ఒకప్పటి సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ దివంగత శ్రీదేవికి ఎంత పెద్ద వీరాభిమానో తెలిసిందే. శివ తర్వాత కేవలం తన అభిమాన నటి కోసం క్షణ క్షణం రాసుకుని ఈ సినిమా ఆమెకు రాసిన ప్రేమలేఖని గర్వంగా చెప్పుకున్నారు. అందుకే అందులో వెంకటేష్ ఎంట్రీ ఆలస్యంగా అరగంట తర్వాత ఉంటుందని, అప్పటిదాకా శ్రీదేవినే హైలైట్ చేశారనే కామెంట్స్ పత్రికల్లో వచ్చాయి.
తర్వాత వర్మ గోవిందా గోవిందా చేశారు కానీ అది ఫ్లాపయ్యాక తిరిగి ఈ కలయిక సాధ్యం కాలేదు. అంతగా ఆరాధించిన శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ మీద ఆయన అభిప్రాయం ఎలా ఉందో తెలుసుకోవాలనే ఆసక్తి ఉండటం సహజం.
ఇటీవలే ఒక ఇంటర్వ్యూలో ఆ సందర్భం వస్తే నిర్మొహమాటంగా శ్రీదేవి అందం జాన్వీకి రాలేదని, ఒకవేళ అవకాశం వచ్చినా తనతో ఇప్పట్లో సినిమా తీసే ఉద్దేశం లేదని చెప్పారు. సరే వర్మ అనుకోవడం ఏమిటో కానీ అసలు జాన్వీ కపూర్ ఒప్పుకుంటుందా అనేది అసలు ప్రశ్న. ఎందుకంటే గతాన్ని పక్కనపెడితే ఇప్పుడీ విలక్షణ దర్శకుడి ట్రాక్ రికార్డు అస్సలు బాలేదు.
రాజకీయాల్లోకి వచ్చి పొలిటికల్ ఎజెండాతో సినిమాలు తీయడం మొదలుపెట్టాక వింటేజ్ ఇమేజ్ పోయింది. పాత క్లాసిక్స్ ని చూసుకుని మురిసిపోవడం తప్ప ప్రత్యేకంగా వర్మ తీసే కొత్త చిత్రాల కోసం ఎదురు చూసే ఫ్యాన్స్ తగ్గిపోయారు.
అన్నట్టు వర్మ మాస్టర్ పీస్ సత్య ఈ నెల 17 థియేటర్లలో రీ రిలీజ్ కాబోతోంది. రీ మాస్టర్ చేసిన సరికొత్త ప్రింట్ తో కొత్తగా తీసుకొస్తున్నారు. దీనికున్న కల్ట్ ఫాలోయింగ్ కి మంచి వసూళ్లు వస్తాయనే అంచనా ఉంది. జెడి చక్రవర్తి, మనోజ్ బాజ్ పాయ్ లకు పెద్ద బ్రేక్ ఇచ్చిన సత్య కమర్షియల్ గానూ అద్భుతాలు చేసింది.
ఈ సందర్భంగా ప్రత్యేక ప్రమోషన్లు కూడా చేయబోతున్నారు. జెడి, ఊర్మిళ, మనోజ్ తో పాటు నటించిన, పని చేసిన టీమ్ దాదాపుగా అందుబాటులోనే ఉంది. వాళ్ళందరిని ఇందులో భాగం చేయబోతున్నారు. రామ్ గోపాల్ వర్మ గర్వంగా చెప్పుకునే గత జ్ఞాపకాల్లో సత్యది ప్రత్యేక స్థానం మరి.
This post was last modified on January 4, 2025 3:41 pm
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తెలుగులో ఎన్నో విజయవంతమైన చిత్రాలు వచ్చాయి. తొలినాళ్లలో తీసిన చాలా సినిమాలు బ్లాక్ బస్టర్…
ప్రపంచమంతా ఉత్కంఠగా ఎదురుచూస్తున్న సమావేశం ఢిల్లీలోని హైదరాబాద్ హౌస్లో జరిగింది. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, భారత ప్రధాని నరేంద్ర…
ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ కీలక వ్యాఖ్యలు చేశారు. రాజకీయాలు చేయడం తనకు కొత్త కాదని, ఎన్నికల్లో పోటీ చేయడం…
`సారీ మైలార్డ్.. ఇకపై అలాంటి తప్పులు జరగవు`` - అని తెలంగాణ హైకోర్టుకు హైడ్రా కమిషనర్, ఐపీఎస్ అధికారి రంగనాథ్…
పార్వతీపురం మన్యం జిల్లాలో నిర్వహించిన మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ లో సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ పాల్గొన్నారు. ఈ…
నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీనుల బ్లాక్ బస్టర్ కాంబినేషన్లో తెరకెక్కిన సినిమా.. అఖండ-2. అంతా అనుకున్నట్లు జరిగితే.. ఈపాటికి ఈ…