గేమ్ ఛేంజర్ ఈవెంట్ కు వెళ్లి వస్తున్న క్రమంలో హీరో రామ్ చరణ్ అభిమానులు ఇద్దరు రోడ్డు ప్రమాదానికి గురై మరణించిన సంగతి తెలిసిందే. అయితే, కాకినాడ – రాజమహేంద్రవరం మధ్య ఉన్న ఏడీబీ రోడ్డులో ఈ ప్రమాదం జరిగింది. ఆ రోడ్డులో అనేక గుంతలున్నాయని, ఐదేళ్లలో గత ప్రభుత్వం ఆ రోడ్డు మరమ్మతులను పట్టించుకోలేదని ఆరోపణలున్నాయి.
ఈ క్రమంలోనే ఆ ప్రమాద ఘటనపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్పందించారు. మృతుల కుటుంబాలకు పవన్ కల్యాణ్ ఆర్థిక సాయం ప్రకటించారు. జనసేన పార్టీ తరఫున మృతుల కుటుంబాలకు ఒక్కో కుటుంబానికి రూ.5 లక్షల చొప్పున ఆర్థిక సాయం అందిస్తామని తెలిపారు. అంతేకాకుండా, ఏపీ ప్రభుత్వం నుంచి తగిన సాయం అందించాలని డిప్యూటీ సీఎం కార్యాలయ అధికారులకు స్పష్టం చేశానని అన్నారు.
ఇప్పటికే నిర్మాత దిల్ రాజు, హీరో రామ్ చరణ్ కూడా అభిమానులకు 10 లక్షలు చొప్పున సహాయం ప్రకటించి, వారికి సంతాపం వ్యక్తం చేశారు. వారి కుటుంబాలకు అన్ని విధాలుగా అండగా ఉంటామని ప్రకటించారు.
ఇకపై, పిఠాపురం నియోజక వర్గ పర్యటనలకు ఏడీబీ రోడ్డు మీదుగా ప్రయాణిస్తానని తెలిపారు. జగన్ హయాంలో ఈ రోడ్డు గురించి పట్టించుకోలేదని, ఆ రోడ్డుపై ప్రయాణించిన ఇద్దరు యువకులు మణికంఠ, శ్రీ చరణ్ దుర్మరణం పాలు కావడంతో ఆవేదనకు లోనయ్యానని పవన్ అన్నారు.గత ప్రభుత్వం కనీసం ఆ రోడ్డుపై గుంతలు పూడ్చలేదని, లైట్లు వేయలేదని, అందుకే ప్రమాదాలు పెరిగాయిని విమర్శించారు.
కూటమి ప్రభుత్వం ఏడీబీ రోడ్డు పనులు చేపట్టిందని, త్వరలోనే పూర్తి చేస్తుందని అన్నారు. ఇళ్లకు సురక్షితంగా వెళ్ళాలని గేమ్ ఛేంజర్ ఈవెంట్ ప్రసంగంలో ఒకటికి రెండుసార్లు చెప్పానని గుర్తు చేసుకున్నారు. కాగా, మణికంఠ, చరణ్ ల కుటుంబ సభ్యులకు రూ.5 లక్షల చొప్పున ఆర్థఇక సాయం ప్రకటించారు నిర్మాత దిల్ రాజు.
This post was last modified on January 6, 2025 2:16 pm
మాములుగా ఒక సినిమా రిలీజయ్యాక దాని ఫలితంతో సంబంధం లేకుండా సక్సెస్ మీట్ల పేరుతో బాణా సంచా కాల్చడం, మీడియా…
ఢిల్లీ పర్యటనలో ఉన్న ఏపీ మంత్రి నారా లోకేష్.. మంగళవారం మధ్యాహ్నం కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాతో…
ఏపీలో అరటి పండ్ల ధర ఎంత..? ఎందుకీ రాద్దాంతం..? అరటి రైతులు కష్టాలు పడుతున్నారంటూ జగన్ చేసిన వ్యాఖ్యలు చర్చకు…
ఉప ముఖ్యమంత్రి మాటలను వక్రీకరించ వద్దంటూ జనసేన ఓ పార్టీ ప్రకటన విడుదల చేసింది. కొద్దిరోజుల కిందట పవన్ కళ్యాణ్…
దేశంలో పురాతన, బ్రిటీష్ కాలం నాటి పేర్లను, ఊర్లను కూడా మారుస్తున్న కేంద్రంలోని బీజేపీ నేతృత్వంలో ఉన్న ఎన్డీయే ప్రభుత్వం…
ఏపీ రాజధాని అమరావతిని ప్రపంచ స్థాయి మహానగరంగా నిర్మించాలని నిర్ణయించుకున్న సీఎం చంద్రబాబు.. ఆదిశగా వడి వడిగా అడుగులు వేస్తున్నారు.…