ఇటీవలే కల్ట్ క్లాసిక్ సత్య రీ రిలీజ్ సందర్భంగా దర్శకుడు రామ్ గోపాల్ వర్మ దానికొచ్చిన స్పందన చూసి తనకు జ్ఞానోదయం అయ్యిందని, ఇకపై నిజాయితీగా పని చేసి మంచి సినిమా తీస్తానని ప్రకటించడం అభిమానుల మధ్య చర్చకు దారి తీసింది. ట్వీట్ పెట్టిన ఇరవై నాలుగు గంటల్లోనే సిండికేట్ టైటిల్ తో ప్రాజెక్ట్ అనౌన్స్ చేయడం ఆశ్చర్యానికి గురి చేసింది.
అయితే ఇందులో బడా స్టార్లు భాగమవుతున్నారనే వార్త హాట్ టాపిక్ గా మారింది. వెంకటేష్, అమితాబ్ బచ్చన్, విజయ్ సేతుపతి లాంటి పెద్ద పేర్లు బయటికి రావడంతో ఇది నిజంగా సాధ్యమవుతుందా అనే అనుమానాలు తలెత్తతున్నాయి.
సంకల్పం ఎంత బలంగా ఉన్నా రామ్ గోపాల్ వర్మ మునుపటి మేజిక్ చేయగలడా అనేదే అసలు ప్రశ్న. వెంకటేష్ తో ఆయన తీసిన క్షణ క్షణం ఇప్పటికీ ఫ్యాన్స్ ప్రత్యేకంగా చెప్పుకుంటారు. ఆ తర్వాత ఈ కలయిక సాధ్యపడలేదు. అమితాబ్ బచ్చన్ కు సర్కార్ రూపంలో ఇచ్చిన బ్రేక్ చిన్నది కాదు.
తర్వాత ఫ్లాపులు పడినా కూడా బిగ్ బికి వర్మ మీద అభిమానం అలాగే ఉండిపోయింది. ఇక విజయ్ సేతుపతి సంగతి సరేసరి. కథ నచ్చితే ఇమేజ్ పక్కనపెట్టి మరీ విలన్ గా చేయడానికైనా సిద్ధపడతాడు. సో అడగాలే కానీ నో చెప్పే ఛాన్స్ ఉండదు. ఈ కాంబో నిజంగా కార్యరూపం దాలిస్తే శుభవార్తే.
కాకపోతే ఇదేమైనా పబ్లిసిటీ స్టంటా లేక సీరియస్ గానే ఆ దిశగా అడుగులు పడుతున్నాయా అనేది వేచి చూడాలి. గత కొన్ని సంవత్సరాలుగా వర్మ తీసిన సినిమాలు ఏదో ఒక వ్యక్తిగత ఎజెండా లేదా ప్రయోజనం కోసం తీసినవి. వీటిలో ఒక్కటి కూడా ఆడలేదు. మరో విషయం ఏంటంటే వర్మ తీసేవి డార్క్ మాఫియా డ్రామాలు.
సిండికేట్ టైటిల్ కూడా అదే సూచిస్తోంది. మరి ఎంటర్ టైన్మెంట్ తోనే ఎఫ్2, సంక్రాంతికి వస్తున్నాం లాంటి హిట్లు కొడుతున్న వెంకటేష్ తిరిగి జానర్ మారుస్తారా అనేది డౌటే. ప్రస్తుతానికి ఇదంతా ప్రచారం స్టేజిలోనే ఉంది కాబట్టి అఫీషియల్ గా చెప్పేదాకా ఏదీ నిర్ధారించలేం.
This post was last modified on January 25, 2025 11:02 am
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…
రాయ్పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…
కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…