టాలీవుడ్ హీరోల లిస్టు తీస్తే అందులో 70-80 శాతం వారసులే కనిపిస్తారు. ఒకప్పుడు కేవలం హీరోల కొడుకులు మాత్రమే హీరోలయ్యేవారు. కానీ గత కొన్నేళ్లలో క్యారెక్టర్ల్ ఆర్టిస్టులు, కమెడియన్లు, టెక్నీషియన్లు, నిర్మాతల కొడుకులు కూడా పెద్ద సంఖ్యలో హీరోలయ్యారు. చాలామంది తమకంటూ మార్కెట్ కూడా క్రియేట్ చేసుకున్నారు. కానీ దశాబ్దం కిందట్నుంచి పోరాడుతున్నప్పటికీ లెజెండరీ కమెడియన్ బ్రహ్మానందం తనయుడు గౌతమ్ మాత్రం హీరోగా నిలదొక్కుకోలేకపోతున్నాడ.
అతను పేరున్న దర్శకులు, నిర్మాతలతో పని చేయకపోవడం మైనస్ అనే అభిప్రాయాలున్నాయి. మరి బ్రహ్మి.. తనకున్న పరిచయాలతో మంచి ప్రాజెక్ట్ ఎందుకు సెట్ చేయలేకపోతున్నాడు అని సందేహం కలగడం సహజం. ఇదే ప్రశ్న తన కొడుకుతో కలిసి నటించిన బ్రహ్మానందం టీజర్ లాంచ్ కార్యక్రమం సందర్భంగా బ్రహ్మికి ఎదురైంది. దానికి ఆయన ఆసక్తికర సమాధానం చెప్పారు.
”మీరు నా కొడుకు కోసం ఇండస్ట్రీని ఎందుకు వాడుకోలేదు అని అడుగుతున్నారు. కానీ నా కొడుకు సంగతి పక్కన పెడితే నన్నే నేను సరిగా ఉపయోగించుకోలేకపోయాను అనుకుంటాను. ఇన్నేళ్ల కెరీర్లో నేను ఎవరినీ ఒక పాత్ర కావాలని అడిగింది లేదు. అలా అని అది నా గొప్పదనం అంటే అహంకారమే అవుతుంది. అలా అడగాల్సిన అవసరం రాని స్థితిలో నేనుండడం నా అదృష్టం. నేను అన్నింటటికంటే విధిని ఎక్కువ నమ్ముతాను.
ఎవరికి ఏం జరగాలన్నది ముందే రాసిపెట్టి ఉంటుంది. జరగాలంటే జరుగుతుంది. లేదంటే లేదు. మనం నిమిత్త మాత్రులం. గౌతమ్ విషయానికి వస్తే.. గోదావరి సినిమాలో అతను హీరోగా నటించాల్సింది. శేఖర్ కమ్ముల మా ఆవిడకు మేనల్లుడే. గోదావరి సినిమాలో నటించమని అడిగితే.. అది హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాలా ఉందని, తనకు అంతగా పేరు రాకపోవచ్చని భావించి అది చేయలేదు.
నేనీ మాట ఇంతకుముందు ఎవరికీ చెప్పలేదు. చెబితే శేఖర్ కమ్ముల సినిమాకే నో చెప్పేంతటి వాడా అని అంటారు. అందుకే నేను ఏదైనా విధిని అనుసరించే జరుగుతుందని నమ్ముతాను” అని బ్రహ్మి అన్నాడు.
ఇండస్ట్రీలో హీరోయిన్ల కెరీర్ కు ఒక ఎక్స్ పైరీ డేట్ ఉంటుందనేది ఎప్పటినుంచో వినిపించే మాటే. పాతికేళ్ల నుంచి ముప్పై…
మహారాష్ట్ర ముఖ్యమంత్రి, బీజేపీ సీనియర్ నాయకుడు దేవేంద్ర ఫడణవీస్తో ఏపీ మంత్రి, టీడీపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్…
విజయవాడ పెద్ది ప్రీ రిలీజ్ ఈవెంట్ ఘనంగా ముగిసింది. ఏర్పాట్ల దగ్గరి నుంచి అయిపోయే దాకా ఎక్కడా అపశ్రుతి లేకుండా…
తెలంగాణ నాయకురాలు, తెలంగాణ రక్షణ సేన(టీఆర్ఎస్) పార్టీ అధ్యక్షురాలు కవిత తాజాగా చేసిన వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున…
పెద్ది నుంచి ఏదైనా బ్యాంగర్ లాంటి కంటెంట్ కావాలని ఎదురు చూస్తున్న అభిమానులకు అది మస్సా మస్సా వీడియో సాంగ్…
ఏపీ సీఎం చంద్రబాబు.. తాజాగా కల్లు రుచి చూశారు. వాస్తవానికి ఆయన ఇలాంటి వాటికి కడు దూరంగా ఉంటారు. అయితే..…