Movie News

పుష్ప-3 ఐటెం సాంగ్‌ లో జాన్వీ కపూర్?

పుష్ప-2 ఇంకా థియేటర్లలోనే ఉంది. దీనికి కొనసాగింపుగా ‘పుష్ప-3’ తీయడానికి సినిమాలో చిన్న హింట్ అయితే ఇచ్చారు కానీ.. ఆ చిత్రం ఉంటుందో లేదో క్లారిటీ లేదు. దర్శకుడు సుకుమార్, హీరో అల్లు అర్జున్ సైతం ఈ విషయంలో ఏ నిర్ణయం తీసుకోలేదు. కానీ అప్పుడే ఈ సినిమాలో ఐటెం సాంగ్ గురించి మాట్లాడేస్తున్నాడు సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్.

‘పుష్ప-3’ సినిమా తీసి, అందులో ఐటెం సాంగ్ పెట్టేట్లయితే ఆ పాటకు జాన్వి కపూర్‌ను ఎంచుకుంటే బాగుంటుందని అతను అభిప్రాయపడ్డాడు. మామూలుగా దేవి తన పరిధిలో లేని ఇలాంటి విషయాల గురించి మాట్లాడడు కానీ.. పుష్ప-3 ఐటెం సాంగ్ విషయంలో మాత్రం తన అభిప్రాయాన్ని వెల్లడించాడు. ‘పుష్ప-2’లో ఐటెం సాంగ్ కోసం శ్రీలీలను ఎంచుకోవాలని సూచించింది కూడా తానే అంటూ అతను కొత్త విషయం కూడా బయటపెట్టాడు.

తన సినిమాల్లో ఐటెం సాంగ్స్ గురించి ఓ ఇంటర్వ్యూలో దేవి మాట్లాడుతూ.. ‘‘ఎంతోమంది స్టార్ హీరోయిన్లు తొలిసారిగా నా సినిమాల్లోనే ఐటెం సాంగ్స్ చేశారు. పూజా హెగ్డే, సమంత, శ్రీలీల, కాజల్ అగర్వాల్.. వీళ్లందరూ టాప్ రేంజిలో ఉన్నపుడే నా సినిమాల్లో ఐటెం సాంగ్స్ చేశారు. పుష్ప-3లో కిసిక్ సాంగ్‌లో ఎవరు నర్తించినా వాళ్లకు అంతర్జాతీయ స్థాయిలో పేరు వస్తుందని మాకు ముందే తెలుసు. శ్రీలీల అద్భుతమైన డ్యాన్సర్ కాబట్టి ఆమెను తీసుకుంటే బాగుంటుందని మేకర్స్‌కు నేనే చెప్పాను.

పుష్ప-3లో ఐటెం సాంగ్ ఎవరు చేయాలో దర్శక నిర్మాతలు తుది నిర్ణయం తీసుకుంటారు. పాటను బట్టి హీరోయిన్ని ఎంచుకుంటారు. ఐతే నా ఉద్దేశంలో జాన్వి కపూర్ అయితే బాగుంటుంది. ఆమె చేసిన కొన్ని పాటలు చూశాను. తను అద్భుతమైన డ్యాన్సర్. శ్రీదేవిలో ఉన్న గ్రేస్ తనలో ఉంది.

ఐటెం సాంగ్స్ హిట్ కావడానికి డ్యాన్స్ ముఖ్య కారణం. ఆమె అయితే పుష్ప-3 ఐటెం సాంగ్‌కు బాగుంటుందని అనుకుంటున్నా’’ అని దేవి చెప్పాడు. మరి సుకుమార్ పుష్ప-3 తీస్తే.. దేవి సలహాను అనుసరించి జాన్వికి ఛాన్స్ ఇస్తాడేమో చూడాలి.

Kumar

Recent Posts

మ్యూజిక్ చిచ్చు పెట్టిన ‘గాడ్ ఆఫ్ వార్’

తమిళ సినిమాల్లో చాలా ఏళ్ల నుంచి తిరుగులేని ఆధిపత్యం చలాయిస్తున్నాడు అనిరుధ్ రవిచందర్. అతడి హవా తమిళానికే పరిమితం కావట్లేదు…

7 minutes ago

ఎట్టకేలకు బూత్ స్థాయిపై జనసేన కన్ను

బూత్ స్థాయిలో బ‌లోపేతం అయ్యే దిశ‌గా జ‌న‌సేన క‌స‌ర‌త్తు షురూ చేసింది. ప్ర‌స్తుతం రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ నాయ‌కులు ఉన్న‌ప్ప‌టికీ..…

50 minutes ago

రాజధాని భూముల రచ్చలో నిజమేంటి..?

ఏపీ రాజధాని అమరావతిలో రైతుల భూములను వారి అనుమతి లేకుండానే కూటమి సర్కారు లాక్కుంటోందని శనివారం పెద్ద రచ్చే జరిగింది. రాజధాని నిర్మాణం కోసం తమ భూములను…

2 hours ago

నాగ‌వంశీ చెప్పింది నిజమే

లెనిన్ సినిమా ప్ర‌మోష‌న్ల‌లో హీరో అఖిల్ అక్కినేని గురించి ఒక ఇంట్రెస్టింగ్ కామెంట్ చేశాడు నిర్మాత‌ల్లో ఒక‌రైన నాగ‌వంశీ. లెనిన్…

8 hours ago

పిల్లలు వద్దనుకుంటే సంపదను వదులుకున్నట్టే: చంద్రబాబు

పిల్లలు సంప‌ద అని సీఎం చంద్ర‌బాబు మ‌రోసారి స్ప‌ష్టం చేశారు. తాను చెప్పిన మాటకే క‌ట్టుబ‌డి ఉన్నాన‌ని తెలిపారు. దీనిని…

8 hours ago

విషాదం మిగిల్చిన విహారం… తెలుగువారు మృతి

వియ‌త్నాంలో విహార యాత్ర‌కు వెళ్లిన భార‌తీయుల కుటుంబాల్లో విషాదం నెల‌కొంది. ఊహించ‌ని ప్ర‌మాదంలో చిక్కుకుని 15 మంది భార‌తీయులు మృతి…

8 hours ago