గేమ్ చేంజర్ సినిమా విడుదలకు ఇంకో నాలుగు రోజులే సమయం ఉండగా.. టీం మీద పెద్ద బాంబు వేయాలని చూసింది తమిళ అగ్ర నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్. తమ సంస్థలో శంకర్ రూపొందిస్తున్న ‘ఇండియన్-3’ పూర్తి కాకుండా ‘గేమ్ చేంజర్’ చిత్రాన్ని తమిళనాట విడుదల చేయడానికి వీల్లేదంటూ.. తమిళ నిర్మాతల మండలిని ఆశ్రయించింది లైకా సంస్థ.
దీంతో ‘గేమ్ చేంజర్’ తమిళ రిలీజ్ ఆగిపోతున్నట్లు.. తమిళ నిర్మాతల మండలి ఈ సినిమా టీంకు నోటీస్ ఇచ్చినట్లు వార్తలు వచ్చాయి. దీంతో ఒక్కసారిగా మెగా అభిమానులు లైకా ప్రొడక్షన్స్ సంస్థ మీద భగ్గుమన్నారు. ‘ఇండియన్-2’ ఆల్రెడీ గత ఏడాది విడుదలై పెద్ద డిజాస్టర్ అయింది. ఈ నేపథ్యంలో ‘ఇండియన్-3’ మీద ఎవ్వరికీ ఆశలు లేవు.
మరోవైపు ‘ఇండియన్-2’, ‘ఇండియన్-3’ సినిమాల వల్ల ‘గేమ్ చేంజర్’ చాలా ఆలస్యం అయింది. నిర్మాతకు చాలా నష్టం వాటిల్లింది. ‘గేమ్ చేంజర్’ను కొన్నాళ్లు పక్కన పెట్టి మరీ శంకర్ ‘ఇండియన్-2, 3’ సినిమాల మీద ఫోకస్ చేస్తే రామ్ చరణ్ అండ్ టీం ఓపిగ్గా ఎదురు చూసింది. అలాంటిది ఇప్పుడు ‘గేమ్ చేంజర్’ విడుదల ఆపాలని లైకా వాళ్లు నిర్మాతల మండలిని ఆశ్రయించడంతో చరణ్ అభిమానులకు ఒళ్లు మండేలా చేసింది.
నిజానికి ‘గేమ్ చేంజర్’ విడుదలై బాగా ఆడితే.. అది ‘ఇండియన్-3’కి కొంత అడ్వాంటేజ్ అవుతుంది. శంకర్ ఈజ్ బ్యాక్ అనిపిస్తే ‘ఇండియన్-3’కి బిజినెస్ పరంగా లాభం జరుగుతుంది. ఆ కోణంలో చూస్తే ‘గేమ్ చేంజర్’ సరిగ్గా రిలీజై బాగా ఆడాలని కోరుకోవాలి లైకా సంస్థ. కానీ అనూహ్యంగా ‘గేమ్ చేంజర్’ తమిళ రిలీజ్ ఆపాలని డిమాండ్ చేయడం తీవ్ర విమర్శలకు దారి తీసింది.
ఐతే తమిళ నిర్మాతల మండలి ‘గేమ్ చేంజర్’ రిలీజ్ ఏమీ ఆపట్లేదని.. ఈ సినిమా అనుకున్నట్లే తమిళంలో కూడా జనవరి 10నే విడుదల కాబోతోందని సమాచారం బయటికి రావడంతో మెగా ఫ్యాన్స్ ఊపిరి పీల్చుకున్నారు.
This post was last modified on January 7, 2025 10:17 am
ఒకప్పుడు టాలీవుడ్లో తిరుగులేని ఆధిపత్యం చలాయించిన కథానాయికల్లో తమన్నా ఒకరు. టీనేజీలోనే కథానాయిక అవతారం ఎత్తిన ఆమె పదేళ్లకు పైగానే టాప్…
థియేటర్, ఓటిటి మధ్య ఖచ్చితంగా ఎనిమిది వారాల గ్యాప్ ఉండాలనే నిబంధన మీద దక్షిణాది ఇండస్ట్రీ పెద్దలు చాలా సీరియస్…
అధికారంలోకి రావడానికి ముందు వరకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చాలా ఫెరోషియస్గా కనిపించేవారు. అవినీతి కేసుల వ్యవహారం పక్కన పెడితే…
‘బాహుబలి’ సినిమాకు బాలీవుడ్ నుంచి అప్పట్లో ఎంత గొప్ప సహకారం అందిందో తెలిసిందే. కరణ్ జోహార్ లాంటి అగ్ర నిర్మాత ఆ…
మోనాలిసా.. గత ఏడాది సోషల్ మీడియాను ఒక ఊపు ఊపేసిన పేరిది. ఉత్తర్ప్రదేశ్లో జరిగిన మహా కుంభమేళాతో వెలుగులోకి వచ్చిన…
తెలంగాణ ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్, మాజీ మంత్రి పార్టీ కీలక…