పదేళ్ల ముందు బాహుబలి ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ రికార్డులన్నింటినీ బద్దలు కొట్టేసినపుడు తెలుగు సినీ ప్రియులు ఎంతగానో సంబరాలు చేసుకున్నారు. తెలుగు ఫిలిం ఇండస్ట్రీ ఆ సక్సెస్ను ఎంతగా ఓన్ చేసుకుంది. అందరు హీరోల అభిమానులు కూడా ఏ భేదాలు లేకుండా ఆ సినిమా విజయాన్ని ఆస్వాదించారు. బాహుబలిని ప్రైడ్ ఆఫ్ తెలుగు సినిమాగా ఫీలయ్యారు.
బాహుబలి-2 దీన్ని మించి సక్సెస్ అయినపుడు కూడా అందరిదీ అదే ఫీలింగ్. ఇది తెలుగు సినిమా అని గర్వంగా చెప్పుకున్నారు. ఆర్ఆర్ఆర్ సినిమా అంతర్జాతీయ స్థాయిలో సంచలనం రేపి, లెెజెండరీ హాలీవుడ్ ఫిలిం మేకర్ల ప్రశంసలు అందుకున్నపుడు.. రెండు ఆస్కార్ అవార్డులు గెలిచినపుడు కూడా ఆ ఘనతల గురించి మెజారిటీ తెలుగు వాళ్లు గర్వంగా చెప్పుకున్న వాళ్లే. కానీ ఇప్పుడు ‘పుష్ప-2’ సక్సెస్ విషయంలో మాత్రం ఈ పరిస్థితి లేకపోవడం ఒకింత ఆశ్చర్యం కలిగించే విషయం.
పుష్ప-2 తాజాగా ‘బాహుబలి-2’ వసూళ్లను దాటి ఆల్ టైం ఇండియన్ ఇండస్ట్రీ హిట్గా నిలిచినట్లు నిర్మాతలు ప్రకటించారు. కానీ ఇంత పెద్ద విజయాన్ని ఇటు ఇండస్ట్రీ కానీ.. అటు అభిమానులు కానీ సెలబ్రేట్ చేసే పరిస్థితి లేదు. సంధ్య థియేటర్ ఘటన వల్ల ‘పుష్ప-2’ టీమే తమ సినిమా సాధిస్తున్న ఏ ఘనతనూ సెలబ్రేట్ చేసే పరిస్థితి లేకపోయింది. మరోవైపు అల్లు అర్జున్ అరెస్టు తదనంతర పరిణామాలతో ఇండస్ట్రీ కూడా ఈ సినిమా విషయంలో వ్యూహాత్మక మౌనం పాటిస్తోంది.
సెలబ్రేషన్స్ లేకపోయినా.. పుష్ప-2 సాధించిన ఘనత గురించి ఎవరూ మాట్లాడట్లేదు. అల్లు అర్జున్ మీద కొన్ని కారణాల వల్ల పెరిగిన నెగెటివిటీ వల్లో.. లేదంటే ఉత్తరాదిన మాత్రం ఇరగాడేసి, తెలుగు రాష్ట్రాల్లో కొంత వరకు అండర్ పెర్ఫామ్ చేయడం వల్లో.. ఇలా పుష్ప-2 ఘనత గురించి ఎవరూ గొప్పగా మాట్లాడకపోవడానికి కారణాలు అయితే చాలానే కనిపిస్తున్నాయి.
ఏదేమైనా ఇంత పెద్ద సక్సెస్ సాధించి కూడా ఇటు పుష్ప-2 టీం కానీ.. అటు ఇండస్ట్రీ కానీ.. మరోవైపు అభిమానులు కానీ.. ఈ ఘనత గురించి మాట్లాడకపోవడం.. సెలబ్రేషన్స్ లేకపోవడం మాత్రం విచారించాల్సిన విషయమే.
This post was last modified on January 7, 2025 12:40 pm
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…
రాయ్పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…
కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…