Movie News

పుష్ప నచ్చనివాళ్ళకు గాంధీ తాత చెట్టు

రాజమౌళి రికార్డులని దాటేసే స్థాయిలో పుష్ప 2 ది రూల్ తో ఆల్ టైం ఇండస్ట్రీ బ్లాక్ బస్టర్ సృష్టించిన దర్శకుడు సుకుమార్ త్వరలో పుత్రికోత్సాహాన్ని అనుభవించబోతున్నారు. ఆయన కూతురు సుకృతి వేణి బండ్రెడ్డి తెరంగేట్రం చేస్తున్న గాంధీ తాత చెట్టు ఫిబ్రవరి 24 థియేటర్లలో విడుదల కానుంది.

ఆయన సతీమణి సమర్పకురాలిగా వ్యవహరిస్తుండగా మైత్రి మూవీ మేకర్స్ పంపిణి బాధ్యతలు చూసుకుంటోంది. ఇవాళ నిర్వహించిన ఈవెంట్ లో నిర్మాత రవిశంకర్ ఒక ఆసక్తికరమైన విషయం చెప్పారు. అది కూడా పుష్ప 2కి ముడిపడింది కావడం గమనార్షం.

పుష్ప 95 శాతం ఆడియన్స్ కి బాగా నచ్చిందని అయితే క్యారెక్టరైజేషన్ గురించి కొంత నెగటివ్ గా ఫీలైన వాళ్ళు ఒక 5 శాతం ఉంటారని వాళ్లకు కూడా నచ్చేలా గాంధీ తాత చెట్టు అద్భుతంగా ఉంటుందని, అందరూ ఆదరించాలని కోరారు. రవిశంకర్ చెప్పిన దాంట్లో పాయింట్ ఉంది.

పుష్ప 2 సునామి కొనసాగుతున్న టైంలో కొందరు రాజకీయ నాయకులు హీరో పాత్ర గురించి విమర్శలు చేశారు. స్మగ్లింగ్ చేసే కథానాయకుడి ద్వారా ఏం సందేశం ఇస్తారని కామెంట్లు విసిరారు. సరే దాన్ని అంగీకరిస్తే మరి గాంధీ తాత చెట్టు లాంటి కంటెంట్ బేస్డ్ సినిమాలను ఖచ్చితంగా ఆదరించాలిగా.

సుకుమార్ జంట ఈ మూవీ పట్ల చాలా ఎమోషనల్ గా ఉన్నారు. ముఖ్యంగా తబిత స్టేజి మీద కన్నీళ్లు ఆపుకోలేకపోవడం దానికి నిదర్శనం. టీనేజ్ లో అడుగు పెడుతున్న అమ్మాయి జుత్తు తీయడానికి ఒప్పుకోదని అలాంటిది గాంధీ తాత్ చెట్టు కోసం త్యాగం చేసిందని చెబుతూ తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు.

సుకుమార్ వేదికపైకి వచ్చి ఓదార్చాకే మాములు మనిషయ్యారు. బలగం, కేరాఫ్ కంచెరపాలం తరహాలో హత్తుకునే కాన్సెప్ట్ తో వస్తున్న ఈ సినిమాకి ఆదరణ దక్కితే ఇలాంటి ప్రయత్నాలు మరిన్ని జరుగుతాయి. రిలీజ్ కు ముందే గాంధీ తాత చెట్టుకి పలు అవార్డులు దక్కడం విశేషం.

This post was last modified on January 16, 2025 8:55 pm

Share
Show comments
Published by
Kumar

Recent Posts

నిన్న బాబు – నేడు పవన్!!

పార్టీ పటిష్టంగా ఉండాలన్నా, ప్రజలకు పారదర్శకంగా సంక్షేమ పథకాలు అందాలన్నా ఆ పార్టీ ప్రజా ప్రతినిధులే కీలకం. రాజకీయాల్లో ఈ…

8 minutes ago

ఐమాక్స్ వస్తే మన పరిస్తితి కూడా ఇంతేనా?

దేశంలో అత్యధిక సినీ అభిమానం ఉన్న ప్రేక్షకులుగా తెలుగు ఆడియన్సుకి పేరుంది. తెలుగు రాష్ట్రాలు రెంటినీ కలిపి ఒక యూనిట్…

2 hours ago

పవన్ చొరవతో తెలంగాణ ఆలయానికి రూ.30 కోట్లు?

జగిత్యాల జిల్లాలోని ప్రసిద్ధ కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయ అభివృద్ధికి తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) రూ.30 కోట్ల నిధులను…

3 hours ago

గల్లి సమస్యను సైతం వదలని లోకేష్!

అటు ఢిల్లీలో కేంద్ర మంత్రులను కలిసి ఏపీకి నిధులు మంజూరు అయ్యేలా ప్రయత్నాలు చేస్తుంటారు. ఇటు తన శాఖలను సమర్థవంతంగా…

4 hours ago

చరణ్ రాకతో పెరిగిన ఛాంపియన్ మైలేజ్

నిన్న జరిగిన ఛాంపియన్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కు రామ్ చరణ్ ముఖ్యఅతిధిగా రావడం హైప్ పరంగా దానికి మంచి…

4 hours ago

రుషికొండ పంచాయతీ… కొలిక్కి వచ్చినట్టేనా?

వైసీపీ హ‌యాంలో విశాఖ‌ప‌ట్నంలోని ప్ర‌ఖ్యాత ప‌ర్యాట‌క ప్రాంతం రుషికొండ‌ను తొలిచి.. నిర్మించిన భారీ భ‌వ‌నాల వ్య‌వ‌హారం కొలిక్కి వ‌స్తున్న‌ట్టు ప్ర‌భుత్వ…

5 hours ago