యానిమల్, పుష్ప 2 ది రూల్ రూపంలో రెండు ఆల్ టైం బ్లాక్ బస్టర్లు ఖాతాలో వేసుకున్న రష్మిక మందన్న ఫిబ్రవరిలో చావాతో రాబోతోంది. విక్కీ కౌశల్ టైటిల్ రోల్ పోషించిన ఈ హిస్టారికల్ డ్రామాని తొలుత పుష్పకి పోటీగా రిలీజ్ చేద్దామనుకున్నారు కానీ తర్వాత నిర్ణయం మార్చుకుని రెండు నెలలు వాయిదా వేసుకున్నారు.
ఉత్తరాదిలో అందులోనూ ప్రత్యేకంగా మహారాష్ట్ర వైపు దేవుడిగా కొలిచే చతప్రతి శంభాజీ మహారాజ్ జీవిత కథ ఆధారంగా చావా రూపొందింది. లక్ష్మణ్ ఉతేకర్ దర్శకత్వంలో లెజెండరీ ఏఆర్ రెహమాన్ సంగీతం సమకూరుస్తుండటం అంచనాలు పెంచుతోంది. ఇక ఛాలెంజ్ ఎందుకన్నామో చూద్దాం.
చావాలో రష్మిక పోషిస్తున్న పాత్ర శంభాజీ భార్య మహారాణి యేసుబాయ్ బోన్సాలేది. 1730 సంవత్సరం దాకా ఈవిడ ప్రస్థానం సాగింది. మరాఠా సామ్రాజ్యపు మహారాణిగా యేసుబాయ్ వీరగాథలు ఎన్నో ప్రచారంలో ఉన్నాయి. రాజతంత్రాలు, యుద్దాలు, రాజకీయ వ్యూహాల్లో ఈవిడ మరాఠా సామ్రాజ్యానికి చేసిన సేవలు ఎనలేనివి.
శంభాజీ చనిపోయాక రాయగడ్ సంస్థానాన్ని కాపాడుకోవడానికి మొఘలులతో ఎనిమిది నెలల పాటు అలుపులేని యుద్ధం చేశారు. జైలులో చాలా సంవత్సరాలు మగ్గారు. ఆమె కొడుకే షాహు మహారాజ్. శంభాజీ పాలనలో భర్తతో కలిసి ఈవిడ వేసిన ముద్ర గురించి ఇప్పటికీ కథలుగా చెప్పుకుంటారు.
ఈ లెక్కన రష్మిక మందన్నకు దక్కింది ఆషామాషీ క్యారెక్టర్ కాదనే విషయం అర్థమైపోయిందిగా. బాలీవుడ్ లో గ్లామర్ టచ్ ఉన్నవి కాకుండా పెర్ఫార్మన్స్ డిమాండ్ చేసేవి కోరి ఎంచుకుంటున్న శ్రీవల్లికి దానికి తగ్గ ఫలితాలే దక్కుతున్నాయి. చావాలో నటనకు చాలా స్కోప్ దక్కిందని ఇన్ సైడ్ టాక్.
ఈ ఏడాది రష్మిక మందన్న జోరుగా ఉండబోవడం లేదు. హారర్ మూవీ తమలోనూ ఛాన్స్ కొట్టేసింది. త్వరలో తెలుగులో ది గర్ల్ ఫ్రెండ్ తో పలకరించనుంది. అన్నట్టు చావాలో తను పోషించిన యేసుబాయ్ పాత్రని గత ఏడాది మూడు సినిమాల్లో వేరేవాళ్లు చేశారు. వాళ్లకు దక్కని పేరు 2025లో రష్మిక సాధిస్తుందేమో చూడాలి.
This post was last modified on January 21, 2025 3:40 pm
దురంధర్.. చాలా ఏళ్ల తర్వాత భారతీయ సినిమాలో బాలీవుడ్ తలెత్తుకునేలా చేసిన సినిమా. గత ఏడాది ఛావా, సైయారా సినిమాలు…
తమిళంలో కొన్నేళ్లుగా నంబర్ వన్ హీరోగా కొనసాగుతున్న విజయ్.. పూర్తి స్థాయి రాజకీయాల్లోకి అడుగు పెట్టి, ఎన్నికల బరిలోకి దిగే…
తీవ్ర ఉద్రిక్తతల నడుమ వైసీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబును పోలీసులు అరెస్ట్ చేశారు. అంబటి రాంబాబు వివాదాస్పద…
న్యూజిలాండ్తో జరిగిన ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్ను భారత్ ఘనంగా ముగించింది. శనివారం జరిగిన ఆఖరిదైన ఐదో టీ20లో టీమిండియా…
తిరుపతి లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వాడకం వ్యవహారం సద్దుమణగక ముందే ఏపీ సీఎం చంద్రబాబును అంబటి రాంబాబు దుర్భాషలాడిన…
ఫోన్ ట్యాపింగ్ కేసులో నంది నగర్ లోని కేసీఆర్ నివాసంలోనే విచారణ జరుపుతామని సిట్ అధికారులు రెండోసారి కేసీఆర్ కు…