పారితోషికాలు తీసుకుని సినిమాల్లో నటించేస్తారు కానీ చాలా మంది ఆర్టిస్టులు ప్రమోషన్లంటే మాత్రం అదేదో తమ బాధ్యత కాదన్నట్టు దూరంగా ఉంటారు. ఉదాహరణకు నయనతారనే తీసుకుంటే ఎన్ని కోట్లిచ్చినా ప్రీ రిలీజ్ పబ్లిసిటీకి మాత్రం ససేమిరా అంటుంది. ఒకవేళ అడిగినా ఇది నా పద్దతంటూ, ఇలాగే ఉంటానంటూ సమాధానం.
ఇప్పుడున్న పరిస్థితుల్లో లీడ్ యాక్టర్స్ ప్రచారంలో భాగమైతేనే మూవీని జనాలకు మరింత దగ్గర చేయగలం. ఈ మార్కెటింగ్ సూత్రాన్ని ఆణువణువూ వంటబట్టించుకోబట్టే ఆర్ఆర్ఆర్ లాంటి భారీ మల్టీ స్టారర్ కు సైతం రాజమౌళి ఇద్దరు హీరోలను పట్టుకుని దేశవిదేశాలు తిరిగి వచ్చాడు.
ఈ సందర్భంలో ఎస్జె సూర్య గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఇతర భాషల్లో సినిమాలు చేసినా సరే ప్రమోషన్లను మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మిస్ చేయడం లేదు. గేమ్ ఛేంజర్ కోసం హైదరాబాద్ వచ్చాడు. లోకల్ కాబట్టి చెన్నైలో పాల్గొన్నాడు. వెళ్లకపోయినా పెద్ద నష్టం లేదు కానీ శ్రమకోర్చి ముంబై వెళ్ళాడు.
శంకర్ లేడు కానీ ఎస్జె సూర్య ఉన్నాడు. అక్కడి నుంచి నేరుగా రాజమండ్రి చేరుకున్నాడు. తర్వాత బెంగళూరు ట్రిప్ ఉంది. ఏ చోటికి వెళ్లినా స్థానిక భాషలో మాట్లాడుతూ మీడియాకు ప్రేక్షకులకు మరింత దగ్గరవుతున్నాడు. అలాని ఎస్జె సూర్య డేట్లు దొరికేంత ఖాళీగా అయితే లేడు. రెండేళ్ల డైరీ బిజీగా ఉంది.
ఇప్పుడే కాదు గత ఏడాది సరిపోదా శనివారం కోసం కూడా ఎస్జె సూర్య ఇదే తరహాలో నాని, వివేక్ ఆత్రేయతో కలిసి ప్రమోషన్లలో ముందున్నాడు. చేతిలో ఏడెనిమిది సినిమాలతో యమా బిజీగా ఉన్న ఈ విలక్షణ నటుడు ఇంత ఓపిగ్గా తిరగడం చూస్తే రెమ్యునరేషన్ ఎక్కువ ఇచ్చినా తప్పు లేదనేది నిర్మాతల భావన.
పెర్ఫార్మన్స్ తో పాత్రను నిలబెట్టడం, స్వంతంగా డబ్బింగ్ చెప్పడం లాంటి లక్షణాలు దర్శకులకు బెస్ట్ ఛాయస్ గా మారుస్తున్నాయి. పవన్ కళ్యాణ్ తో ఖుషి లాంటి ఇండస్ట్రీ హిట్ ఇచ్చిన దర్శకుడు రెండు దశాబ్దాల తర్వాత మోస్ట్ వాంటెడ్ ఆర్టిస్టుగా మారిపోవడం మంచి ప్రయాణానికి ఉదాహరణ.
This post was last modified on January 4, 2025 5:36 pm
వచ్చే వారం ది కేరళ స్టోరీ 2 విడుదల కానుంది. మూడేళ్ళ క్రితం వచ్చిన మొదటి భాగం ఎంత సంచలనం…
రాజకీయ పార్టీలు ఓట్ల కోసం కురిపిస్తున్న ఉచితాల ఆఫర్లపై దేశ సర్వోన్నత న్యాయస్థానం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. కేవలం…
ఒకప్పుడు శంకర్తో సినిమా చేయడానికి వివిధ ఇండస్ట్రీల టాప్ స్టార్లు, అగ్ర నిర్మాతలు లైన్లో ఉండేవారు. మెగాస్టార్ చిరంజీవి అంతటి…
ఏపీ అసెంబ్లీలో బడ్జెట్ సమావేశాలు ఎగ్గొట్టిన మాజీ సీఎం జగన్…తాపీగా ఈ రోజు మీడియా ముందుకు వచ్చారు. బడ్జెట్ లో…
ఫంకీ ఫలితం త్వరగా తేలిపోవడంతో హీరో విశ్వక్ సేన్, నిర్మాణ సంస్థ సితార హఠాత్తుగా సైలెంటైపోయాయి. ఊరికే లేనిపోని హడావిడి…
వైసీపీ మాజీ ఎంపీ, ఆ పార్టీ మాజీ నేత రఘురామకృష్ణరాజు కస్టోడియల్ టార్చర్ వ్యవహారం జగన్ హయాంలో దేశవ్యాప్తంగా సంచలనం…