టాలీవుడ్ హీరోల లిస్టు తీస్తే అందులో 70-80 శాతం వారసులే కనిపిస్తారు. ఒకప్పుడు కేవలం హీరోల కొడుకులు మాత్రమే హీరోలయ్యేవారు. కానీ గత కొన్నేళ్లలో క్యారెక్టర్ల్ ఆర్టిస్టులు, కమెడియన్లు, టెక్నీషియన్లు, నిర్మాతల కొడుకులు కూడా పెద్ద సంఖ్యలో హీరోలయ్యారు. చాలామంది తమకంటూ మార్కెట్ కూడా క్రియేట్ చేసుకున్నారు. కానీ దశాబ్దం కిందట్నుంచి పోరాడుతున్నప్పటికీ లెజెండరీ కమెడియన్ బ్రహ్మానందం తనయుడు గౌతమ్ మాత్రం హీరోగా నిలదొక్కుకోలేకపోతున్నాడ.
అతను పేరున్న దర్శకులు, నిర్మాతలతో పని చేయకపోవడం మైనస్ అనే అభిప్రాయాలున్నాయి. మరి బ్రహ్మి.. తనకున్న పరిచయాలతో మంచి ప్రాజెక్ట్ ఎందుకు సెట్ చేయలేకపోతున్నాడు అని సందేహం కలగడం సహజం. ఇదే ప్రశ్న తన కొడుకుతో కలిసి నటించిన బ్రహ్మానందం టీజర్ లాంచ్ కార్యక్రమం సందర్భంగా బ్రహ్మికి ఎదురైంది. దానికి ఆయన ఆసక్తికర సమాధానం చెప్పారు.
”మీరు నా కొడుకు కోసం ఇండస్ట్రీని ఎందుకు వాడుకోలేదు అని అడుగుతున్నారు. కానీ నా కొడుకు సంగతి పక్కన పెడితే నన్నే నేను సరిగా ఉపయోగించుకోలేకపోయాను అనుకుంటాను. ఇన్నేళ్ల కెరీర్లో నేను ఎవరినీ ఒక పాత్ర కావాలని అడిగింది లేదు. అలా అని అది నా గొప్పదనం అంటే అహంకారమే అవుతుంది. అలా అడగాల్సిన అవసరం రాని స్థితిలో నేనుండడం నా అదృష్టం. నేను అన్నింటటికంటే విధిని ఎక్కువ నమ్ముతాను.
ఎవరికి ఏం జరగాలన్నది ముందే రాసిపెట్టి ఉంటుంది. జరగాలంటే జరుగుతుంది. లేదంటే లేదు. మనం నిమిత్త మాత్రులం. గౌతమ్ విషయానికి వస్తే.. గోదావరి సినిమాలో అతను హీరోగా నటించాల్సింది. శేఖర్ కమ్ముల మా ఆవిడకు మేనల్లుడే. గోదావరి సినిమాలో నటించమని అడిగితే.. అది హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాలా ఉందని, తనకు అంతగా పేరు రాకపోవచ్చని భావించి అది చేయలేదు.
నేనీ మాట ఇంతకుముందు ఎవరికీ చెప్పలేదు. చెబితే శేఖర్ కమ్ముల సినిమాకే నో చెప్పేంతటి వాడా అని అంటారు. అందుకే నేను ఏదైనా విధిని అనుసరించే జరుగుతుందని నమ్ముతాను” అని బ్రహ్మి అన్నాడు.
This post was last modified on January 16, 2025 8:24 pm
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…
రాయ్పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…
కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…