రాజమౌళి రికార్డులని దాటేసే స్థాయిలో పుష్ప 2 ది రూల్ తో ఆల్ టైం ఇండస్ట్రీ బ్లాక్ బస్టర్ సృష్టించిన దర్శకుడు సుకుమార్ త్వరలో పుత్రికోత్సాహాన్ని అనుభవించబోతున్నారు. ఆయన కూతురు సుకృతి వేణి బండ్రెడ్డి తెరంగేట్రం చేస్తున్న గాంధీ తాత చెట్టు ఫిబ్రవరి 24 థియేటర్లలో విడుదల కానుంది.
ఆయన సతీమణి సమర్పకురాలిగా వ్యవహరిస్తుండగా మైత్రి మూవీ మేకర్స్ పంపిణి బాధ్యతలు చూసుకుంటోంది. ఇవాళ నిర్వహించిన ఈవెంట్ లో నిర్మాత రవిశంకర్ ఒక ఆసక్తికరమైన విషయం చెప్పారు. అది కూడా పుష్ప 2కి ముడిపడింది కావడం గమనార్షం.
పుష్ప 95 శాతం ఆడియన్స్ కి బాగా నచ్చిందని అయితే క్యారెక్టరైజేషన్ గురించి కొంత నెగటివ్ గా ఫీలైన వాళ్ళు ఒక 5 శాతం ఉంటారని వాళ్లకు కూడా నచ్చేలా గాంధీ తాత చెట్టు అద్భుతంగా ఉంటుందని, అందరూ ఆదరించాలని కోరారు. రవిశంకర్ చెప్పిన దాంట్లో పాయింట్ ఉంది.
పుష్ప 2 సునామి కొనసాగుతున్న టైంలో కొందరు రాజకీయ నాయకులు హీరో పాత్ర గురించి విమర్శలు చేశారు. స్మగ్లింగ్ చేసే కథానాయకుడి ద్వారా ఏం సందేశం ఇస్తారని కామెంట్లు విసిరారు. సరే దాన్ని అంగీకరిస్తే మరి గాంధీ తాత చెట్టు లాంటి కంటెంట్ బేస్డ్ సినిమాలను ఖచ్చితంగా ఆదరించాలిగా.
సుకుమార్ జంట ఈ మూవీ పట్ల చాలా ఎమోషనల్ గా ఉన్నారు. ముఖ్యంగా తబిత స్టేజి మీద కన్నీళ్లు ఆపుకోలేకపోవడం దానికి నిదర్శనం. టీనేజ్ లో అడుగు పెడుతున్న అమ్మాయి జుత్తు తీయడానికి ఒప్పుకోదని అలాంటిది గాంధీ తాత్ చెట్టు కోసం త్యాగం చేసిందని చెబుతూ తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు.
సుకుమార్ వేదికపైకి వచ్చి ఓదార్చాకే మాములు మనిషయ్యారు. బలగం, కేరాఫ్ కంచెరపాలం తరహాలో హత్తుకునే కాన్సెప్ట్ తో వస్తున్న ఈ సినిమాకి ఆదరణ దక్కితే ఇలాంటి ప్రయత్నాలు మరిన్ని జరుగుతాయి. రిలీజ్ కు ముందే గాంధీ తాత చెట్టుకి పలు అవార్డులు దక్కడం విశేషం.
లెనిన్ సినిమా ప్రమోషన్లలో హీరో అఖిల్ అక్కినేని గురించి ఒక ఇంట్రెస్టింగ్ కామెంట్ చేశాడు నిర్మాతల్లో ఒకరైన నాగవంశీ. లెనిన్…
పిల్లలు సంపద అని సీఎం చంద్రబాబు మరోసారి స్పష్టం చేశారు. తాను చెప్పిన మాటకే కట్టుబడి ఉన్నానని తెలిపారు. దీనిని…
వియత్నాంలో విహార యాత్రకు వెళ్లిన భారతీయుల కుటుంబాల్లో విషాదం నెలకొంది. ఊహించని ప్రమాదంలో చిక్కుకుని 15 మంది భారతీయులు మృతి…
తన సినిమాకు పని చేసిన టెక్నీషియన్ను ఒక నిర్మాత సైకోగా అభివర్ణించడం ఎప్పుడైనా చూశారా? సితార ఎంటర్టైన్మెంట్స్ అధినేత నాగవంశీ…
శుక్రవారం విడుదలైన లెనిన్ దూకుడు బాక్సాఫీస్ వద్ద కొనసాగుతోంది. తొలి రోజు పదమూడు కోట్లకు పైగా వసూలు చేసి శని…
ఏపీ రాజధాని అమరావతిలో శనివారం తెల్లవారు జాము నుంచి పోలీసులు అధికారులు పెద్ద ఎత్తున మోహరించారు. ఈ ప్రాంతంలో రాజధాని…