సరిగ్గా పది సంవత్సరాల క్రితం 2015లో ఇదే జనవరి 28 జరిగిన టెంపర్ ఆడియో లాంచ్ ని అభిమానులు గుర్తు చేసుకుంటున్నారు. జూనియర్ ఎన్టీఆర్ అప్పుడు వరస ఫ్లాపులు ఎదురుకుంటున్న సమయం. కథలు దర్శకుల ఎంపికలో పొరపాట్ల కారణంగా బాక్సాఫీస్ ఫలితాలు చేదుగా వస్తున్నాయి.
రామయ్యా వస్తావయ్యా, రభస లాంటివి దారుణంగా పోయాయి. చిన్న వయసులోనే సింహాద్రి లాంటి ఇండస్ట్రీ హిట్ ఇచ్చిన తమ హీరోకు ఇలా జరగడం చూసి ఫ్యాన్స్ నొచ్చుకున్నారు. సరిగ్గా అప్పుడు కుదిరింది టెంపర్ కాంబో. దర్శకుడు పూరి జగన్నాధ్ సైతం డౌన్ లో ఉన్నప్పుడు ఈ కలయిక సాధ్యమయ్యింది.
ఆ వేడుకలో తారక్ మాట్లాడుతూ ఇకపై నందమూరి అభిమానులు కాలర్ ఎగరేసుకునేలా సినిమాలు చేస్తానని, గతంలో కొన్ని నిరాశపరిచినా ఇకపై జాగ్రత్తగా ఉంటానని సభావేదికగా హామీ ఇచ్చాడు. నిజంగానే తను అన్నది జరిగింది. టెంపర్ నుంచి దేవర దాకా జూనియర్ ఎన్టీఆర్ ఫ్లాప్ చూడలేదు.
నాన్నకు ప్రేమతో, జనతా గ్యారేజ్, జై లవకుశ, అరవింద సమేత వీరరాఘవ వీటిలో ఏదీ నిరాశపరచలేదు. రామ్ చరణ్ తో కలిసి చేసిన ఆర్ఆర్ఆర్ అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చింది. ఇప్పుడు ఏకంగా వార్ 2 తో బాలీవుడ్ డెబ్యూ జరుగుతోంది. పదేళ్ల ప్రయాణం ఫ్యాన్స్ కోరుకున్న దానికన్నా మిన్నగా జరిగింది.
అప్పుడేదైతే చెప్పాడో జూనియర్ ఇప్పుడూ అదే పాటిస్తున్నాడు. తొందరపాటు చూపించడం లేదు. వార్ 2 తర్వాత ప్రశాంత్ నీల్ ప్యాన్ ఇండియా మూవీతో మరిన్ని పెద్ద టార్గెట్లను పెట్టుకున్నాడు. దేవర 2కి ఎంత టైం పట్టొచ్చనేది ప్రస్తుతానికి తేలలేదు కానీ దాని తర్వాత కూడా హడావిడి నిర్ణయాలు తీసుకునే ఉద్దేశం కనిపించడం లేదు.
పైన చెప్పిన టెంపర్ ఈవెంట్ లో తారక్ బాబాయ్ బాలకృష్ణ ప్రస్తావన తెచ్చి రాబోయే సినిమా గురించి ఫ్యాన్స్ లో ఉత్సాహం రేపడం విశేషం. కొన్ని జ్ఞాపకాలు అంతే. ఒక కాలపరిమితి దాటాక ప్రత్యేకంగా అనిపిస్తాయి. దశాబ్దం తర్వాత టెంపర్ వేడుక అదే కోవలోకి వచ్చింది.
This post was last modified on January 28, 2025 4:32 pm
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…
చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…
కుప్పం.. ఏపీ సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం. గత 40 సంవత్సరాలుగా ఏక ఛత్రాధిపత్యంగా చంద్రబాబు ఇక్కడ విజయం దక్కించుకుంటున్నారు.…