టాలీవుడ్ హీరోల లిస్టు తీస్తే అందులో 70-80 శాతం వారసులే కనిపిస్తారు. ఒకప్పుడు కేవలం హీరోల కొడుకులు మాత్రమే హీరోలయ్యేవారు. కానీ గత కొన్నేళ్లలో క్యారెక్టర్ల్ ఆర్టిస్టులు, కమెడియన్లు, టెక్నీషియన్లు, నిర్మాతల కొడుకులు కూడా పెద్ద సంఖ్యలో హీరోలయ్యారు. చాలామంది తమకంటూ మార్కెట్ కూడా క్రియేట్ చేసుకున్నారు. కానీ దశాబ్దం కిందట్నుంచి పోరాడుతున్నప్పటికీ లెజెండరీ కమెడియన్ బ్రహ్మానందం తనయుడు గౌతమ్ మాత్రం హీరోగా నిలదొక్కుకోలేకపోతున్నాడ.
అతను పేరున్న దర్శకులు, నిర్మాతలతో పని చేయకపోవడం మైనస్ అనే అభిప్రాయాలున్నాయి. మరి బ్రహ్మి.. తనకున్న పరిచయాలతో మంచి ప్రాజెక్ట్ ఎందుకు సెట్ చేయలేకపోతున్నాడు అని సందేహం కలగడం సహజం. ఇదే ప్రశ్న తన కొడుకుతో కలిసి నటించిన బ్రహ్మానందం టీజర్ లాంచ్ కార్యక్రమం సందర్భంగా బ్రహ్మికి ఎదురైంది. దానికి ఆయన ఆసక్తికర సమాధానం చెప్పారు.
”మీరు నా కొడుకు కోసం ఇండస్ట్రీని ఎందుకు వాడుకోలేదు అని అడుగుతున్నారు. కానీ నా కొడుకు సంగతి పక్కన పెడితే నన్నే నేను సరిగా ఉపయోగించుకోలేకపోయాను అనుకుంటాను. ఇన్నేళ్ల కెరీర్లో నేను ఎవరినీ ఒక పాత్ర కావాలని అడిగింది లేదు. అలా అని అది నా గొప్పదనం అంటే అహంకారమే అవుతుంది. అలా అడగాల్సిన అవసరం రాని స్థితిలో నేనుండడం నా అదృష్టం. నేను అన్నింటటికంటే విధిని ఎక్కువ నమ్ముతాను.
ఎవరికి ఏం జరగాలన్నది ముందే రాసిపెట్టి ఉంటుంది. జరగాలంటే జరుగుతుంది. లేదంటే లేదు. మనం నిమిత్త మాత్రులం. గౌతమ్ విషయానికి వస్తే.. గోదావరి సినిమాలో అతను హీరోగా నటించాల్సింది. శేఖర్ కమ్ముల మా ఆవిడకు మేనల్లుడే. గోదావరి సినిమాలో నటించమని అడిగితే.. అది హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాలా ఉందని, తనకు అంతగా పేరు రాకపోవచ్చని భావించి అది చేయలేదు.
నేనీ మాట ఇంతకుముందు ఎవరికీ చెప్పలేదు. చెబితే శేఖర్ కమ్ముల సినిమాకే నో చెప్పేంతటి వాడా అని అంటారు. అందుకే నేను ఏదైనా విధిని అనుసరించే జరుగుతుందని నమ్ముతాను” అని బ్రహ్మి అన్నాడు.
ఏపీలో కూటమిగా ఏర్పడి.. అధికారాన్ని పంచుకుంటున్న బీజేపీ.. గత రెండేళ్ల కాలంలో ఎప్పుడూ.. పెదవి విప్పి.. కూటమి ప్రభుత్వం సాధించిన…
ఇప్పుడు వరల్డ్ నంబర్ వన్ డైరెక్టర్ ఎవరు అంటే మరో మాట లేకుండా క్రిస్టోఫర్ నోలన్ పేరు చెప్పేస్తారు ఆడియన్స్.…
అనుకున్నట్టే ఫౌజీ విడుదల తేదీ డిసెంబర్ 3 లాకైపోయింది. ఇది రెండు వారాల క్రితమే లీకైన న్యూస్ అయినప్పటికీ ఫైనల్…
ప్రపంచవ్యాప్తంగా ఐమాక్స్ కున్న క్రేజ్ తెలిసిందే. తెలుగు రాష్ట్రాల్లో లేదన్న మాటే కానీ పదిహేను సంవత్సరాల క్రితం ప్రసాద్ మల్టీప్లెక్స్…
భారతదేశానికి గర్వకారణమైన ఇస్రో లో ఇప్పుడు ఊహించని పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ప్రతిష్టాత్మక ప్రాజెక్టుల్లో పనిచేస్తున్న శాస్త్రవేత్తలు వరుసగా తమ ఉద్యోగాలకు…
గత శుక్రవారం ఒక మోస్తరు అంచనాల మధ్య విడుదలైన అక్కినేని అఖిల్ సినిమా ‘లెనిన్’ తొలి వీకెండ్లో ఆ అంచనాలను…