ఒకప్పటి సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ దివంగత శ్రీదేవికి ఎంత పెద్ద వీరాభిమానో తెలిసిందే. శివ తర్వాత కేవలం తన అభిమాన నటి కోసం క్షణ క్షణం రాసుకుని ఈ సినిమా ఆమెకు రాసిన ప్రేమలేఖని గర్వంగా చెప్పుకున్నారు. అందుకే అందులో వెంకటేష్ ఎంట్రీ ఆలస్యంగా అరగంట తర్వాత ఉంటుందని, అప్పటిదాకా శ్రీదేవినే హైలైట్ చేశారనే కామెంట్స్ పత్రికల్లో వచ్చాయి.
తర్వాత వర్మ గోవిందా గోవిందా చేశారు కానీ అది ఫ్లాపయ్యాక తిరిగి ఈ కలయిక సాధ్యం కాలేదు. అంతగా ఆరాధించిన శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ మీద ఆయన అభిప్రాయం ఎలా ఉందో తెలుసుకోవాలనే ఆసక్తి ఉండటం సహజం.
ఇటీవలే ఒక ఇంటర్వ్యూలో ఆ సందర్భం వస్తే నిర్మొహమాటంగా శ్రీదేవి అందం జాన్వీకి రాలేదని, ఒకవేళ అవకాశం వచ్చినా తనతో ఇప్పట్లో సినిమా తీసే ఉద్దేశం లేదని చెప్పారు. సరే వర్మ అనుకోవడం ఏమిటో కానీ అసలు జాన్వీ కపూర్ ఒప్పుకుంటుందా అనేది అసలు ప్రశ్న. ఎందుకంటే గతాన్ని పక్కనపెడితే ఇప్పుడీ విలక్షణ దర్శకుడి ట్రాక్ రికార్డు అస్సలు బాలేదు.
రాజకీయాల్లోకి వచ్చి పొలిటికల్ ఎజెండాతో సినిమాలు తీయడం మొదలుపెట్టాక వింటేజ్ ఇమేజ్ పోయింది. పాత క్లాసిక్స్ ని చూసుకుని మురిసిపోవడం తప్ప ప్రత్యేకంగా వర్మ తీసే కొత్త చిత్రాల కోసం ఎదురు చూసే ఫ్యాన్స్ తగ్గిపోయారు.
అన్నట్టు వర్మ మాస్టర్ పీస్ సత్య ఈ నెల 17 థియేటర్లలో రీ రిలీజ్ కాబోతోంది. రీ మాస్టర్ చేసిన సరికొత్త ప్రింట్ తో కొత్తగా తీసుకొస్తున్నారు. దీనికున్న కల్ట్ ఫాలోయింగ్ కి మంచి వసూళ్లు వస్తాయనే అంచనా ఉంది. జెడి చక్రవర్తి, మనోజ్ బాజ్ పాయ్ లకు పెద్ద బ్రేక్ ఇచ్చిన సత్య కమర్షియల్ గానూ అద్భుతాలు చేసింది.
ఈ సందర్భంగా ప్రత్యేక ప్రమోషన్లు కూడా చేయబోతున్నారు. జెడి, ఊర్మిళ, మనోజ్ తో పాటు నటించిన, పని చేసిన టీమ్ దాదాపుగా అందుబాటులోనే ఉంది. వాళ్ళందరిని ఇందులో భాగం చేయబోతున్నారు. రామ్ గోపాల్ వర్మ గర్వంగా చెప్పుకునే గత జ్ఞాపకాల్లో సత్యది ప్రత్యేక స్థానం మరి.
This post was last modified on January 4, 2025 3:41 pm
సంక్రాంతి, దసరా లాంటి పెద్ద పండుగలను పక్కన పెడితే.. ఒక పెద్ద సినిమా రిలీజవుతున్నపుడు చిన్న సినిమాలు పోటీలో ఉండడం…
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తాజాగా బుధవారం సాయంత్రం అసెంబ్లీలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కుటుంబానికి చెందినవారు, ఆయన పార్టీకి…
ఇటీవల సినీ ప్రముఖులకు, వారి కుటుంబ సభ్యులకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వివిధ పదవులు కట్టబెట్టి ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు.…
సంక్రాంతి పండక్కు వస్తామని జనవరి 12 డేట్ వేసుకున్న సాయి దుర్గ తేజ్ సంబరాల ఏటిగట్టు ఆ తర్వాత పూర్తిగా…
బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ పై ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్రస్థాయిలో నిప్పులు చెరిగారు. 22ఏ భూములపై…
మానవ సంబంధాలన్నీ ఆర్ధిక సంబంధాలే అని చరిత్రలో ఎన్నో ఘటనలు రుజువు చేశాయి. కాసుల కంటే కని పెంచిన తలిదండ్రులు…