వచ్చే నెల ఫిబ్రవరి 14 విడుదల కాబోతున్న చావా మీదున్న అంచనాలు ట్రైలర్ వచ్చాక రెట్టింపయ్యాయి. విక్కీ కౌశల్ టైటిల్ రోల్ పోషిస్తున్న ఈ హిస్టారికల్ డ్రామాలో రష్మిక మందన్న మహారాణి యేసుబాయ్ గా కీలకమైన పాత్ర దక్కించుకుంది. ఇది పోషించాక రిటైర్ అయిపోయినా పర్వాలేదనిపించిందని చెప్పడం చూస్తే క్యారెక్టర్ తనకు ఎంత స్కోప్ దక్కిందో అర్థం చేసుకోవచ్చు.
అయితే రిలీజ్ కు ఇరవై రోజులు కూడా సమయం లేని పరిస్థితిలో మెల్లగా వివాదాలు చుట్టుముట్టేలా ఉన్నాయి. వాయిదా పడటం లాంటివి జరగకపోవచ్చు కానీ కొన్ని కాంట్రావర్సిలు ఎదురుకునేందుకు టీమ్ సిద్ధం కావాల్సి రావొచ్చు.
చావా చిత్రం ఛత్రపతి శంభాజీ మహారాజ్ జీవిత కథ. మరాఠి సామ్రాజ్యంలో ఆయన వీరోచిత గాథలు ఎన్నో స్ఫూర్తిగా నిలిచాయి. ఆ వంశం వారసులు ఈ సినిమాను చరిత్రకారులకు చూపించి ఏవైనా తప్పులు ఉంటే సరిదిద్దుకోమని అడుగుతున్నారు. రాజ్యసభ ఎంపీ శంబిరాజే ఛత్రపతి దీని గురించి ప్రత్యేకంగా ప్రస్తావిస్తున్నారు.
ట్రైలర్ లో శంభాజీ, యేసుబాయ్ లెజిమ్ అనే సాంప్రదాయ సంగీత వాయిద్యాన్ని వాడినట్టు, నృత్యం చేసినట్టు చిత్రీకరణ చేశారని, కానీ క్రియేటివ్ లిబర్టీ పేరుతో జరగనివి చూపించడం గురించి ఒకసారి చెక్ చేసుకోమని దర్శకుడు లక్ష్మణ్ ఉతేకర్ కు సూచించారట.
ఇదొక్కటే కాదు ఔరంగజేబు దుర్మార్గాలను ఎక్కువ చేసి చూపించారనే కామెంట్ మరో వర్గం నుంచి వినిపిస్తోంది. ప్రస్తుతానికి ఫైనల్ వెర్షన్ చూసిన బయట వాళ్ళు ఎవరూ లేకపోవడంతో ఇలాంటి విషయాల పట్ల స్పష్టత తక్కువగా ఉంది. చావా మహారాష్ట్ర యోధుడికి సంబంధించిన కథే అయినా భాషతో సంబంధం లేకుండా అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించే అద్భుత అంశాలు ఎన్నో ఇందులో ఉన్నాయని టీమ్ పేర్కొంటోంది.
ఏఆర్ రెహమాన్ సంగీతం సమకూర్చిన చావాను తెలుగులో కూడా డబ్బింగ్ చేస్తున్నారు. రష్మిక మందన్న ఇది చాలా పెద్ద బ్రేక్ అవుతుందనే నమ్మకంతో ఎదురు చూస్తోంది.
మొన్నామధ్య విడుదలైన యాక్షన్ కింగ్ అర్జున్ డబ్బింగ్ సినిమా 'బ్లాస్ట్ జోన్' తెలుగు రాష్ట్రాల్లో బాగానే ఆడింది. ప్రమోషన్లు పెద్దగా…
పవన్ కళ్యాణ్ స్వయంగా ట్విట్టర్ ఖాతాలో ఈ ఫొటోను పోస్ట్ చేశారు. ఈ ఫొటోలో పవన్ కళ్యాణ్తో పాటు కనిపిస్తున్నది…
సోషల్ మీడియాలో ఇప్పుడో టాపిక్ హాట్ డిస్కషన్ గా మారింది. హైదరాబాద్ కు చెందిన ఒక ప్రేక్షకుడు బుక్ మై…
ఏపీలో తీవ్ర చర్చనీయాంశంగా మారిన గాదె సాయికృష్ణ అదృశ్యం కేసులో ట్విస్టుల మీద ట్విస్టులు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటికే ఈ…
వైసీపీ కీలక నేత, మాజీ మంత్రి, కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం రెడ్డి ప్రస్తుతం వెంటిలేటర్ పై ఉన్నారు.…
శాకుంతలం విడుదలై డిజాస్టరైనప్పుడు దాని ఫలితానికి బాధ్యుడు దర్శకుడు గుణశేఖర్ అయినప్పటికీ టైటిల్ రోల్ పోషించిన సమంత కూడా విమర్శలను…