దర్శకుడు శైలేష్ కొలను తీసిన హిట్ సిరీస్ లో మొదటి రెండు భాగాలు సూపర్ హిట్ అయ్యాయి. హిట్ 1 ది ఫస్ట్ కేస్ తో విశ్వక్ సేన్ మంచి విజయం నమోదు చేసుకోగా హిట్ 2 ది సెకండ్ కేస్ అడివి శేష్ కు సక్సెస్ ట్రాక్ కొనసాగించింది. ప్రస్తుతం హిట్ 3 ది థర్డ్ కేస్ ని న్యాచురల్ స్టార్ నానితో చేస్తున్న శైలేష్ దీని తర్వాత హిట్ 4 కి రంగం సిద్ధం చేస్తున్నట్టు సమాచారం.
మాస్ మహారాజా రవితేజని మోస్ట్ డేంజరస్ పోలీస్ గా చూపించే అవకాశమున్నట్టు ఇన్ సైడ్ టాక్. ఇంకా నిర్ధారణగా చెప్పలేం కానీ ఒకవేళ నిజమైతే మాత్రం ఒక చిన్న ఎపిసోడ్ షూట్ చేసి హిట్ 3 క్లైమాక్స్ లో జోడించే ఛాన్స్ ఉంది. ఖరారయ్యే దాకా చూడాలి.
హిట్ యునివర్స్ ని విస్తరిస్తానని శైలేష్ కొలను గతంలోనే చెప్పాడు. అందరు హీరోలను ఒక సినిమాలో కలిపి అవెంజర్స్ తరహాలో భారీ ట్రీట్ ఇస్తానని అన్నాడు. సో ఆ దిశగానే అడుగులు పడుతున్నాయన్న మాట. హిట్ 3 ది థర్డ్ కేస్ లో అర్జున్ సర్కార్ పాత్రలో నానిని చాలా వయొలెంట్ గా చూపిస్తున్నట్టు ఆల్రెడీ టాక్.
మర్డర్ మిస్టరీ నేపధ్యమే అయినప్పటికీ ట్రీట్ మెంట్ చాలా విభిన్నంగా ఉంటుందని, షాక్ ఎలిమెంట్స్ చాలా ఉంటాయని అంటున్నారు. ఫ్యామిలీ ఆడియన్స్ లో ఫాలోయింగ్ ఉన్న నానిని సెటిల్డ్ వయొలెన్స్ చేయడం చూసి కొత్త అనుభూతి పొందటం ఖాయమని అంటున్నారు.
సో హిట్ ప్రపంచం పెద్దది కాబోతుంది. మూడు సినిమాలకు నిర్మాతగా వ్యవహరించిన నాని ఇకపై కూడా కొనసాగబోతున్నాడు. బడ్జెట్ ప్రతి భాగానికి పెరుగుతూ పోతోంది. వెంకటేష్ లాంటి పెద్ద హీరోని హ్యాండిల్ చేయడంలో తడబడి ఫ్లాప్ అందుకున్న శైలేష్ కొలను దాన్ని పూర్తిగా మర్చిపోయే కసితో హిట్ 3ని రూపొందిస్తున్నాడట.
శ్రీనిధి హీరోయిన్ కాగా ఇప్పటికే కీలక షెడ్యూల్స్ కొన్ని పూర్తి చేశారు. చాలా అరుదైన లొకేషన్లలో షూటింగ్ జరిగింది. మే 1 విడుదల తేదీని లాక్ చేసుకున్న హిట్ 3 ప్యాన్ ఇండియా స్థాయిలో ఎలాంటి అనూహ్య పరిస్థితులు ఎదురు కాకపోతే చెప్పిన డేట్ కి మాట తప్పకుండా వచ్చేస్తుంది.
This post was last modified on January 28, 2025 2:52 pm
రణ్బీర్ కపూర్, సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్లో వచ్చిన ‘యానిమల్’ 2023లో బాక్సాఫీస్ బిగ్ హిట్ గా నిలిచిన విషయం…
మ్యూజిక్ డైరెక్టర్ తమన్ తన ప్రపంచంలో మరో కోణాన్ని బయటపెట్టాడు. రీసెంట్గా ఒక ఇంటర్వ్యూలో పర్సనల్ చారిటీ వర్క్ గురించి…
వరుణ్ తేజ్ కు చాలా గ్యాప్ తర్వాత సక్సెస్ ఇచ్చిన సినిమాగా కొరియన్ కనకరాజు తొలి నాలుగు రోజుల్లోనే బ్రేక్…
గుజరాత్ రాష్ట్రంలో కొత్త వైరస్ కలకలం సృష్టిస్తుంది. రోజుల పరిధిలోనే పదుల సంఖ్యలో చిన్నారుల ప్రాణాలను బలికొనడం భయాందోళన కలిగిస్తుంది.…
కొన్నేళ్లుగా ఆంధ్ర రాష్ట్రంలో రాజకీయ వాతావరణంలో విచారకర మార్పులు వచ్చాయి. రాజకీయ కాలుష్యం ఏర్పడ్డటంతో ప్రజలు చిరాకు పడుతున్నారు. వైసీపీ…
2027 సంక్రాంతి పందెం క్రమంగా వేడెక్కుతోంది. శర్వానంద్ - శ్రీను వైట్ల కాంబో ' జార్జ్ క్రిష్' జనవరి 14…