సంక్రాంతి సినిమాల సందడి ముగింపు దశకు వచ్చింది. ఇక తెలుగు ప్రేక్షకుల దృష్టి ‘తండేల్’ మీదికి మళ్లబోతోంది. ఈ సినిమా మొదలైనప్పుడే మంచి బజ్ తెచ్చుకుంది. రిలీజ్ టైంకి హైప్ వేరే లెవెల్కు వెళ్తోంది. చిత్ర బృందం కూడా పకడ్బందీగా ప్రమోషన్లు ప్లాన్ చేస్తోంది. ఇటీవలే గ్రాండ్గా ట్రైలర్ లాంచ్ చేశారు. ఇక చిత్ర బృందంలోని ముఖ్యుల మీడియా ఇంటర్వ్యూలకు కూడా సమయం ఆసన్నమైంది. ముందుగా దర్శకుడు చందూ మొండేటి ఇంటర్వ్యూలు ఇస్తున్నారు.
ఈ క్రమంలో ఆయనో ఇంటర్వ్యూలో సినిమాలో మేజర్ హైలైట్ అవుతుందని భావిస్తున్న ఎపిసోడ్ గురించి చెప్పిన మాటలు చర్చనీయాంశంగా మారాయి. ఈ సినిమా టీజర్ రిలీజైన దగ్గర్నుంచి అందరినీ ఆకర్షించిన అంశం.. పాకిస్థాన్ ఎపిసోడ్. ఉత్తరాంధ్రకు చెందిన జాలర్ల బృందం పాకిస్థాన్ జనాల్లోకి వెళ్లి అక్కడి నావికా సిబ్బందికి చిక్కడం.. జైలు పాలవడం.. అక్కడ్నుంచి తప్పించుకుని తిరిగి సొంతూరికి చేరడం.. ఇదీ ‘తండేల్’లో కోర్ పాయింట్.
వాస్తవంగా జరిగిన ఈ ఉదంతం నేపథ్యంలోనే ‘తండేల్’ సినిమా రూపొందింది. ఐతే సినిమాలో ఆ ఎపిసోడ్ 20 నిమిషాలే ఉంటుందని.. సినిమాలో మేజర్ పోర్షన్ చైతూ-సాయిపల్లవిల ప్రేమకథ మీదే నడుస్తుందని దర్శకుడు చందూ చెప్పడం ఆశ్చర్యం కలిగిస్తోంది. అసలు కథకు మూలమే పాక్ ఎపిసోడ్ అంటే.. అది 20 నిమిషాలకు పరిమితం అయితే ప్రేక్షకులు హర్షిస్తారా అన్నది ప్రశ్నార్థకం.
అంత తక్కువ టైంలో ఆ ఎపిసోడ్ను ముగిస్తే దాని తాలూకు ఎమోషన్, ఇంపాక్ట్ ప్రేక్షకుల మీద ఏమేర ఉంటుందని సోషల్ మీడియాలో నెటిజన్లు చర్చించుకుంటున్నారు. ఐతే కేవలం పాకిస్థాన్లో మాత్రమే జరిగే సన్నివేశాల రన్ టైం మాత్రమే చందూ చెప్పాడని.. ఆ ఎపిసోడ్ మొదలయ్యాక మధ్యలో వేరే సన్నివేశాలు కూడా వచ్చి పోతుంటాయని.. కాబట్టి అది తక్కువ సమయంలో ముగిసినట్లేమీ ఉండదని..
మరీ ఎక్కువ టైం పాకిస్థాన్ నేపథ్యంలో నడిస్తే డాక్యుమెంటరీ తరహాలో ఉంటుందనే ఉద్దేశంతో.. తక్కువ టైంలో ఎక్కువ ఎఫెక్టివ్గా ఉండేలా ఈ ఎపిసోడ్ను తీర్చిదిద్ది ఉంటారని.. చందూ-అరవింద్-బన్నీ వాసు త్రయం అన్నీ ఆలోచించే ఈ ఆలోచన చేసి ఉంటుందనే వాదన కూడా నడుస్తోంది. మరి రేప్పొద్దున ఈ ఎపిసోడ్ విషయంలో ప్రేక్షకుల స్పందన ఎలా ఉంటుందో చూడాలి.
This post was last modified on January 30, 2025 1:40 pm
వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…