సాక్ష్యాత్తు ఏపీ ఉప ముఖ్యమంత్రి అందులోనూ కోట్లాది అభిమానులున్న పవన్ కళ్యాణ్ పబ్లిక్ స్టేజి మీద పొగడటం కన్నా ఎవరికైనా కావాల్సింది ఏముంటుంది. నిన్న జరిగిన గేమ్ ఛేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో పవన్ మాట్లాడుతూ జనసేనను నడిపేందుకు డబ్బులు లేక ఇబ్బంది పడుతున్న టైంలో వకీల్ సాబ్ చేయడం కోసం ఇచ్చిన పారితోషికం ఇంధనంలా పని చేసిందని చెప్పడంతో దిల్ రాజు గారి ఆనందం అంతా ఇంతా కాదు.
ఆయన తొలిప్రేమని డిస్ట్రిబ్యూట్ చేసిన సందర్భాన్ని పవన్ గుర్తు చేసుకోవడం విశేషం. నిజానికి గేమ్ ఛేంజర్ నిర్మాతగా ఆయనకిది ఊహించని పొగడ్తని చెప్పాలి.
కొంచెం ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్తే ఎంత వాస్తవముందో అర్థమవుతుంది. అజ్ఞాతవాసి తర్వాత ఇకపై సినిమాలు చేయనని ప్రకటించిన పవన్ కళ్యాణ్ నిజంగానే మానేశారు. అయితే 2014లో జనసేన ఓటమి ఆర్థిక మూలలను దెబ్బ కొట్టింది. తిరిగి కోలుకోవాలంటే మళ్ళీ సంపాదించక తప్పని పరిస్థితి నెలకొంది.
అడిగితే అన్నయ్య ఆర్థికంగా అండగా ఉంటాడు కానీ పవన్ వ్యక్తిత్వం అందుకు ఒప్పుకోదు కాబట్టి మళ్ళీ మేకప్ వేసుకోవాలని నిర్ణయించుకున్నారు. అప్పటికే అడ్వాన్స్ ఇచ్చిన దిల్ రాజు వేగంగా తీయగలిగే కథ కోసం చూస్తూ పింక్ రీమేక్ ఆలోచన చేయడం, వేణు శ్రీరామ్ బరిలో దిగడం జరిగిపోయాయి.
వకీల్ సాబ్ వందల వేల కోట్లు వసూలు చేసిన బాహుబలి రేంజ్ కాదు కానీ దానికైన బడ్జెట్, జరిగిన బిజినెస్, రికవరీ కోణంలో సూపర్ హిట్ గా నిలిచింది. దీని తర్వాత పవన్ కళ్యాణ్ మరింత హుషారుగా తక్కువ టైంలో ఎక్కువ సినిమాలు చేసే దిశగా భీమ్లా నాయక్, బ్రో ఎంచుకోవడానికి ప్రేరేపించింది.
వకీల్ సాబ్ ఎంత రీమేకే అయినా అందులో పవన్ స్వాగ్, తమన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ని ఫ్యాన్స్ విపరీతంగా ఇష్టపడతారు. వకీల్ సాబ్ 2 చేస్తే ఎలా ఉంటుందనే ప్రతిపాదన దిల్ రాజు దగ్గర ఉంది కానీ రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ ఉన్న బిజీ చూస్తుంటే ఎంత మేరకు కార్యరూపం దాలుస్తుందో అనుమానమే.
This post was last modified on January 5, 2025 12:06 pm
దేశంలో అత్యధిక సినీ అభిమానం ఉన్న ప్రేక్షకులుగా తెలుగు ఆడియన్సుకి పేరుంది. తెలుగు రాష్ట్రాలు రెంటినీ కలిపి ఒక యూనిట్…
జగిత్యాల జిల్లాలోని ప్రసిద్ధ కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయ అభివృద్ధికి తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) రూ.30 కోట్ల నిధులను…
అటు ఢిల్లీలో కేంద్ర మంత్రులను కలిసి ఏపీకి నిధులు మంజూరు అయ్యేలా ప్రయత్నాలు చేస్తుంటారు. ఇటు తన శాఖలను సమర్థవంతంగా…
నిన్న జరిగిన ఛాంపియన్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కు రామ్ చరణ్ ముఖ్యఅతిధిగా రావడం హైప్ పరంగా దానికి మంచి…
వైసీపీ హయాంలో విశాఖపట్నంలోని ప్రఖ్యాత పర్యాటక ప్రాంతం రుషికొండను తొలిచి.. నిర్మించిన భారీ భవనాల వ్యవహారం కొలిక్కి వస్తున్నట్టు ప్రభుత్వ…
భారీ అంచనాలతో గత వారం విడుదలైన అఖండ 2 తాండవం నెమ్మదిగా సాగుతోంది. రికార్డులు బద్దలవుతాయని అభిమానులు ఆశిస్తే ఇప్పుడు…