టాలీవుడ్ హీరోల లిస్టు తీస్తే అందులో 70-80 శాతం వారసులే కనిపిస్తారు. ఒకప్పుడు కేవలం హీరోల కొడుకులు మాత్రమే హీరోలయ్యేవారు. కానీ గత కొన్నేళ్లలో క్యారెక్టర్ల్ ఆర్టిస్టులు, కమెడియన్లు, టెక్నీషియన్లు, నిర్మాతల కొడుకులు కూడా పెద్ద సంఖ్యలో హీరోలయ్యారు. చాలామంది తమకంటూ మార్కెట్ కూడా క్రియేట్ చేసుకున్నారు. కానీ దశాబ్దం కిందట్నుంచి పోరాడుతున్నప్పటికీ లెజెండరీ కమెడియన్ బ్రహ్మానందం తనయుడు గౌతమ్ మాత్రం హీరోగా నిలదొక్కుకోలేకపోతున్నాడ.
అతను పేరున్న దర్శకులు, నిర్మాతలతో పని చేయకపోవడం మైనస్ అనే అభిప్రాయాలున్నాయి. మరి బ్రహ్మి.. తనకున్న పరిచయాలతో మంచి ప్రాజెక్ట్ ఎందుకు సెట్ చేయలేకపోతున్నాడు అని సందేహం కలగడం సహజం. ఇదే ప్రశ్న తన కొడుకుతో కలిసి నటించిన బ్రహ్మానందం టీజర్ లాంచ్ కార్యక్రమం సందర్భంగా బ్రహ్మికి ఎదురైంది. దానికి ఆయన ఆసక్తికర సమాధానం చెప్పారు.
”మీరు నా కొడుకు కోసం ఇండస్ట్రీని ఎందుకు వాడుకోలేదు అని అడుగుతున్నారు. కానీ నా కొడుకు సంగతి పక్కన పెడితే నన్నే నేను సరిగా ఉపయోగించుకోలేకపోయాను అనుకుంటాను. ఇన్నేళ్ల కెరీర్లో నేను ఎవరినీ ఒక పాత్ర కావాలని అడిగింది లేదు. అలా అని అది నా గొప్పదనం అంటే అహంకారమే అవుతుంది. అలా అడగాల్సిన అవసరం రాని స్థితిలో నేనుండడం నా అదృష్టం. నేను అన్నింటటికంటే విధిని ఎక్కువ నమ్ముతాను.
ఎవరికి ఏం జరగాలన్నది ముందే రాసిపెట్టి ఉంటుంది. జరగాలంటే జరుగుతుంది. లేదంటే లేదు. మనం నిమిత్త మాత్రులం. గౌతమ్ విషయానికి వస్తే.. గోదావరి సినిమాలో అతను హీరోగా నటించాల్సింది. శేఖర్ కమ్ముల మా ఆవిడకు మేనల్లుడే. గోదావరి సినిమాలో నటించమని అడిగితే.. అది హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాలా ఉందని, తనకు అంతగా పేరు రాకపోవచ్చని భావించి అది చేయలేదు.
నేనీ మాట ఇంతకుముందు ఎవరికీ చెప్పలేదు. చెబితే శేఖర్ కమ్ముల సినిమాకే నో చెప్పేంతటి వాడా అని అంటారు. అందుకే నేను ఏదైనా విధిని అనుసరించే జరుగుతుందని నమ్ముతాను” అని బ్రహ్మి అన్నాడు.
This post was last modified on January 16, 2025 8:24 pm
ఒకప్పటి డిజాస్టర్లు ఇప్పుడు రీ రిలీజ్ ట్రెండ్ లో బాగా ఆడటం గమనిస్తున్నాం. ఆరెంజ్ మూడుసార్లు వచ్చినా కలెక్షన్లు కుమ్మరించింది.…
టాలీవుడ్లో ఘన చరిత్ర ఉన్న బేనర్లో లక్ష్మీప్రసన్న పిక్చర్స్ ఒకటి. ఈ బేనర్ మీద పదుల సంఖ్యలో సినిమాలు తీశారు…
‘యమదొంగ’ చిత్రంతో టాలీవుడ్లోకి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చింది మలయాళ భామ మమతా మోహన్ దాస్. ఆ చిత్రంలో చలాకీ పాత్ర…
ఇరు తెలుగు రాష్ట్రాలకు చెందిన రాజకీయ నాయకుల్లో చాలామంది పెద్దగా భావోద్వేగాలకు లోను కారు. మిన్ను విరిగి మీద పడ్డా…ఎన్నికల…
మన శంకరవరప్రసాద్ గారు రూపంలో చిరంజీవికి బ్లాక్ బస్టర్ కానుక ఇచ్చి రెమ్యునరేషన్ తో పాటు రేంజ్ రోవర్ కారు…
24 ఏళ్ల కిందట ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే కాక దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అయిన నటి ప్రత్యూష మృతి వ్యవహారంలో సుప్రీం కోర్టు…