గేమ్ చేంజర్ సినిమా విడుదలకు ఇంకో నాలుగు రోజులే సమయం ఉండగా.. టీం మీద పెద్ద బాంబు వేయాలని చూసింది తమిళ అగ్ర నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్. తమ సంస్థలో శంకర్ రూపొందిస్తున్న ‘ఇండియన్-3’ పూర్తి కాకుండా ‘గేమ్ చేంజర్’ చిత్రాన్ని తమిళనాట విడుదల చేయడానికి వీల్లేదంటూ.. తమిళ నిర్మాతల మండలిని ఆశ్రయించింది లైకా సంస్థ.
దీంతో ‘గేమ్ చేంజర్’ తమిళ రిలీజ్ ఆగిపోతున్నట్లు.. తమిళ నిర్మాతల మండలి ఈ సినిమా టీంకు నోటీస్ ఇచ్చినట్లు వార్తలు వచ్చాయి. దీంతో ఒక్కసారిగా మెగా అభిమానులు లైకా ప్రొడక్షన్స్ సంస్థ మీద భగ్గుమన్నారు. ‘ఇండియన్-2’ ఆల్రెడీ గత ఏడాది విడుదలై పెద్ద డిజాస్టర్ అయింది. ఈ నేపథ్యంలో ‘ఇండియన్-3’ మీద ఎవ్వరికీ ఆశలు లేవు.
మరోవైపు ‘ఇండియన్-2’, ‘ఇండియన్-3’ సినిమాల వల్ల ‘గేమ్ చేంజర్’ చాలా ఆలస్యం అయింది. నిర్మాతకు చాలా నష్టం వాటిల్లింది. ‘గేమ్ చేంజర్’ను కొన్నాళ్లు పక్కన పెట్టి మరీ శంకర్ ‘ఇండియన్-2, 3’ సినిమాల మీద ఫోకస్ చేస్తే రామ్ చరణ్ అండ్ టీం ఓపిగ్గా ఎదురు చూసింది. అలాంటిది ఇప్పుడు ‘గేమ్ చేంజర్’ విడుదల ఆపాలని లైకా వాళ్లు నిర్మాతల మండలిని ఆశ్రయించడంతో చరణ్ అభిమానులకు ఒళ్లు మండేలా చేసింది.
నిజానికి ‘గేమ్ చేంజర్’ విడుదలై బాగా ఆడితే.. అది ‘ఇండియన్-3’కి కొంత అడ్వాంటేజ్ అవుతుంది. శంకర్ ఈజ్ బ్యాక్ అనిపిస్తే ‘ఇండియన్-3’కి బిజినెస్ పరంగా లాభం జరుగుతుంది. ఆ కోణంలో చూస్తే ‘గేమ్ చేంజర్’ సరిగ్గా రిలీజై బాగా ఆడాలని కోరుకోవాలి లైకా సంస్థ. కానీ అనూహ్యంగా ‘గేమ్ చేంజర్’ తమిళ రిలీజ్ ఆపాలని డిమాండ్ చేయడం తీవ్ర విమర్శలకు దారి తీసింది.
ఐతే తమిళ నిర్మాతల మండలి ‘గేమ్ చేంజర్’ రిలీజ్ ఏమీ ఆపట్లేదని.. ఈ సినిమా అనుకున్నట్లే తమిళంలో కూడా జనవరి 10నే విడుదల కాబోతోందని సమాచారం బయటికి రావడంతో మెగా ఫ్యాన్స్ ఊపిరి పీల్చుకున్నారు.
This post was last modified on January 7, 2025 10:17 am
భారత దేశ రాజకీయాల్లో ఎన్నో పార్టీలు పుడుతున్నాయి. ఆ వెంటనే కనుమరుగు అవుతున్నాయి. ఎక్కడో ఒకటి అరా పార్టీలు కొనసాగుతున్నా... అవన్నీ దాదాపుగా…
టాలీవుడ్లో క్యారెక్టర్ రోల్స్ తో ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న నటి సురేఖా వాణి. వందల సంఖ్యలో సినిమాలు చేసిన ఆమెకు…
ఈ వారం టాలీవుడ్లో ఒక ఆసక్తికర అరంగేట్రం జరిగింది. ఇండస్ట్రీలో అతి పెద్ద కుటుంబాల్లో ఒకటైన ఘట్టమనేని ఫ్యామిలీ నుంచి…
వైసీపీలో జగన్ అంటే ప్రాణం పెట్టేవారే ఉన్నారని, ఆయన గీసిన గీత దాటబోరని చెప్పే వారు కనిపిస్తారు. అయితే.. తాజాగా…
కథానాయికగా మలయాళంలో పరిచయం అయి.. తెలుగులో మంచి ఫాలోయింగ్, అవకాశాలు అందుకున్న అమ్మాయి అనుపమ పరమేశ్వరన్. ఆమె కెరీర్లో ఎక్కువ…
వైసీపీ నాయకుడు వాసుపల్లి గణేష్ ఎయిర్ పోర్టుకి పెళ్లికి లింక్ పెట్టి మాట్లాడ్డం సోషల్ మీడియాలో ట్రోల్ అవుతుంది. ఊరందరిదీ…