పుష్ప-2 ఇంకా థియేటర్లలోనే ఉంది. దీనికి కొనసాగింపుగా ‘పుష్ప-3’ తీయడానికి సినిమాలో చిన్న హింట్ అయితే ఇచ్చారు కానీ.. ఆ చిత్రం ఉంటుందో లేదో క్లారిటీ లేదు. దర్శకుడు సుకుమార్, హీరో అల్లు అర్జున్ సైతం ఈ విషయంలో ఏ నిర్ణయం తీసుకోలేదు. కానీ అప్పుడే ఈ సినిమాలో ఐటెం సాంగ్ గురించి మాట్లాడేస్తున్నాడు సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్.
‘పుష్ప-3’ సినిమా తీసి, అందులో ఐటెం సాంగ్ పెట్టేట్లయితే ఆ పాటకు జాన్వి కపూర్ను ఎంచుకుంటే బాగుంటుందని అతను అభిప్రాయపడ్డాడు. మామూలుగా దేవి తన పరిధిలో లేని ఇలాంటి విషయాల గురించి మాట్లాడడు కానీ.. పుష్ప-3 ఐటెం సాంగ్ విషయంలో మాత్రం తన అభిప్రాయాన్ని వెల్లడించాడు. ‘పుష్ప-2’లో ఐటెం సాంగ్ కోసం శ్రీలీలను ఎంచుకోవాలని సూచించింది కూడా తానే అంటూ అతను కొత్త విషయం కూడా బయటపెట్టాడు.
తన సినిమాల్లో ఐటెం సాంగ్స్ గురించి ఓ ఇంటర్వ్యూలో దేవి మాట్లాడుతూ.. ‘‘ఎంతోమంది స్టార్ హీరోయిన్లు తొలిసారిగా నా సినిమాల్లోనే ఐటెం సాంగ్స్ చేశారు. పూజా హెగ్డే, సమంత, శ్రీలీల, కాజల్ అగర్వాల్.. వీళ్లందరూ టాప్ రేంజిలో ఉన్నపుడే నా సినిమాల్లో ఐటెం సాంగ్స్ చేశారు. పుష్ప-3లో కిసిక్ సాంగ్లో ఎవరు నర్తించినా వాళ్లకు అంతర్జాతీయ స్థాయిలో పేరు వస్తుందని మాకు ముందే తెలుసు. శ్రీలీల అద్భుతమైన డ్యాన్సర్ కాబట్టి ఆమెను తీసుకుంటే బాగుంటుందని మేకర్స్కు నేనే చెప్పాను.
పుష్ప-3లో ఐటెం సాంగ్ ఎవరు చేయాలో దర్శక నిర్మాతలు తుది నిర్ణయం తీసుకుంటారు. పాటను బట్టి హీరోయిన్ని ఎంచుకుంటారు. ఐతే నా ఉద్దేశంలో జాన్వి కపూర్ అయితే బాగుంటుంది. ఆమె చేసిన కొన్ని పాటలు చూశాను. తను అద్భుతమైన డ్యాన్సర్. శ్రీదేవిలో ఉన్న గ్రేస్ తనలో ఉంది.
ఐటెం సాంగ్స్ హిట్ కావడానికి డ్యాన్స్ ముఖ్య కారణం. ఆమె అయితే పుష్ప-3 ఐటెం సాంగ్కు బాగుంటుందని అనుకుంటున్నా’’ అని దేవి చెప్పాడు. మరి సుకుమార్ పుష్ప-3 తీస్తే.. దేవి సలహాను అనుసరించి జాన్వికి ఛాన్స్ ఇస్తాడేమో చూడాలి.
This post was last modified on January 24, 2025 3:06 pm
ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలకు ముహూర్తం రెడీ అవుతోంది. ప్రభుత్వం వైపు నుంచి ఈ ఎన్నికలకు గ్రీన్ సిగ్నల్ వచ్చేసింది.…
వైసీపీ ఓటు బ్యాంకు స్థిరమేనా? ఆ పార్టీ చెబుతున్నట్టు 40 శాతం ఓటు బ్యాంకు వచ్చే ఎన్నికల వరకు అలానే…
జూన్ నుంచి టాలీవుడ్ బాక్సాఫీస్ కళకళలాడుతోంది. ఎలాంటి టికెట్ రేట్ల పెంపు పంచాయితీ లేకుండా ఉన్న ధరలతోనే ప్రతి ఒక్కరు…
విద్యార్థి ఉద్యమాలకు తెరదీసిన కాక్రోచ్ జనతా పార్టీ(సీజేపీ) నాయకులు, కార్యకర్తలకు తొలిసారి పరాభవం ఎదురైంది. ఇటీవల నీట్ ప్రశ్న పత్రం…
ఎలా కనుక్కున్నారో కానీ త్రివిక్రమ్ శ్రీనివాస్ గుంటూరు కారం సినిమాలో కుర్చీ మడతపెట్టి పాట కోసం క్యారెక్టర్ ఆర్టిస్టు పూర్ణతో కొన్ని…
హైదరాబాద్ నగరంలోని రాయదుర్గం భూముల్లో కొంత భాగాన్ని ప్రభుత్వం వేలం వేసింది. అయితే.. మునుపెన్నడూ లేని విధంగా కళ్లు చెదిరే…