైం పాకిస్థాన్ నేపథ్యంలో నడిస్తే డాక్యుమెంటరీ తరహాలో ఉంటుందనే ఉద్దేశంతో.. తక్కువ టైంలో ఎక్కువ ఎఫెక్టివ్గా ఉండేలా ఈ ఎపిసోడ్ను తీర్చిదిద్ది ఉంటారని.. చందూ-అరవింద్-బన్నీ వాసు త్రయం అన్నీ ఆలోచించే ఈ ఆలోచన చేసి ఉంటుందనే వాదన కూడా నడుస్తోంది. మరి రేప్పొద్దున ఈ ఎపిసోడ్ విషయంలో ప్రేక్షకుల స్పందన ఎలా ఉంటుందో చూడాలి.
This post was last modified on January 30, 2025 1:40 pm
తెలంగాణలోని జగిత్యాల జిల్లా కోరుట్ల బస్టాండ్లో ఒక వింత సంఘటన స్థానికులను, ప్రయాణికులను ఆశ్చర్యానికి గురిచేసింది. బుర్ఖా వేసుకుని మహిళల…
తాజాగా రాజ్యసభలో ఖాళీ అవుతున్న 37 స్థానాలకు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నికలు నిర్వహించేందుకు రెడీ అయింది. దీనికి…
ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్.. గత ఆదివారం కొలంబోకు వెళ్లి ఇండియా, పాకిస్థాన్ మధ్య టీ20 ప్రపంచకప్ మ్యాచ్ను వీక్షించడం…
ఢిల్లీలో జరుగుతున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) సమ్మిట్లో గల్గోటియాస్ యూనివర్సిటీ ప్రదర్శించిన ఒక రోబో డాగ్ ఇప్పుడు పెద్ద వివాదానికి…
సీఎం చంద్రబాబును దూషించిన కేసులో అరెస్టైన మాజీ మంత్రి అంబటి రాంబాబుకు ఆ కేసులో బెయిల్ వచ్చిన సంగతి తెలిసిందే.…
కేవలం ఒక్క రోజు గ్యాప్ లో శ్రీవిష్ణు రెండు సినిమాలు రిలీజ్ కానుండటం గురించి అభిమానుల కంటే ఎక్కువగా డిస్ట్రిబ్యూషన్…