ఒకప్పటి సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ దివంగత శ్రీదేవికి ఎంత పెద్ద వీరాభిమానో తెలిసిందే. శివ తర్వాత కేవలం తన అభిమాన నటి కోసం క్షణ క్షణం రాసుకుని ఈ సినిమా ఆమెకు రాసిన ప్రేమలేఖని గర్వంగా చెప్పుకున్నారు. అందుకే అందులో వెంకటేష్ ఎంట్రీ ఆలస్యంగా అరగంట తర్వాత ఉంటుందని, అప్పటిదాకా శ్రీదేవినే హైలైట్ చేశారనే కామెంట్స్ పత్రికల్లో వచ్చాయి.
తర్వాత వర్మ గోవిందా గోవిందా చేశారు కానీ అది ఫ్లాపయ్యాక తిరిగి ఈ కలయిక సాధ్యం కాలేదు. అంతగా ఆరాధించిన శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ మీద ఆయన అభిప్రాయం ఎలా ఉందో తెలుసుకోవాలనే ఆసక్తి ఉండటం సహజం.
ఇటీవలే ఒక ఇంటర్వ్యూలో ఆ సందర్భం వస్తే నిర్మొహమాటంగా శ్రీదేవి అందం జాన్వీకి రాలేదని, ఒకవేళ అవకాశం వచ్చినా తనతో ఇప్పట్లో సినిమా తీసే ఉద్దేశం లేదని చెప్పారు. సరే వర్మ అనుకోవడం ఏమిటో కానీ అసలు జాన్వీ కపూర్ ఒప్పుకుంటుందా అనేది అసలు ప్రశ్న. ఎందుకంటే గతాన్ని పక్కనపెడితే ఇప్పుడీ విలక్షణ దర్శకుడి ట్రాక్ రికార్డు అస్సలు బాలేదు.
రాజకీయాల్లోకి వచ్చి పొలిటికల్ ఎజెండాతో సినిమాలు తీయడం మొదలుపెట్టాక వింటేజ్ ఇమేజ్ పోయింది. పాత క్లాసిక్స్ ని చూసుకుని మురిసిపోవడం తప్ప ప్రత్యేకంగా వర్మ తీసే కొత్త చిత్రాల కోసం ఎదురు చూసే ఫ్యాన్స్ తగ్గిపోయారు.
అన్నట్టు వర్మ మాస్టర్ పీస్ సత్య ఈ నెల 17 థియేటర్లలో రీ రిలీజ్ కాబోతోంది. రీ మాస్టర్ చేసిన సరికొత్త ప్రింట్ తో కొత్తగా తీసుకొస్తున్నారు. దీనికున్న కల్ట్ ఫాలోయింగ్ కి మంచి వసూళ్లు వస్తాయనే అంచనా ఉంది. జెడి చక్రవర్తి, మనోజ్ బాజ్ పాయ్ లకు పెద్ద బ్రేక్ ఇచ్చిన సత్య కమర్షియల్ గానూ అద్భుతాలు చేసింది.
ఈ సందర్భంగా ప్రత్యేక ప్రమోషన్లు కూడా చేయబోతున్నారు. జెడి, ఊర్మిళ, మనోజ్ తో పాటు నటించిన, పని చేసిన టీమ్ దాదాపుగా అందుబాటులోనే ఉంది. వాళ్ళందరిని ఇందులో భాగం చేయబోతున్నారు. రామ్ గోపాల్ వర్మ గర్వంగా చెప్పుకునే గత జ్ఞాపకాల్లో సత్యది ప్రత్యేక స్థానం మరి.
తెలుగు మూవీ లవర్స్ చిరకాల వాంఛ ఐమాక్స్ గురించి గత రెండు మూడు రోజులుగా సోషల్ మీడియాలో ఎడతెగని చర్చ…
దక్షిణాదిన క్యారెక్టర్, విలన్ పాత్రలకు మాంచి డిమాండ్ ఉన్న నటుల్లో విజయ్ సేతుపతి ఒకడు. సుకుమార్ అంతటి పెద్ద దర్శకుడు…
అదేంటి పెద్ది వస్తుంటే ఇంకెవరు పోటీకి దిగుతారనే డౌట్ వస్తోందా. టాలీవుడ్ ప్రొడ్యూసర్లు అంత సాహసం చేయరు కానీ ఇతర…
తెలుగులో రిలీజయ్యే ఏ సినిమాకైనా అటు ఏపీలో, ఇటు తెలంగాణలో ఒకేసారి షోలు మొదలుపెట్టాల్సి ఉంటుంది. ఒకట్రెండు గంటల తేడా…
జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఢిల్లీ టూర్ పై ఓ రేంజి తరహా వ్యాఖ్యలు చేసిన…
జనసేన అదినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పై తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ సంచలన వ్యాఖ్యలు గుప్పించారు.…