నిన్న గేమ్ ఛేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో పవన్ కళ్యాణ్ తన అన్నయ్య చిరంజీవి గురించి గొప్పగా చెప్పడం చూసి అభిమానులు ఎంతగా మురిసిపోయారో చూశాం. ఇది జరిగి ఇరవై నాలుగు గంటలు గడవక ముందే మెగాస్టార్ పాల్గొన్న మరో సందర్భం ఫ్యాన్స్ ని మరింత సంతోషంలో ముంచెత్తేలా చేసింది.
హైదరాబాద్ లో జరుగుతున్న ఆప్టా బిజినెస్ క్యాటలిస్ట్ కాన్ఫరెన్స్ కు ముఖ్యఅతిథిగా విచ్చేసిన చిరంజీవి ఆహుతులతో పలు కబుర్లు పంచుకున్నారు. నేరుగా సినిమాలకు సంబంధించిన వేడుక కాకపోయినా ప్రసంగంలో వచ్చిన సందర్భానికి అనుగుణంగా ఒక ముఖ్యమైన ముచ్చట చెప్పుకొచ్చారు.
చాలా ఏళ్ళ క్రితం పవన్ తో చిరంజీవి ఓ మాట అన్నారు. బాలీవుడ్ లో రాజ్ కపూర్ ఫ్యామిలీ ఎలా అయితే ఒక లెగసిని సృష్టించి ఎంతో మంది స్టార్లను ఇచ్చిందో అదే తరహాలో తెలుగులో మన కుటుంబం కూడా ఆ స్థాయికి చేరుకోవాలని అన్నారు. తర్వాత కాలం గడిచేకొద్దీ దాన్ని ఆయన మర్చిపోయారేమో కానీ పవన్ గుర్తుపెట్టుకున్నారు.
ముందు పవన్ కళ్యాణ్, ఆ తర్వాత రామ్ చరణ్ అటుపై సాయి ధరమ్ తేజ్, వరుణ్ తేజ్, వైష్ణవ్, నీహారిక ఇలా వరసగా తమ టాలెంట్లతో ఋజువు చేసుకున్నారు. ఇటీవలే పవన్ కలిసినప్పుడు చిరంజీవితో ఇది గుర్తు చేసి మంచి మనసుతో నువ్వు కోరుకున్నది ఇప్పుడు నెరవేరిందని సంతోషంగా చెప్పారు.
ఒక ఇంగ్లీష్ మ్యాగజైన్ లో కపూర్స్ అఫ్ సౌత్ ఇండియా అంటూ తమ గురించి వచ్చిన ఆర్టికల్ ని ప్రస్తావించారు చిరంజీవి. ఏదైతేనేం మరో అరుదైన జ్ఞాపకాన్ని షేర్ చేసుకున్న చిరు తన తమ్ముడి పేరు ఎత్తిన ప్రతిసారి ఆ సభలోనూ ఈలలు, కేకలు హోరెత్తిపోవడం విశేషం.
ప్రస్తుతం విశ్వంభర చివరి దశలో ఉన్న మెగాస్టార్ త్వరలోనే అనిల్ రావిపూడి స్క్రిప్ట్ ని ఫైనల్ చేయబోతున్నారు. అది ఓకే అయ్యాక సెట్స్ పైకి వెళ్లనుంది. ఇవన్నీ ఎలా ఉన్నా అన్నదమ్ముల మధ్య బాండింగ్ ఏ స్థాయిలో ఉందో రుజువు చేసేందుకే పలు ఈవెంట్లు వేదికగా మారడం ఫ్యాన్స్ కి మాములు సంతోషాన్ని ఇవ్వడం లేదు.
This post was last modified on January 5, 2025 10:21 pm
భర్త మహాశయులకు విజ్ఞప్తి ప్రీ రిలీజ్ ఈవెంట్ లో గెస్టుగా వచ్చిన దర్శకుడు బాబీ మాట్లాడుతూ రవితేజ రొటీన్ సినిమాలు…
వైసీపీ అధినేత జగన్పై ఏపీ సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతిపై జగన్ రెండు రోజుల కిందట…
తెలంగాణలో త్వరలో జరగనున్న మునిసిపల్ ఎన్నికల్లో జనసేన పార్టీ పోటీ చేయనున్నట్లు ఆ పార్టీ అధికారికంగా ప్రకటించింది.“త్వరలో జరగనున్న తెలంగాణ…
సినిమాల మీద మీమ్స్ క్రియేట్ చేయడంలో తెలుగు వాళ్లను మించిన వాళ్లు ఇంకెవ్వరూ ఉండరంటే అతిశయోక్తి కాదు. కొన్ని మీమ్స్…
అమరావతిని ఉద్దేశించి వైఎస్ జగన్ చేసిన వ్యాఖ్యలు రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర రాజకీయ దుమారాన్ని రేపాయి. రాజధానిని సో-కాల్డ్ నగరంగా అభివర్ణిస్తూ,…
సంక్రాంతి పండుగ వచ్చిందంటే చాలు…చిన్నా పెద్దా అని తేడా లేకుండా పతంగులు ఎగరేస్తుంటారు. పండుగ పూట కుటుంబ సభ్యులు, మిత్రులతో…