వచ్చే నెల ఫిబ్రవరి 14 విడుదల కాబోతున్న చావా మీదున్న అంచనాలు ట్రైలర్ వచ్చాక రెట్టింపయ్యాయి. విక్కీ కౌశల్ టైటిల్ రోల్ పోషిస్తున్న ఈ హిస్టారికల్ డ్రామాలో రష్మిక మందన్న మహారాణి యేసుబాయ్ గా కీలకమైన పాత్ర దక్కించుకుంది. ఇది పోషించాక రిటైర్ అయిపోయినా పర్వాలేదనిపించిందని చెప్పడం చూస్తే క్యారెక్టర్ తనకు ఎంత స్కోప్ దక్కిందో అర్థం చేసుకోవచ్చు.
అయితే రిలీజ్ కు ఇరవై రోజులు కూడా సమయం లేని పరిస్థితిలో మెల్లగా వివాదాలు చుట్టుముట్టేలా ఉన్నాయి. వాయిదా పడటం లాంటివి జరగకపోవచ్చు కానీ కొన్ని కాంట్రావర్సిలు ఎదురుకునేందుకు టీమ్ సిద్ధం కావాల్సి రావొచ్చు.
చావా చిత్రం ఛత్రపతి శంభాజీ మహారాజ్ జీవిత కథ. మరాఠి సామ్రాజ్యంలో ఆయన వీరోచిత గాథలు ఎన్నో స్ఫూర్తిగా నిలిచాయి. ఆ వంశం వారసులు ఈ సినిమాను చరిత్రకారులకు చూపించి ఏవైనా తప్పులు ఉంటే సరిదిద్దుకోమని అడుగుతున్నారు. రాజ్యసభ ఎంపీ శంబిరాజే ఛత్రపతి దీని గురించి ప్రత్యేకంగా ప్రస్తావిస్తున్నారు.
ట్రైలర్ లో శంభాజీ, యేసుబాయ్ లెజిమ్ అనే సాంప్రదాయ సంగీత వాయిద్యాన్ని వాడినట్టు, నృత్యం చేసినట్టు చిత్రీకరణ చేశారని, కానీ క్రియేటివ్ లిబర్టీ పేరుతో జరగనివి చూపించడం గురించి ఒకసారి చెక్ చేసుకోమని దర్శకుడు లక్ష్మణ్ ఉతేకర్ కు సూచించారట.
ఇదొక్కటే కాదు ఔరంగజేబు దుర్మార్గాలను ఎక్కువ చేసి చూపించారనే కామెంట్ మరో వర్గం నుంచి వినిపిస్తోంది. ప్రస్తుతానికి ఫైనల్ వెర్షన్ చూసిన బయట వాళ్ళు ఎవరూ లేకపోవడంతో ఇలాంటి విషయాల పట్ల స్పష్టత తక్కువగా ఉంది. చావా మహారాష్ట్ర యోధుడికి సంబంధించిన కథే అయినా భాషతో సంబంధం లేకుండా అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించే అద్భుత అంశాలు ఎన్నో ఇందులో ఉన్నాయని టీమ్ పేర్కొంటోంది.
ఏఆర్ రెహమాన్ సంగీతం సమకూర్చిన చావాను తెలుగులో కూడా డబ్బింగ్ చేస్తున్నారు. రష్మిక మందన్న ఇది చాలా పెద్ద బ్రేక్ అవుతుందనే నమ్మకంతో ఎదురు చూస్తోంది.
This post was last modified on January 25, 2025 1:10 pm
తమిళంలో కొన్నేళ్లుగా నంబర్ వన్ హీరోగా కొనసాగుతున్న విజయ్.. పూర్తి స్థాయి రాజకీయాల్లోకి అడుగు పెట్టి, ఎన్నికల బరిలోకి దిగే…
తీవ్ర ఉద్రిక్తతల నడుమ వైసీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబును పోలీసులు అరెస్ట్ చేశారు. అంబటి రాంబాబు వివాదాస్పద…
న్యూజిలాండ్తో జరిగిన ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్ను భారత్ ఘనంగా ముగించింది. శనివారం జరిగిన ఆఖరిదైన ఐదో టీ20లో టీమిండియా…
తిరుపతి లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వాడకం వ్యవహారం సద్దుమణగక ముందే ఏపీ సీఎం చంద్రబాబును అంబటి రాంబాబు దుర్భాషలాడిన…
ఫోన్ ట్యాపింగ్ కేసులో నంది నగర్ లోని కేసీఆర్ నివాసంలోనే విచారణ జరుపుతామని సిట్ అధికారులు రెండోసారి కేసీఆర్ కు…
ఈ ఏడాది మార్చి-ఏప్రిల్ మధ్య జరిగే తెలుగు సంవత్సరాది ఉగాది పర్వదినానికి భారీ ప్రకటన చేసేందుకు ఏపీ మంత్రి నారా…