Movie News

సీఎం కావాల‌నుంది… త్రిష సంచ‌ల‌న స్టేట్మెంట్

హీరోయిన్లు రాజ‌కీయాల్లోకి రావాల‌నే ఆకాంక్ష‌ను వెల్ల‌డించ‌డం.. అందుకు అనుగుణంగానే సినిమాల్లో కెరీర్ ముగుస్తున్న ద‌శ‌లో ఆ రంగంలోకి అడుగు పెట్ట‌డం కొత్తేమీ కాదు. ఈ కోవ‌లో ఎంతోమందిని చూశాం. కానీ సినీ రంగం నుంచి రాజ‌కీయాల్లోకి అడుగు పెట్టి అత్యున్న‌త స్థాయికి చేరుకున్న వ్య‌క్తిగా జ‌య‌ల‌లిత పేరే చెప్పుకోవాలి. ఐతే ఆమె నేరుగా సీఎం అయిపోవాల‌న్న ల‌క్ష్యంతో ఏమీ రాజ‌కీయాల్లోకి రాలేదు.

ఎంజీఆర్ అనుయాయురాలిగా తీవ్ర ఇబ్బందిక‌ర ప‌రిస్థితులు ఎదుర్కొన్న క్ర‌మంలో ప‌ట్టుబ‌ట్టి రాజ‌కీయాల్లోకి వ‌చ్చారు. మొండి ప‌ట్టుద‌ల‌తో పోరాడి అత్యున్న‌త ప‌ద‌విని స్వీక‌రించారు. ఆమెకు ముందు, త‌ర్వాత సీఎం ప‌ద‌వి గురించి ఏ క‌థానాయిక క‌ల కూడా క‌ని ఉండ‌దు. ఐతే ఇప్పుడు త‌మిళ స్టార్ హీరోయిన్ త్రిష త‌న‌కీ ల‌క్ష్యం ఉన్న‌ట్లు వెల్ల‌డించి అంద‌రినీ షాక్‌కు గురి చేసింది.

ఎప్ప‌టికైనా త‌మిళ‌నాడు సీఎం కావాల‌న్న‌ది త‌న కోరిక అని ఆమె ఆశ్చ‌ర్య‌క‌ర ప్ర‌క‌ట‌న చేసింది. ప్రజాసేవతో పాటు సామాజిక మార్పులు రాజకీయాల వల్లే సాధ్యమని అభిప్రాయపడింది. త్రిష‌ వ్యాఖ్యలు తమిళ రాజకీయ, సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. త్రిష 20 ఏళ్ల కెరీర్‌ను పూర్తి చేసుకుంది ఇటీవ‌లే. ఆమె చాలా ఏళ్ల కింద‌టే సినిమాలు వ‌దిలేసి వ్య‌క్తిగ‌త జీవితంలో స్థిర‌ప‌డాల‌ని అనుకుంది.

కానీ వ‌రుణ్ మ‌ణియ‌న్‌తో ఎంగేజ్మెంట్ ర‌ద్ద‌వ‌డం.. మ‌ళ్లీ కెరీర్ పుంజుకోవ‌డంతో సినిమాల్లో కొన‌సాగింది. ఇప్పుడు వ‌య‌సు 40 పైబ‌డ్డా వ‌రుస సినిమాల‌తో దూసుకెళ్తోంది. కానీ ఇప్ప‌టిదాకా ఎన్న‌డూ త్రిష రాజ‌కీయాల గురించి పెద్ద‌గా మాట్లాడింది లేదు. తాను ఆ రంగంలోకి వ‌స్తాన‌నే సంకేతాలు కూడా ఇవ్వ‌లేదు.

కానీ ఇప్పుడు స‌డెన్‌గా ఒకేసారి ముఖ్య‌మంత్రి ప‌ద‌వి ల‌క్ష్య‌మ‌ని పేర్కొని అంద‌రినీ ఆశ్చ‌ర్యానికి గురి చేసింది. తమిళనాట రాజకీయాలు, సినిమాలకు విడదీయరాని సంబంధం ఉన్న విషయం తెలిసిందే. అగ్ర హీరో విజయ్ పూర్తి స్థాయి రాజ‌కీయాల్లోకి అడుగు పెట్ట‌బోతున్న వేళ.. అత‌డి స‌న్నిహితురాలైన‌ త్రిష ఇలాంటి ప్ర‌క‌ట‌న చేయ‌డం ప్రాధాన్యం సంత‌రించుకుంది.

This post was last modified on January 5, 2025 8:46 pm

Share
Show comments
Published by
Kumar

Recent Posts

పెద్ది మెడకు పర్సెంటేజ్ గొడవ

తెలంగాణలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానాన్ని అమలు చేయాలనే డిమాండ్ క్రమంగా తీవ్ర రూపం దాలుస్తోంది. ఇవాళ హైదరాబాద్ లో…

2 hours ago

‘నీట్’ గా పేపర్ అమ్మేశారట!

నీట్ యూజీ పేపర్ లీక్ వ్యవహారం దేశవ్యాప్తంగా సంచలనం రేపిన సంగతి తెలిసిందే. దేశవ్యాప్తంగా 22 మంది లక్షల విద్యార్థుల…

2 hours ago

భగీరథ్ కేసు వాదించేది వైసీపీ ఎంపీనే

కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ పై పోక్సో కేసు నమోదైన సంగతి తెలిసిందే.…

3 hours ago

కేరళం ‘సీల్డ్ కవర్’ తెరచుకునేదెన్నడో..?

దేశంలో ఇటీవలే ముగిసిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఎప్పుడో వెలువడ్డాయి. ఆ ఐదు రాష్ట్రాల్లో నాలుగు రాష్ట్రాల్లో…

3 hours ago

ప్రజలను ఆందోళనకు గురి చేస్తున్న మోదీ వ్యాఖ్యలు

యావత్తు ప్రపంచాన్ని కరోనా చుట్టుముట్టిన తరుణంలో లాక్ డౌన్ అంటే ఏమిటో… ఎలా ఉంటుందో చూశాం. ఇప్పుడు కరోనా లాంటి…

6 hours ago

ఒక్క ఓటుతో గెలిస్తే ఓటేయొద్దా…?

తమిళ రాజకీయాల్లో వరుసబెట్టి ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. తమిళనాడు అసెంబ్లీకి జరిగిన ఎన్నికల ఫలితాలు వెలువడిన దగ్గర నుంచి రోజుకో…

7 hours ago